India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రీయ గీతాన్ని వివాదం చేయడం తగదని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం కొనసాగింపు లేదా తొలగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మెజారిటీ ప్రజల ఇష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న విశ్వాసం ఉన్నట్లు పేర్కొన్నారు.
T20 WC మ్యాచులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూయార్క్లోని నసావు కౌంటీ స్టేడియం చుట్టూ పోలీస్ స్నైపర్స్ను ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఈనెల 12 వరకు ఇక్కడ జరిగే మ్యాచులకు స్పెషల్ వెపన్స్&టాక్టిక్స్ టీమ్స్తో పాటు స్నైపర్స్ భద్రతగా ఉంటారు. అలాగే డ్రోన్ దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే వేదికలో ఈనెల 9న IND, PAK మ్యాచ్ జరగనుంది.
రేపు కౌంటింగ్ జరగనుండగా ఎలక్షన్ ఫలితాల పేరుతో మోసగాళ్లు సైబర్ నేరాలకు తెరలేపారు. వాట్సాప్లో ఫేక్ ఫైల్స్, లింకులు పంపుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వాటిని ఓపెన్ చేయొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీీసీఎస్ పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్ ఫైల్స్తో మొబైల్ హ్యాక్ లేదా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్కు నాగ్పూర్ కోర్టు జీవితఖైదు విధించింది. పాకిస్థాన్ ISIకి రహస్య సమాచారం చేరవేశారనే కేసులో అతడు దోషిగా తేలాడు. దీంతో కోర్టు నిషాంత్కు అధికారిక రహస్యాల చట్టం కింద మరో 14 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.3000 ఫైన్ వేసింది. నాగ్పూర్లోని మిస్సైల్ సెక్షన్లో టెక్నికల్ రీసెర్చ్ సెంటర్లో ఇంజినీర్గా పనిచేసే నిషాంత్ను ATS అధికారులు 2018లో అరెస్ట్ చేశారు.
క్రికెటర్ హార్దిక్ పాండ్య-నటి నటాషా విడాకులు తీసుకోలేదా? మళ్లీ కలిసి పోయారా? అంటే నటాషా ఇన్స్టా ఖాతాను చూస్తే అవుననే అనిపిస్తోంది. తన ఇన్స్టాలో పెళ్లి ఫొటోలను తొలగించి డివోర్స్ వార్తలకు ఛాన్స్ ఇచ్చిన ఆమె తాజాగా వాటిని రీస్టోర్ చేశారు. నటాషా ఖాతాలో పెళ్లి ఫొటోలు కనిపిస్తున్నాయి. దీంతో మనసు మార్చుకుని మళ్లీ ఇరువురూ కలిసిపోయినట్లు తెలుస్తోంది. వీరికి 2020లో పెళ్లి కాగా కొడుకు అగస్త్య ఉన్నారు.
TG సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. CM కాన్వాయ్ ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చేది. ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి లోపలికి, నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక సౌత్ ఈస్ట్ నుంచి అధికారుల రాకపోకలు సాగనున్నాయట. గతంలో ఆరో అంతస్తులో ఉన్న CM ఆఫీసును 9వ అంతస్తులోకి మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2,507 పాయింట్లు లాభపడి 76,468 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 733 పాయింట్లు వృద్ధి చెంది 23,263 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్గ్రిడ్, ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఎయిర్టెల్, విప్రో, మారుతీ, ITC షేర్లు భారీ లాభాలు పొందాయి.
AP: గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచనలు చేసింది. అభ్యర్థులందరూ తమ పోస్ట్, జోనల్/జిల్లా ప్రాధాన్యతలను ఈ నెల 5 నుంచి 18 వరకు <
AP: ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ‘సైకిల్ తొక్కడం ఉత్తమ వ్యాయామం. శరీరాన్ని ఫిట్గా ఉంచడంలో సైక్లింగ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడాన్ని కొనసాగించండి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి తాను సైకిల్ తొక్కుతున్న ఫొటోను జతచేశారు. తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా సైకిల్ అన్న విషయం తెలిసిందే.
TG: రేపు లోక్సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులు, ఇన్ఛార్జ్ మంత్రులు, AICC సెక్రటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్లుగా పంపాలని తెలిపారు. ఈవీఎం ఓట్లకు, <<13311502>>17సీ<<>> లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.