India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పిల్లలు ఏకాగ్రతగా చదవాలంటే చక్కని స్టడీ టేబుల్ కీలకం. సరైన వెలుతురు ఇచ్చే డెస్క్ ల్యాంప్, పెన్సిల్/పెన్ హోల్డర్ ఫోకస్ పెంచుతాయి. మంచి కొటేషన్లు పిల్లలను మోటివేట్ చేస్తాయి. స్టడీ ప్లానర్ ఉంటే టైమ్ మేనేజ్మెంట్ నేర్పుతుంది. వాటర్ బాటిల్ పెట్టుకోవడం మంచిది. ఎక్కువ సౌండ్ చేయని గడియారం టేబుల్పై పెట్టుకోండి. ఒక చిన్న మొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళకూ పునర్జన్మలాంటిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కాంప్లికేషన్లు వచ్చి ప్రాణాలు కోల్పోతారు. వాటిల్లో ఒకటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం. దీనివల్ల గర్భంలోని ఉమ్మనీరు తల్లి రక్తంలో కలిసిపోతాయి. దీంతో శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో ఊపిరి ఆడకపోవడం, బీపీ పెరగడం, గుండెకు రక్తసరఫరా ఆగిపోవడం, అధిక రక్తస్రావం జరిగి కొద్ది సమయంలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

చారో యుగ ప్రతాప తుమ్హారా|
హై పరసిద్ధ జగత ఉజియారా||
ఓ హనుమా! మీ శక్తి, కీర్తి 4 యుగాలలో ప్రసిద్ధి చెందింది. ఈ సత్యం లోకమంతా విధితమే. మీ ఉనికి ఈ జగత్తు మొత్తానికి కాంతిలా వెలుగునిస్తుంది. మీరు ఈ ప్రపంచంలోని చీకటిని పోగొట్టి, జ్ఞానం, ధైర్యం, ఆనందాన్ని ఇస్తూ, సర్వత్రా వెలుగు పంచుతున్నారు. యుగాలు మారినా, మీ మహిమ మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరక, ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూనే ఉంది. <<-se>>#HANUMANCHALISA<<>>

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CSIR-CEERI) ప్రాజెక్ట్ స్టాఫ్ , JRF పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఇనుస్ట్రుమెంటేషన్/ఫిజిక్స్లో B.Tech/BE/M.Tech/ME/MSc, BSc లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.ceeri.res.in/

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతుండటంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో గొంతు వినిపించేందుకు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ‘పార్టీలో నాది ఏకైక గొంతు కావచ్చు. కానీ పార్లమెంటులో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడానికే నన్ను ఎన్నుకున్నారు. అరవడానికో, గొడవలు చేయడానికో కాదు. వారి కోసం, దేశం కోసం మాట్లాడేందుకు పంపించారు’ అని అన్నారు.

ఈ ఏడాది ఎక్కువగా శోధించిన అంశాల జాబితాను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ప్లాట్ఫామ్ ‘Google’ రిలీజ్ చేసింది. ‘ఓవరాల్ ట్రెండింగ్ సెర్చ్’ విభాగంలో IPL అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత Google Gemini, Asia Cup, ICC Champions Trophy, Pro Kabaddi League, Maha Kumbh, Women’s World Cup, Grok, Saiyaara, ‘Dharmendra’ గురించి తెగ సెర్చ్ చేసినట్లు తెలిపింది. మరి మీరు ఏ విషయం గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు? COMMENT

దేశంలో IndiGo తప్ప మిగతా ఎయిర్లైన్స్ సర్వీసులు మామూలుగానే నడుస్తున్నాయి. ఇండిగోకే ఎందుకు సమస్య వచ్చింది? నిజానికి పైలట్లకు వారానికి అదనంగా 12గంటల రెస్ట్ ఇవ్వాలని DGCA ఇటీవల రూల్ తెచ్చింది. అదనపు పైలట్ల నియామకానికి 18నెలల గడువిచ్చింది. ఎయిరిండియా, ఆకాశ, విస్తారా ఈ మేరకు సర్దుబాటు చేసుకోగా, ఇండిగో మాత్రం పట్టించుకోలేదు. 60% మార్కెట్ ఉన్న సంస్థ సిబ్బందిని ఎందుకు నియమించలేదనేది చర్చనీయాంశమవుతోంది.

ప్రపంచ జనాభాకు అందే ఆహారంలో 95శాతం నేల నుంచే అందుతోంది. అందుకే మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం. నేల ఆరోగ్యంగా, సారవంతంగా ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుంది. అందుకే భూమి ప్రాధాన్యత, సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరించడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ & అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓ తీర్మానం చేసింది. 2014 DEC-5 నుంచి ఏటా ఈ రోజున ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

TG: వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని తెలిపారు.

‘పుష్ప2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని అద్భుతంగా మార్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కెప్టెన్’ సుకుమార్ సహా చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. ‘పుష్ప’గా ఈ 5ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో మరువలేనిదని కొనియాడారు.
Sorry, no posts matched your criteria.