India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
TG: హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతరకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన రాగానే అక్కడి ఏర్పాట్లపై భక్తులు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అధికారుల తీరుపై కోపంతో మంత్రి వసతి గృహం వద్ద నేలపై కూర్చున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు గర్భగుడిలోకి వెళ్లలేదు. అనంతరం ప్రెస్మీట్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
రష్యా సైన్యంలో పనిచేస్తున్న తమ పౌరుల విడుదలను వేగవంతం చేయాలని భారత్ మరోసారి కోరింది. కేరళకు చెందిన ఓ యువకుడు ఇటీవల యుద్ధంలో మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన దురదృష్టకరమని భారత్ పేర్కొంది. కేరళ యువకుడి మృతదేహాన్ని తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎంబసీ తెలిపింది. భారతీయుల తరలింపునకు రష్యా ప్రభుత్వ వర్గాలతో చర్చిస్తున్నట్టు వెల్లడించింది.
శబరిమల కొండల్లో మకరజ్యోతి సాక్షాత్కారమైంది. అంతకుముందు పందళ రాజవంశీయులు తిరువాభరణాలతో సన్నిధానానికి చేరుకొని మణికంఠుడికి సమర్పించారు. పూజారులు వాటిని అయ్యప్పకు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వామి సన్నిధి తలుపులు తెరుచుకోగానే మరోవైపు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో భక్తులంతా జ్యోతిని దర్శించుకొని పులకించిపోయారు.
రేపు జరగాల్సిన యూజీసీ నెట్-2025 పరీక్షను <<15149513>>వాయిదా<<>> వేసిన NTA తాజాగా రీషెడ్యూల్ తేదీలను ప్రకటించింది. ఈనెల 21న ఉదయం, 27న మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా సంక్రాంతి సందర్భంగా 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ నిన్న NTA ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
గేమ్ ఛేంజర్ మూవీకి తన మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని గ్లోబల్ స్టార్ రామ్చరణ్ అన్నారు. తనతో పాటు ఈ మూవీ కోసం కష్టపడ్డ ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. ఇకపైనా తన పర్ఫార్మెన్స్తో అభిమానులను గర్వపడేలా చేస్తానని ఇన్స్టాలో రాసుకొచ్చారు. చివరిగా తనకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్కు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు.
TG: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో పండగ రోజు రైతుల కల నెరవేరిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. దీని ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నట్లు చెప్పారు. ఎంపీ అర్వింద్ పట్టుదలతో తన హామీ నెరవేర్చుకున్నారని చెప్పారు. రైతుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి రైతులు తమ ఆశీర్వాదం అందించాలని బండి కోరారు.
AP: మనదేశానికి జనాభే అతిపెద్ద ఆదాయ వనరు అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ అని చెప్పా. కానీ ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెబుతున్నా. పిల్లలే మీ ఆస్తి. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్టు. జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల్లో యువత లేక మనవాళ్లను అడుగుతున్నారు. ఇటీవల MP ప్రభుత్వం కూడా నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించింది’ అని CBN తెలిపారు.
BGTలో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికైన స్టార్ బౌలర్ బుమ్రా మరో ఘనత సాధించారు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి King’s College Londonలో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సులో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. ఆమె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరుకానున్నారు. 16న డిగ్రీ ప్రదానోత్సవం జరగనుంది. అనంతరం నెలాఖరున జగన్ లండన్ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Sorry, no posts matched your criteria.