India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: BRS నుంచి కాంగ్రెస్లో చేరిన MLAలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని CM రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఎక్కువ మంది బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పినట్లు టాక్. తాజా విస్తరణలో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేసి, రెండు పదవులను పెండింగ్లో పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు రానున్నారు. ఇక్కడ ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం గంటన్నరపాటు ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవోతో కలిసి తెలంగాణ జనసేన నేతలు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో రోడ్డు మార్గాన బయల్దేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు.
TG: పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ రానున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 1.30 గంటలకు వరంగల్ చేరుకోనున్నారు. అక్కడ టెక్స్టైల్స్ పార్క్, మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి సందర్శన, మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
TG: BRS MLAలు వరుసగా కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో గులాబీ దళంలో గుబులు రేపుతోంది. ఫామ్ హౌస్లో KCRతో మీవెంటే ఉంటాం అని చెప్పి.. అంతలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో ఇప్పుడు పార్టీలో ఉండేది ఎవరు? పోయేది ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు BRSకు గుడ్ బై చెప్పగా త్వరలోనే మరో ఐదుగురు చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్పై నమ్మకంతోనే వీరందరూ కాంగ్రెస్లో చేరుతున్నట్లు టాక్.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ అద్భుతమైన విజువల్స్తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే క్లైమాక్స్ పూర్తికాకపోవడంతో ఈ మూవీకి పార్ట్-2 ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో యాస్కిన్తో అశ్వత్థామ, భైరవ పోరాడే కథ కొనసాగుతుందని, కల్కికి సీక్వెల్ ఉందని నాగ్ అశ్విన్ స్పష్టతనిచ్చారు. కానీ, దీనికి మరో మూడేళ్లు ఆగాల్సిందేనని సినీవర్గాలు అంచనా. కాగా ప్రభాస్ ‘సలార్’కు కూడా సీక్వెల్ ఉంది.
వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు 10 నుంచి 21 శాతం పెరగనున్నాయి. ఈ పెంపు జులై 4 నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దీంతో రూ.179 రీఛార్జ్ ప్లాన్ రూ.199కి, రూ.269 ప్లాన్ రూ.299కి పెరగనుంది. ఇలా అన్ని ప్లాన్లపై ఛార్జీల పెంపు ఉండనుంది. ఇప్పటికే జియో, ఎయిర్టెల్ కంపెనీల టారిఫ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీ20 WCలో దారుణ ప్రదర్శన చేస్తున్న టీమ్ ఇండియా ఆల్రౌండర్ శివమ్ దూబేను జట్టు నుంచి తప్పించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆయన స్థానంలో ఫైనల్లో యశస్వీ జైస్వాల్ లేదా సంజూ శాంసన్లలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. దూబే ఐపీఎల్లో హీరో.. వరల్డ్ కప్లో జీరో అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇతడినేనా యువరాజ్తో పోల్చింది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా దూబే T20WCలో 7 మ్యాచులాడి 102 పరుగులే చేశారు.
ఢిల్లీ విమానాశ్రయం ఘటన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్టుల నిర్మాణాలను తనిఖీ చేయాలని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను 2 నుంచి 5 రోజుల్లో సమర్పించాలని పేర్కొంది. కాగా ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్-1 రూఫ్ కూలి ఒకరు మరణించగా, ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే.
యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 మధ్య ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈసారి పేపర్ విధానంలో కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్ పరీక్షను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షకు దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా అభ్యర్థులు హాజరయ్యారు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను చూస్తోంటే పట్టరాని ఆనందంగా ఉందని BCCI మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఆయన జీవితం పరిపూర్ణమైందని చెప్పారు. ‘నేను BCCI అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రోహిత్ కెప్టెన్సీ చేపట్టారు. అసలు రోహిత్కు కెప్టెన్సీ చేయడమే ఇష్టం లేదు. కానీ మేమే ఆయనను ఒప్పించేందుకు నానా తంటాలు పడి బలవంతంగా ఒప్పించాం. ఇప్పుడు అతడి సారథ్యంలో ప్రపంచకప్ సాధించబోతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.