India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత YCP పునర్నిర్మాణ దిశగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నిర్మాణంలో సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్ను నియమించారు. ఈయన చెన్నై IITలో చదివారు. సాయిదత్ టీమ్ TG లోక్సభ ఎన్నికల్లో BJPకి పనిచేసింది. ఢిల్లీలో ఆ పార్టీ నాయకుడికి ఫీడ్బ్యాక్ టీమ్గానూ సేవలందించింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈయన గతంలో మంగళగిరిలో లోకేశ్ వ్యూహకర్తగా పనిచేసినట్లు సమాచారం.
AP: విజయవాడ వరద బాధితులకు అధికారులు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ 25 కేజీల బియ్యం, లీటరు నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు అందిస్తున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో రేషన్ వాహనాలు విజయవాడకు చేరుకున్నాయి.
తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘మిత్రుడు, సన్నిహితుడు బాలకృష్ణారెడ్డి అకాల మరణం కలిచివేసింది. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
RBI ఏర్పడి వచ్చే ఏడాది APR1 నాటికి 90 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయి విద్యార్థులకు ‘RBI 90’ పేరుతో క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ నెల 17 వరకు <
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో మిలిటెంట్లు ఉదయం బాంబులతో దాడి చేశారు. పక్కనే ఎత్తుమీదున్న చురాచంద్పుర్ జిల్లాలోని కొండప్రాంతం నుంచి జనావాసమైన ట్రాంగ్లావోబీ లక్ష్యంగా రాకెట్లు ప్రయోగించారు. అవి కనీసం 3 కి.మీ దాటొచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగలేదని, కమ్యూనిటీ హాల్, ఖాళీ గది ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఇంఫాల్లో డ్రోన్ బాంబు దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
AP: విజయవాడలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్ల క్లీనింగ్ను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు తెలుసుకున్నారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్లను పిలిపించాలని సూచించారు.
కూతురని పిలుస్తూనే ఓ తమిళ డైరెక్టర్ తనపై ఏడాది పాటు అత్యాచారం చేసినట్టు ఓ కేరళ నటి బయటపెట్టారు. తమిళంలో తొలి సినిమా చేస్తున్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగిందన్నారు. ‘ఫస్టియర్ చదువుతుండగా ఆ దర్శకుడు పరిచయమయ్యాడు. మంచి ఆహారం పెడుతూ మచ్చిక చేసుకున్నాడు. కూతురు అని పిలిచే ఆయనే భార్య లేనప్పుడు ముద్దు పెట్టాడు. బలవంతంగా నన్ను వాడుకున్నాడు. భయంతో ఎవరికీ చెప్పకోలేకపోయా’ అని అన్నారు.
పట్టణీకరణ విస్తృతమవుతోంది. భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో కబ్జాదారులు నాయకుల అండతో ప్రభుత్వ భూములను, వాగులను ఆక్రమించి వెంచర్లు వేస్తున్నారు. వీటికి అధికారులు కూడా పర్మిషన్లు ఇవ్వడంతో కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్న ప్రజలు వరదలకు బలవుతున్నారు. నది లేదా వాగు దాని ప్రవాహ మార్గాన్ని మర్చిపోదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాని మార్గంలో నిర్మాణాలు చేపడితే ఎప్పటికైనా నీళ్లపాలు కావాల్సిందే.
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘హనుమాన్’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్లో మోక్షజ్ఞ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆయన బర్త్ డే సందర్భంగా సినిమాలోని లుక్ను రివీల్ చేశారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా త్వరలోనే టైటిల్, అప్డేట్స్ వెల్లడిస్తామన్నారు. మోక్షజ్ఞ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
AP: విజయవాడలో విలయం సృష్టించిన బుడమేరు ఉద్ధృతి నిన్న కాస్త తగ్గగా, ఇవాళ మళ్లీ పెరిగింది. రాయనపాడులో రాత్రి 10 గంటల నుంచి క్రమంగా నీటి మట్టం అధికమవుతోంది. ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు రాయనపాడు రైల్వే స్టేషన్, ట్రాక్లపై వరద ప్రవహిస్తోంది.
Sorry, no posts matched your criteria.