India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాయ్పూర్ డీఎస్పీ కల్పన వర్మ తనను మోసం చేశారని ఆరోపిస్తూ బిజినెస్మ్యాన్ దీపక్ టాండన్ కేసు పెట్టారు. 2021లో ప్రేమ పేరుతో రిలేషన్షిప్లోకి దింపి, బ్లాక్మెయిల్ చేసి తన నుంచి రూ.2 కోట్ల డబ్బు, డైమండ్ రింగ్, కారు, గోల్డ్ చైన్, లగ్జరీ గిఫ్ట్స్, తన హోటల్ ఓనర్షిప్ రాయించుకున్నట్టు ఆరోపించారు. క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలను కల్పన వర్మ ఖండించారు.

ఇండిగో సంక్షోభంతో ఢిల్లీలోని పలు వ్యాపార రంగాలు రూ.1000 కోట్లు నష్టపోయాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. ట్రేడర్స్, టూరిస్ట్స్, బిజినెస్ ట్రావెలర్స్ తగ్గారని CTI ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ చెప్పారు. వారం రోజుల్లో ఢిల్లీలోని హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్టుల్లో చాలా బుకింగ్స్ రద్దయ్యాయన్నారు. ఆటో మొబైల్స్, హోమ్ నీడ్స్, చేనేత వస్త్రాల ప్రదర్శనలకు సందర్శకులు కరవయ్యారని తెలిపారు.

డ్రై స్కిన్ ఉన్న వాళ్లకి చర్మంలో తేమ తగ్గి ముడతలు త్వరగా వచ్చేస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే టేబుల్స్పూన్ కీరదోస గుజ్జులో, టీస్పూన్ ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కీరదోసలోని నీరు ముఖ చర్మంలోకి ఇంకిపోయి పొడిదనం క్రమంగా తగ్గుతుంది. చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.

బిహార్లో సినిమా కథను తలపించే ఘటన జరిగింది. రైళ్లలో యాచిస్తున్న అనాథ బాలికను చూసి ఒక యువకుడు చలించిపోయాడు. ఆమె తలరాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో శ్రమించి ఆమె కుటుంబ మూలాలను కనుగొని విడిపోయిన వారికి దగ్గర చేశాడు. మానవత్వంతో మొదలైన ఈ ప్రయాణంలో వారి మధ్య పెరిగిన విశ్వాసం ప్రేమగా మారింది. రైల్వే ప్లాట్ఫారమ్ నుంచి మొదలైన వారి ప్రయాణం తాజాగా వివాహ బంధంగా మారి ముందుకు సాగుతోంది.

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.

AP: పార్వతీపురం మన్యంలో ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న ఆన్లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 4 కంపెనీలు ఇంటర్వ్యూ ద్వారా 160 పోస్టులను భర్తీ చేయనున్నాయి. 18 ఏళ్లు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8

AP: తిరుమలలో పట్టువస్త్రాల <<18519051>>స్కాంపై<<>> Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. కూటమి ప్రభుత్వ చర్యలతోనే టీటీడీలో జరుగుతున్న అక్రమాలన్నీ బయటపడుతున్నట్లు చెప్పారు. హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పరకామణి విషయంలోనూ జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన మతంలోనూ ఇలాగే జరిగి ఉంటే చిన్న విషయమేనని కొట్టిపారేసేవారా అని ప్రశ్నించారు.

IBPS నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) మెయిన్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు <

జైపూర్(RJ)లో జరిగిన 6వ మిస్టర్ ఇండియా 2025 ఛాంపియన్షిప్లో CISF కానిస్టేబుల్ రిషిపాల్ సింగ్ అద్భుత విజయం సాధించారు. ఆయన ‘మిస్టర్ ఇండియా’ ట్రోఫీతో పాటు 50+ వయస్సు & 65–70 కేజీల బాడీబిల్డింగ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ గెలిచారు. రిషిపాల్ సింగ్ అంకితభావం & క్రమశిక్షణ ఫోర్స్కు గర్వకారణమని CISF ప్రశంసించింది. ఈ విజయం జాతీయ స్థాయిలో CISFకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని కొనియాడింది.

AP: తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని పేర్కొంది. FIR నమోదు చేయాలని సూచించింది. మాజీ AVSO పోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో CID, ACB అధికారులు వేర్వేరుగా విచారణ చేయొచ్చని తెలిపింది. కేసు వివరాలను ED, ITకి అందజేయాలంది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
Sorry, no posts matched your criteria.