India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్నాలజీలో దేశం అనేక మైలురాళ్లను అధిగమించిందని నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో PM మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా విజయాలను గుర్తుచేశారు. ‘నేనిప్పుడు 30 సెకన్లలో 10కోట్ల రైతుల A/Cకు డబ్బులు బదిలీ చేయగలను. 13 కోట్ల మందికి సిలిండర్ సబ్సిడీ వేయగలను. టెక్నాలజీని డెమోక్రటైజ్ చేయడమెలాగో ప్రపంచానికి భారత్ బోధించింది. కేవలం మొబైల్ ఉంటే చాలు. టెక్నాలజీ ఇన్నోవేషన్ కోసం మేం కమిషన్, ఫండ్ ఏర్పాటు చేశాం’ అని అన్నారు.
భారత ఎకానమీ 2025లో కొంత బలహీనంగా ఉండొచ్చని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జీవా అన్నారు. US ట్రేడ్ పాలసీలతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి కొనసాగొచ్చని పేర్కొన్నారు. ‘మేం ముందుగా అంచనా వేసిన దాని కన్నా US కొంత మెరుగ్గానే ఉంది. EU వెనకబడింది. భారత్లో కొంత వీక్నెస్ కనిపిస్తోంది. వ్యవసాయం, గ్రామీణ వినియోగం దన్నుగా నిలుస్తుంది. చైనాలో మాత్రం డీఫ్లేషన్ కొనసాగుతోంది. చిన్న దేశాల పరిస్థితి అధ్వానం’ అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఆల్రౌండర్ జడేజా స్థానంపై సందిగ్ధం నెలకొంది. అతడిని జట్టులోకి తీసుకోవాలా? భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జూనియర్లకు చోటు కల్పించాలా? అనే దానిపై BCCI ఆలోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆల్రౌండర్కు అక్షర్, దూబే, సుందర్ నుంచి పోటీ ఉంది. CTలో భారత్ దుబాయ్లో స్పిన్ పిచ్లపై ఆడుతుండటంతో అనుభవమున్న ప్లేయర్ కావాలని భావిస్తే జడేజాను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.
TG: సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్వాల్ కూలి ₹80cr ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని KTR అన్నారు. ఆ సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి ₹4,350cr కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పంచిపెట్టి భారీ స్కామ్కు తెరతీశారని ఆరోపించారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారని, ఆ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
AP: క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.
పండుగొచ్చిందంటే చాలు టీవీల్లో శ్రీకాంత్ అడ్డాల తీసిన కుటుంబ కథా చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రసారమవుతుంది. విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబాల మధ్య ఉండే బంధాలు, బంధుత్వాలు, పల్లెటూరి అందాలను ఎంతో చక్కగా చూపించారు.
TG: రైతు భరోసా పథకంలో 70% మంది రైతులకు కోత పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో లీకులు ఇచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. తాము పోరాటం చేయడంతోనే ఇప్పుడు వెనక్కి తగ్గి సాగు భూములన్నింటికీ ఇస్తామంటోందని పేర్కొంది. ‘2023 యాసంగికి రూ.2,500, 2024 వానాకాలానికి రూ.7,500, 2024 యాసంగికి రూ.7,500 ప్రభుత్వం రైతులకు బాకీ పడింది. ఎకరానికి రూ.17,500 ఇచ్చే వరకూ రైతుల పక్షాన పోరాడతాం’ అని తెలిపింది.
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హీరో రామ్ చరణ్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘అన్స్టాపబుల్’ షోలో ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై చరణ్ స్పందిస్తూ పెళ్లి కూతురు ఎవరో చెప్పనప్పటికీ ఎక్కడివారో చెప్పారని టాక్. అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఉంటారని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలో ఈ ఎపిసోడ్ రిలీజ్ కానుంది.
చదువు, ఉద్యోగాలు, వ్యాపారం కోసం HYDలో స్థిరపడ్డ లక్షలాది మంది సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు. రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండటంతో చాలా మంది కార్లు, బైకులపై వెళ్తున్నారు. వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట జర్నీ చేయవద్దు. 80 కి.మీ వేగం దాటొద్దు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడొద్దు. కచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. మద్యం తాగి వాహనం నడపకూడదు.
*క్షేమంగా వెళ్లి లాభంగా రండి.
జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హిందీ సరిగ్గా రాదని ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని నిఖిల్ కామత్ అనగా, మోదీ తన మాతృభాష కూడా హిందీ కాదని అన్నారు. తన బాల్యంలో రైల్వే స్టేషన్లో చాయ్ చుట్టూ హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండేవారని.. వారితో మాట్లాడుతూ భాష నేర్చుకున్నానని మోదీ వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.