News January 14, 2025

విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్టే!

image

TG: వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను పెంచొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఛార్జీల పెంపునకు డిస్కంలు అనుమతి కోరగా తిరస్కరించింది. ప్రస్తుత ఛార్జీలనే కొనసాగించాలని ఆదేశించింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ERCకి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ మేరకు ఈనెల 18న డిస్కంలు తమ ప్రతిపాదనలను ERCకి సమర్పించే ఛాన్సుంది. డిస్కంల నష్టాల మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే ఛార్జీల పెంపు ఉండదని సమాచారం.

News January 14, 2025

ALERT.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతిలో ఇవాళ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. నిన్న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతితో సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది.

News January 14, 2025

Way2News: 24 గంటలూ వార్తల ‘పండుగే’

image

‘ఈరోజు సంక్రాంతి సెలవు కారణంగా రేపు పేపర్ రాదు. పునర్దర్శనం గురువారం’ అని వార్తాపత్రికల్లో చదువుతుంటాం. ఈరోజు వార్తలను చదివేందుకు మీరు మరుసటి రోజు వరకు వేచిచూడాల్సిన పని లేదు. ఎప్పటిలాగే పండుగ నాడు కూడా Way2News ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. సెలవుల్లోనూ 24/7 బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, సినిమాలు, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ కంటెంట్ వస్తూనే ఉంటాయి.
*Way2News యూజర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు

News January 14, 2025

నేడు మకరజ్యోతి దర్శనం

image

నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనమివ్వనుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండడంతో కేరళ ప్రభుత్వం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించింది. జ్యోతిని దర్శించుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. జ్యోతి దర్శనం సాయంత్రం 6-7 గంటల మధ్య జరగనుంది. దీని కోసం లక్ష మందికిపైగా అయ్యప్ప భక్తులు వస్తారని అంచనా.

News January 14, 2025

స్టేషన్‌లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అర్ధరాత్రి కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. స్టేషన్‌లోనే ఆయనకు బస ఏర్పాటు చేయగా ఉదయాన్నే వైద్య పరీక్షలు నిర్వహించారు. 9 గంటలకు కరీంనగర్ రెండవ అదనపు జుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరచనున్నారు. మరోవైపు కౌశిక్ అరెస్టును బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

News January 14, 2025

సంక్రాంతి: పుణ్యకాలం సమయం ఇదే.. ఏం చేయాలంటే?

image

సంక్రాంతి రోజున స్నానం, దానం, పూజకు విశిష్ఠ స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని అభ్యంగ స్నానం చేయాలి. ఇవాళ పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. శని దోషం ఉన్నవారు ఈ రోజున నువ్వులు దానం చేస్తే శనీశ్వరుడు శాంతిస్తాడని నమ్మకం. ఉ.9.03 గం. నుంచి ఉ.10.48 గం. వరకు పుణ్యకాలం ఉందని, ఈ సమయంలో పూజలు, దానం చేస్తే సూర్యభగవానుడు విశేష ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.

News January 14, 2025

గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం: CM

image

TG: ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటించబోతున్నట్లు CM రేవంత్ వెల్లడించారు. సింగపూర్‌లో స్కిల్ వర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతామన్నారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటామని చెప్పారు. గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధించడమే తమ లక్ష్యమన్నారు. గత ఏడాది దావోస్‌లో ₹40,232 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.

News January 14, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ పబ్లిక్ టాక్

image

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమాలో కామెడీ అదిరిపోయిందని, వెంకీ నటన ఇరగదీశారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. స్టోరీ అంతగా లేదని, లాజిక్స్ వెతకకుండా చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుందని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News January 14, 2025

నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు: భట్టి

image

TG: రాష్ట్రంలో కొత్తగా తీసుకురానున్న 4 సంక్షేమ పథకాల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వీటిలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.22,500 కోట్లు, రైతు భరోసాకు రూ.18వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News January 14, 2025

క్రేజీ.. మహా కుంభమేళాలో ‘అఖండ-2’ షూట్

image

సంగీత దర్శకుడు తమన్ ‘అఖండ-2’ మూవీ గురించి అదిరిపోయే అప్టేడ్ ఇచ్చారు. యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ మూవీ షూటింగ్ జరగనుందని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్ట్-1 సూపర్ హిట్ అవ్వగా పార్ట్-2పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్’ పాజిటివ్ సొంతం చేసుకుంది.