India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో జన్మించిన జగన్నాథం మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టర్గా సేవలందించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో TDP, 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014లో BRS తరఫున పోటీ చేసి ఓడిన ఆయన 2024లో BSPలో చేరినా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
జవహర్లాల్ నెహ్రూ పొరపాటున దేశ ప్రధాని అయ్యారని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభిప్రాయపడ్డారు. ఆయన కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్ ఆ పదవికి అర్హులని పేర్కొన్నారు. అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ కొనసాగించిందన్నారు. ఖట్టర్ వ్యాఖ్యలను హరియాణా మాజీ సీఎం భూపేందర్ హుడా తిప్పికొట్టారు. పొరపాటున సీఎం అయిన వ్యక్తులు ఇలా మాట్లాడకూడదని చురకలు అంటించారు.
సంక్రాంతి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి నదీ స్నానం చేయాలి. అనంతరం నూతన దుస్తులు ధరించి దేవుడి పూజ చేయాలి. మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తూ సూర్య మంత్రం జపించాలి. ఎవరైనా దానం కోసం వస్తే వారికి తోచినంత ధనం, దుస్తులు, ఆహారం, వస్తువులు ఇవ్వాలి. చలికాలం కాబట్టి అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేయొచ్చు. ఇంటి ముందు రథం రూపంలో ముగ్గు వేసుకుంటే మంచిది.
AP: రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. BCలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో సగం రాయితీ ఉంటుంది. జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.8 లక్షలు ఇవ్వనుంది. ఇందులో రూ.4 లక్షలు రాయితీ ఇస్తారు. EBCలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తోంది. ఇందులోనూ 50 శాతం రాయితీ ఇస్తోంది. MPDO ఆఫీస్లో అప్లై చేసుకోవాలి.
TG: సంక్రాంతి తర్వాత మరింత మంది BRS MLAలు కాంగ్రెస్లో చేరతారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై KTR స్పందించారు. ‘ఓవైపు HYDలో జరిగే సంవిధాన్ బచావో(రాజ్యాంగాన్ని కాపాడండి) ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని అంటున్నారు. మరోవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి BRS MLAలను చేర్చుకుంటామని TPCC చీఫ్ చెబుతున్నారు. రాహుల్ జీ.. మీరు గొప్ప మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు.
భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్ట్రీ సమన్లు పంపింది. సరిహద్దులోని 5 ప్రాంతాల్లో BSF ఫెన్సింగ్ నిర్మాణం, ఉద్రిక్తతలపై ఆరాతీసినట్టు సమాచారం. ఫారిన్ సెక్రటరీ జాషిమ్ ఉద్దీన్తో 3PMకు మొదలైన వర్మ మీటింగ్ 45ని. సాగినట్టు స్థానిక BSS న్యూస్ తెలిపింది. సరిహద్దు వెంట భద్రత, ఫెన్సింగ్, నేరాల కట్టడిపై రెండు దేశాలకు అవగాహనా ఒప్పందాలు ఉన్నాయని, పరస్పరం సహకరించుకుంటాయని వర్మ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రేపు భోగి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. భోగి మంటల వద్ద పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెట్రోల్, డీజిల్ లాంటి మండే పదార్థాలను దూరంగా ఉంచాలి. మంట చుట్టూ చేరేవారు కాటన్ దుస్తులు ధరించాలి. శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు మంటలకు దూరంగా ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి వీలుగా దగ్గర్లో నీళ్లు, దుప్పట్లు ఉంచుకోవాలి.
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ‘నో హెల్మెట్-నో ఫ్యూయెల్’ విధానాన్ని అమలు చేయాలని UP ప్రభుత్వం నిర్ణయించింది. హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ పోయవద్దని బంకులను ఆదేశించింది. పిలియన్ రైడర్ సైతం హెల్మెట్ ధరించాలని పేర్కొంది. ఈ రూల్స్ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాలను ఆదేశించింది. ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల UPలో 25,000-26,000 మంది చనిపోతున్నట్లు ఇటీవల CM యోగి తెలిపారు.
ఐర్లాండ్ మహిళల టీమ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 116 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో వన్డే మిగిలి ఉండగానే స్మృతి మంధాన సేన 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత 370/5 స్కోర్ చేసిన టీమ్ ఇండియా ప్రత్యర్థిని 254/7 స్కోరుకే పరిమితం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2, టిటాస్, సయాలి చెరో వికెట్ తీశారు. బ్యాటింగ్లో జెమీమా(102), హర్లీన్(89), స్మృతి(73), ప్రతికా రావల్(67) రాణించారు.
కలియుగ దానకర్ణుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ తన సంపదను ఓ ఛారిటబుల్ ట్రస్టుకు రాసిచ్చారని తెలిసింది. ఆయన వారసులు సూసీ, హువీ, పీటర్ బఫెట్ దీనిని నిర్వహిస్తారు. నిధులు ఖర్చు చేయాలంటే వీరంతా కలిసే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.. తాము లక్కీ అని, పరులకు సాయం చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని బఫెట్ అన్నారు. 2006 నుంచి $39B గేట్స్ ఫౌండేషన్కు దానం చేసిన ఆయన ఇకపై ఒక్క $ వారికి ఇవ్వనని చెప్పారు.
Sorry, no posts matched your criteria.