News May 30, 2024

ప్రశాంత్-రణ్‌వీర్ కాంబో మూవీ రద్దు

image

హీరో రణ్‌వీర్ సింగ్, ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రావాల్సిన ‘రాక్షస్’ సినిమా రద్దైంది. కానీ, వీరిద్దరి మూవీ ఫ్యూచర్‌లో ఉంటుందని మైత్రీ మూవీస్ ప్రకటించింది. రాక్షస్‌కి ఇది సరైన సమయం కాదని, భవిష్యత్‌లో ఉంటుందని చెప్పింది. ప్రతిభావంతుడైన ప్రశాంత్‌తో భవిష్యత్తులో సినిమా తీస్తానంటూ రణ్‌వీర్ వెల్లడించారు. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మూవీ నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ వైదొలిగినట్లు తెలుస్తోంది.

News May 30, 2024

యువశక్తికి ‘అగ్నిబాణ్’ సక్సెస్ నిదర్శనం:PM

image

అగ్నికుల్ కాస్మోస్ చేసిన ‘అగ్నిబాణ్’ <<13341954>>ప్రయోగం<<>> విజయవంతం కావడం దేశానికే గర్వకారణమని PM మోదీ ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోని మొదటి 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో నడిచే అగ్నిబాణ్ రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించడం భారత అంతరిక్ష రంగానికి ఒక గొప్ప సందర్భం. ఇది మన యువశక్తి అద్భుత నైపుణ్యానికి నిదర్శనం. అగ్నికుల్ సిబ్బందికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయాలి’ అని పేర్కొన్నారు.

News May 30, 2024

నవీన్ పట్నాయక్‌పై బీజేపీ కేసులెందుకు పెట్టలేదు?: రాహుల్

image

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పై బీజేపీ ఎందుకు ఒక్కకేసూ పెట్టలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘నేను బీజేపీతో పోరాడుతున్నాను. వారు నాపై 24పైగా కేసులు పెట్టించారు. వాటిలో పరువు నష్టం, క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. నా లోక్‌సభ సభ్యత్వమూ లాక్కున్నారు. కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈడీ నన్ను 50 గంటల పాటు విచారించింది. పట్నాయక్‌పై ఏ కేసులూ లేవు ఎందుకు?’ అని రాహుల్ ప్రశ్నించారు.

News May 30, 2024

అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా

image

తెలంగాణ రాష్ట్ర కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త చిహ్నంపై ఇంకా సంప్రదింపులు జరుగుతుండటంతో జూన్ 2న ఆవిష్కరణకు వీలుపడటం లేదు. దీంతో ఆ రోజు రాష్ట్ర గీతం మాత్రమే విడుదల చేయనుంది ప్రభుత్వం. చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కూడా సర్కార్ సమాలోచనలు చేస్తోంది.

News May 30, 2024

జులై 12న అనంత్ – రాధిక వివాహం.. శుభలేఖ ఇదే!

image

బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక వివాహం జులై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. సంప్రదాయ హిందూ పద్ధతిలోనే వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు సాగే వేడుకల శుభలేఖ రిలీజైంది. జులై 12న వివాహం, 13న ఆశీర్వాద కార్యక్రమం, 14న రిసెప్షన్ ఉంటుంది. పెళ్లికి వచ్చేవారు తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్‌లో రావాలని కోరారు.

News May 30, 2024

FY25లో భారత్ 7% వృద్ధి సాధిస్తుంది: RBI

image

భారత్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో (FY25) 7శాతం వృద్ధి సాధిస్తుందని RBI తన యాన్యువల్ రిపోర్ట్‌లో వెల్లడించింది. బ్యాలెన్స్ షీట్ FY24లో 11.08% వృద్ధి చెంది రూ.70.48లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఫోరెక్స్ లావాదేవీలతో రూ.83,616 కోట్ల లాభం, ఫారెన్ సెక్యూరిటీలపై వడ్డీతో రూ.65,328కోట్ల ఆదాయన్ని ఆర్జించింది. ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని, కానీ ఆహార ద్రవ్యోల్బణంతో సవాళ్లు ఎదురుకావొచ్చని RBI పేర్కొంది.

News May 30, 2024

టీమ్ఇండియా హెడ్ కోచ్ ఎంపికపై గంగూలీ ట్వీట్

image

టీమ్ఇండియా హెడ్ కోచ్‌ను ఎంపిక చేయడంపై BCCI మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పలు సూచనలు చేశారు. ‘ఒక ప్లేయర్‌ భవిష్యత్తు అతని కోచ్‌ని బట్టి ఉంటుంది. అతని మార్గదర్శకం, నిరంతర శిక్షణ.. మైదానంతో పాటు జీవితంలోనూ ఆ వ్యక్తి భవిష్యత్తును మారుస్తాయి. కాబట్టి కోచ్‌ని సెలక్ట్ చేసే ముందు ఆలోచించండి’ అని ఆయన ట్వీట్ చేశారు. కోచ్‌గా గంభీర్‌ను నియమిస్తారని వార్తలొస్తున్న వేళ.. గంగూలీ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

News May 30, 2024

బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పిటిషన్

image

లిక్కర్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది. జూన్ 2తో కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియనుంది. అంతకుముందు ఆయన ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది.

News May 30, 2024

‘పోస్టల్ బ్యాలెట్’ రూల్స్‌పై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్

image

AP: పోస్టల్ బ్యాలెట్‌పై RO సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దంటూ సీఈవో ఎంకే మీనా ఇచ్చిన మెమోపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఇవాళే అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.

News May 30, 2024

మోదీపై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌.. కొట్టేసిన హైకోర్టు

image

ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేయకుండా వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. మోదీ రిటర్నింగ్ అధికారి ఎదుట తప్పుడు వాగ్దానం చేశారని ఆరోపిస్తూ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని పిటిషనర్ విజయ్ కుమార్ న్యాయస్థానాన్ని కోరారు. తనను చంపేందుకు మోదీ ప్రయత్నించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ దుర్మార్గపు ఉద్దేశంతో ఉందని పేర్కొంటూ కొట్టివేసింది.