India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కోడి పందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని పేర్కొన్నారు. మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు నిర్వహించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తనకు కోడి పందాలతో సంబంధం లేదని, వేరే వ్యక్తికి ఫామ్ హౌస్ను లీజుకు ఇచ్చినట్లు ఆయన గత నెలలో పోలీసులకు వివరణ ఇచ్చారు.

ఓటర్ ఐడీ కార్డుల్ని ఆయా ఓటర్ల ఆధార్, మొబైల్ నెంబర్లతో అనుసంధానించాలని ఈసీ అన్ని రాష్ట్రాల సీఈఓలను ఆదేశించింది. దీంతో పాటు జనన, మరణాల వివరాల ఆధారంగా ఓటర్ లిస్టును ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఓటరు నమోదుకు ఆధార్ లింక్ కంపల్సరీ కాదని 2022లో సుప్రీం కోర్టు తీర్పునివ్వగా ఈసీఐ తాజా ఆదేశాలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.

రాజస్థాన్ రాయల్స్ నుంచి బట్లర్ను రిలీజ్ చేయడం ఛాలెంజింగ్ డెసిషన్ అని ఆ టీమ్ కెప్టెన్ శాంసన్ తెలిపారు. ఏడేళ్లుగా అతనితో కలిసి ఆడానని, తన క్లోజ్ ఫ్రెండ్స్లో అతనూ ఒకరని పేర్కొన్నారు. ఒకవేళ తనకు అవకాశం వస్తే IPLలో మూడేళ్లకోసారి ప్లేయర్లను రిలీజ్ చేసే రూల్ను మారుస్తానని చెప్పారు. ఇలా ప్లేయర్లను రిలీజ్ చేయడం వల్ల వారి మధ్య కనెక్షన్ పోతుందన్నారు. కాగా బట్లర్ ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్కు ఆడనున్నారు.

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ(ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్ యుద్ధవిమానం(LCA) AF MK1 నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు DRDO ప్రకటించింది. 100 కి.మీ పరిధిలో పైలట్ కంటికి కనిపించని లక్ష్యాలను కూడా ఈ క్షిపణి సాయంతో ఛేదించవచ్చు.

మైనర్ అమ్మాయితో ప్రేమ, పోక్సో చట్టం నేపథ్యంలో సాగే సినిమానే ‘కోర్ట్’. విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. ఫస్టాఫ్లో ఎక్కువ భాగం టీనేజ్ ప్రేమ కథను చూపించారు. కుర్రాడిపై కేసు పెట్టాక కథలో వేగం పెరుగుతుంది. సాంగ్స్, బీజీఎం ఆకట్టుకుంటాయి. ఎమోషనల్ సీన్లు హత్తుకుంటాయి. అమ్మాయి మామ పాత్రలో శివాజీ నటన ఈ మూవీకి హైలైట్. కథ ఊహించేలా సాగడం, రొటీన్ లవ్ సీన్లు ఇబ్బంది పెడతాయి.
RATING: 2.75/5

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిస్వార్థంగా ఆలోచిస్తారంటూ భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ప్రశంసించారు. ‘రోహిత్ కెప్టెన్సీని మనం తక్కువ అంచనా వేస్తుంటాం. పలు ఐసీసీ టైటిల్స్ గెలిచిన కెప్టెన్గా ఆయన ధోనీ సరసన ఉన్నారు. ఆటగాళ్లతో చక్కటి సమన్వయం, ముందుండి నడిపించడంలో రోహిత్ శైలి అద్భుతం. ఏ ఆటగాడైనా అభద్రతతో ఉంటే అతడిలో విశ్వాసాన్ని నింపుతుంటారు. మొత్తంగా ఆయన తిరుగులేని నాయకుడు’ అని కొనియాడారు.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,509 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 23,105 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్క రోజులో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు సమకూరింది.

TG CM రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్తో భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు విదేశాల్లో తలదాచుకుంటుండగా, వారిని స్వదేశానికి రప్పించే విషయంపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గల్ఫ్ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది.

పాకిస్థాన్, చైనా కలిసి తమను దోపిడీ చేస్తున్నాయనేది బలూచిస్థాన్ జాతీయవాదుల ఆవేదన. ఆ ప్రాంతంలో బొగ్గు, సహజవాయువు, బంగారం, రాగి లాంటి ఖనిజాలు భారీగా ఉంటాయి. వాటిని దోచుకుంటూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదని అక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అరేబియా సముద్రంతో లింక్ కోసం చైనా బలూచిస్థాన్లో గ్వాదర్ పోర్ట్ నిర్మిస్తోంది. ఇది CPECలో చాలా కీలకమైన ప్రాజెక్టు. వారి కోపానికి ఇదీ ఓ ప్రధాన కారణం.

TG: మెట్రో స్టేషన్లలో తనిఖీల సమయంలో పలు వస్తువుల విషయంలో సిబ్బందికి ప్రయాణికులకు మధ్య తరచుగా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్యాసింజర్ల కోసం ఎంట్రన్స్ వద్దే నిషేధిత వస్తువుల జాబితాను మెట్రో ఏర్పాటు చేసింది. మండే స్వభావం ఉన్న వస్తువులు, తుపాకులు, గొడ్డలి, గడ్డపార, కటింగ్ ప్లేయర్ వంటి పరికరాలు, మాంసం, పాడైన కూరగాయలు సీల్ వేయని మొక్కలను అనుమతించరు. సీల్ వేసిన రెండు మద్యం సీసాలను అనుమతిస్తారు.
Sorry, no posts matched your criteria.