News September 2, 2025

తల్లి కాబోతున్న హీరోయిన్

image

హీరోయిన్ పార్వతి మెల్టన్ తల్లి కాబోతున్నారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇవి చూసిన అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా వెన్నెల, జల్సా, దూకుడు, శ్రీమన్నారాయణ, మధుమాసం వంటి సినిమాలతో పార్వతి ప్రేక్షకులను అలరించారు. 2012లో వ్యాపారవేత్త షంసు లాలానిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలయ్యారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నారు.

News September 2, 2025

సుగాలి ప్రీతి కేసు ఏంటంటే?

image

AP: <<17594800>>సుగాలి ప్రీతి<<>> 2017లో స్కూల్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. అయితే ఆమెను హత్యాచారం చేశారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2019లోనే ఈ కేసును అప్పటి YCP ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో దర్యాప్తు చేయడం తమవల్ల కాదంటూ కోర్టుకు CBI తెలిపింది. కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలని ప్రీతి తల్లి పార్వతి డిమాండ్‌తో మరోసారి సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.

News September 2, 2025

BREAKING: సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

image

AP: రాష్ట్రంలో సంచలనం రేపిన <<17548354>>సుగాలి ప్రీతి<<>> కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై పవన్ సైతం స్పందించారు. తాజా పరిణామాల నడుమ కేసును సీబీఐకి అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించినా దర్యాప్తు ముందుకు సాగలేదు.

News September 2, 2025

T20Iల్లో టాప్ వికెట్ టేకర్‌గా రషీద్ ఖాన్

image

అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన అవతరించారు. ఇప్పటివరకు రషీద్ 165 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టిమ్ సౌతీ(164)రికార్డును బద్దలు కొట్టారు. షార్జాలో UAEతో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించారు. వీరిద్దరి తర్వాత ఇష్ సోధి(150), షకీబ్ (149), ముస్తాఫిజుర్(142), రషీద్(135), హసరంగ(131), జంపా(130), అడైర్(128), ఇషాన్ ఖాన్(127) ఉన్నారు.

News September 2, 2025

అఫ్గాన్‌లో మరోసారి భూకంపం

image

అఫ్గానిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. జలాలాబాద్‌కు 34కి.మీ దూరంలో 5.5 తీవ్రతతో భూమి కంపించినట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలేమీ ఇంకా తెలియరాలేదు. కాగా నిన్న సంభవించిన భారీ <<17592698>>భూకంపం<<>> ధాటికి అఫ్గాన్‌లో 1400 మంది మరణించిన విషయం తెలిసిందే.

News September 2, 2025

VIRAL: 1954 నుంచి ఖైరతాబాద్ గణేశుడు

image

ఎంతో ప్రఖ్యాతి చెందిన ఖైరతాబాద్ గణేశుడిని 1954 నుంచి ప్రతిష్ఠిస్తున్నారు. తొలి ఏడాది ఒక్క అడుగుతో మొదలు పెట్టి ప్రస్తుతం 69 అడుగుల ఎత్తులో రూపొందించారు. గత 72 ఏళ్లలో వివిధ రూపాల్లో, ఎత్తుల్లో ప్రతిష్ఠించగా.. కొన్నేళ్ల నుంచి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. 2020లో కరోనా వల్ల 9 అడుగులే పెట్టి 2021 నుంచి మళ్లీ విగ్రహం ఎత్తును పెంచారు. ఇన్నేళ్లలోని గణనాథుల్లో కొన్నింటిని పైఫొటోల్లో చూడొచ్చు.

News September 2, 2025

వరద బాధిత జిల్లాలకు రూ.200కోట్లు విడుదల

image

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సాయం కింద రూ.200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్రంగా ప్రభావితమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్, ADB, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్లకు రూ.10 కోట్ల చొప్పున, ఇతర జిల్లాలకు రూ.5 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ నిధులను రోడ్లు&వంతెనల మరమ్మతులు, విద్యుత్ పునరుద్ధరణ, వరద బాధితులకు ఉపశమనం&పునరావాసం కోసం ఉపయోగించనున్నారు.

News September 2, 2025

నటి రన్యారావుకు రూ.102 కోట్ల ఫైన్

image

బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు, కన్నడ నటి రన్యారావుకు ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆమెకు రూ.102 కోట్ల భారీ జరిమానా విధించింది. రన్యారావుతోపాటు మరో నలుగురు నిందితులకు రూ.270 కోట్ల ఫైన్ విధిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. కాగా దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తెస్తూ బెంగళూరు విమానాశ్రయంలో రన్యా అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

News September 2, 2025

మళ్లీ థియేటర్లలోకి ‘35 చిన్న కథ కాదు’ చిత్రం

image

నివేదా థామస్, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ‘35 చిన్న కథ కాదు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత రానా ప్రకటించారు. ‘ఈ టీచర్స్ డేని 35 చిన్న కథ కాదు చిత్రంతో సెలబ్రేట్ చేసుకుందాం’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా గతేడాది సెప్టెంబర్ 6న రిలీజైన ఈ మూవీకి ‘గద్దర్ ఉత్తమ బాలల చిత్రం’ అవార్డు వరించింది.

News September 2, 2025

జియో, ఎయిర్‌టెల్.. మీకూ ఇలా అవుతోందా?

image

జియో, ఎయిర్‌టెల్ సిగ్నల్స్ రాక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఒకప్పటి రోజులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇంట్లో ఏదో ఒకచోటే సిగ్నల్ ఉండటం, అక్కడే నిలబడి ఫోన్ వాడటం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వీడియోలేమో ‘లోడింగ్.. లోడింగ్’ అంటున్నాయి. గ్రామాలను పక్కనపెడితే హైదరాబాద్ వంటి నగరాల్లోనూ నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఫోన్లు కలవడం లేదని చాలామంది వాపోతున్నారు. మీరేమంటారు?