News December 10, 2025

ప్రేమ పేరుతో మోసం చేసిందని మహిళా డీఎస్పీపై ఫిర్యాదు

image

రాయ్‌పూర్ డీఎస్పీ కల్పన వర్మ తనను మోసం చేశారని ఆరోపిస్తూ బిజినెస్‌మ్యాన్ దీపక్ టాండన్ కేసు పెట్టారు. 2021లో ప్రేమ పేరుతో రిలేషన్‌షిప్‌లోకి దింపి, బ్లాక్‌మెయిల్ చేసి తన నుంచి రూ.2 కోట్ల డబ్బు, డైమండ్ రింగ్, కారు, గోల్డ్ చైన్, లగ్జరీ గిఫ్ట్స్, తన హోటల్‌ ఓనర్‌షిప్ రాయించుకున్నట్టు ఆరోపించారు. క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలను కల్పన వర్మ ఖండించారు.

News December 10, 2025

ఇండిగో ఎఫెక్ట్.. ఢిల్లీ ఎకానమీకి రూ.1000 కోట్ల నష్టం

image

ఇండిగో సంక్షోభంతో ఢిల్లీలోని పలు వ్యాపార రంగాలు రూ.1000 కోట్లు నష్టపోయాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. ట్రేడర్స్, టూరిస్ట్స్, బిజినెస్ ట్రావెలర్స్ తగ్గారని CTI ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ చెప్పారు. వారం రోజుల్లో ఢిల్లీలోని హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్టుల్లో చాలా బుకింగ్స్ రద్దయ్యాయన్నారు. ఆటో మొబైల్స్, హోమ్ నీడ్స్, చేనేత వస్త్రాల ప్రదర్శనలకు సందర్శకులు కరవయ్యారని తెలిపారు.

News December 10, 2025

డ్రై స్కిన్ కోసం ఈ ఫేస్ ప్యాక్

image

డ్రై స్కిన్ ఉన్న వాళ్లకి చర్మంలో తేమ తగ్గి ముడతలు త్వరగా వచ్చేస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే టేబుల్‌స్పూన్ కీరదోస గుజ్జులో, టీస్పూన్ ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కీరదోసలోని నీరు ముఖ చర్మంలోకి ఇంకిపోయి పొడిదనం క్రమంగా తగ్గుతుంది. చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.

News December 10, 2025

తలరాతను మార్చే క్రమంలో చిగురించిన ప్రేమ..!

image

బిహార్‌లో సినిమా కథను తలపించే ఘటన జరిగింది. రైళ్లలో యాచిస్తున్న అనాథ బాలికను చూసి ఒక యువకుడు చలించిపోయాడు. ఆమె తలరాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో శ్రమించి ఆమె కుటుంబ మూలాలను కనుగొని విడిపోయిన వారికి దగ్గర చేశాడు. మానవత్వంతో మొదలైన ఈ ప్రయాణంలో వారి మధ్య పెరిగిన విశ్వాసం ప్రేమగా మారింది. రైల్వే ప్లాట్‌ఫారమ్ నుంచి మొదలైన వారి ప్రయాణం తాజాగా వివాహ బంధంగా మారి ముందుకు సాగుతోంది.

News December 10, 2025

మొక్కల్లో నత్రజని లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.

News December 10, 2025

ఈ నెల 12న ఆన్‌లైన్ జాబ్ మేళా

image

AP: పార్వతీపురం మన్యంలో ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 4 కంపెనీలు ఇంటర్వ్యూ ద్వారా 160 పోస్టులను భర్తీ చేయనున్నాయి. 18 ఏళ్లు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8

News December 10, 2025

తిరుమలలో మరో స్కాం.. స్పందించిన పవన్

image

AP: తిరుమలలో పట్టువస్త్రాల <<18519051>>స్కాంపై<<>> Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. కూటమి ప్రభుత్వ చర్యలతోనే టీటీడీలో జరుగుతున్న అక్రమాలన్నీ బయటపడుతున్నట్లు చెప్పారు. హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పరకామణి విషయంలోనూ జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన మతంలోనూ ఇలాగే జరిగి ఉంటే చిన్న విషయమేనని కొట్టిపారేసేవారా అని ప్రశ్నించారు.

News December 10, 2025

ఐబీపీఎస్ SO, PO ఫలితాలు విడుదల

image

IBPS నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) మెయిన్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు <>ibps<<>> వెబ్‌సైట్లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇందులో పాసైన వారు ఇంటర్వ్యూ రౌండ్‌కు అర్హత సాధిస్తారు. 1,007 ఉద్యోగాలకు గత నెల 9న పరీక్ష జరిగింది. అటు ibps ప్రొబెషనరీ ఆఫీసర్(PO) మెయిన్స్ స్కోర్ కార్డులు కూడా విడుదలయ్యాయి.

News December 10, 2025

‘మిస్టర్ ఇండియా’గా CISF జవాన్

image

జైపూర్‌(RJ)లో జరిగిన 6వ మిస్టర్ ఇండియా 2025 ఛాంపియన్‌షిప్‌లో CISF కానిస్టేబుల్ రిషిపాల్ సింగ్ అద్భుత విజయం సాధించారు. ఆయన ‘మిస్టర్ ఇండియా’ ట్రోఫీతో పాటు 50+ వయస్సు & 65–70 కేజీల బాడీబిల్డింగ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ గెలిచారు. రిషిపాల్ సింగ్ అంకితభావం & క్రమశిక్షణ ఫోర్స్‌కు గర్వకారణమని CISF ప్రశంసించింది. ఈ విజయం జాతీయ స్థాయిలో CISFకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని కొనియాడింది.

News December 10, 2025

పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని పేర్కొంది. FIR నమోదు చేయాలని సూచించింది. మాజీ AVSO పోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో CID, ACB అధికారులు వేర్వేరుగా విచారణ చేయొచ్చని తెలిపింది. కేసు వివరాలను ED, ITకి అందజేయాలంది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.