India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.
ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసులో నిందితుడు మహమ్మద్ జావేద్కు రాజస్థాన్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2022లో మహ్మద్ ప్రవక్తపై BJP మాజీ లీడర్ నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించారనే ఆరోపణలతో కన్హయ్య లాల్ అనే టైలర్ను అతని దుకాణంలో రియాజ్ అత్తారి, గౌస్ మహ్మద్ తల నరికి చంపారు. వీరికి జావేద్ సహకరించాడని పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
బుల్డోజర్ రాజకీయాలు మానుకొని, జనావాసాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్న వన్యప్రాణుల కట్టడికి చర్యలు తీసుకోవాలని UP CM యోగీకి BSP చీఫ్ మాయావతి సూచించారు. బుల్డోజర్ చర్యలను కోర్టు తప్పుబట్టడంతో BJP-SP మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బుల్డోజర్ చర్యలను బీజేపీ సమర్థించుకోగా, అదే గుర్తుపై పోటీ చేసి గెలవాలని అఖిలేశ్ సవాల్ చేశారు.
TG: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఖైరతాబాద్ శ్రీగణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు CM రేవంత్ రెడ్డిని కోరారు. ఈమేరకు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా అర్చకులు రేవంత్కు ఆశీర్వచనం అందించారు.
వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సహాయంగా రూ.15 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు నటుడు వరుణ్ తేజ్ ట్విటర్లో ప్రకటించారు. ‘తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.5లక్షలు, ఏపీ పంచాయతీరాజ్ శాఖకు రూ.5 లక్షలు మొత్తం రూ. 15 లక్షలు విరాళంగా అందిస్తున్నాను’ అని వెల్లడించారు.
TG:విద్యార్థుల స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట దక్కింది. MBBS అడ్మిషన్లకు సంబంధించి జారీ చేసిన GO 33ను న్యాయస్థానం సమర్థించింది. పిటిషనర్ల స్థానికతను నిర్ధారించుకున్నాకే, వారి దరఖాస్తులను తీసుకోవాలని సూచించింది. విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులేనా? కాదా? అన్నది పరిశీలించాలంది. ప్రస్తుతం వీటిపై గైడ్లైన్స్ లేకపోవడంతో కొత్తగా రూపొందించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ఆదేశించింది.
బెంగళూరులో సెప్టెంబర్ 29న బీసీసీఐ 93వ ఏజీఎం జరగనుంది. ఇప్పటికే 18 అంశాలతో కూడిన అజెండాను రాష్ట్ర సంఘాలకు పంపించారు. ఐసీసీకి వెళ్తున్న జైషా స్థానంలో మరొకర్ని ఈ సమావేశంలో ఎన్నుకొనే అవకాశం లేదని తెలిసింది. డిసెంబర్ 1న ఆయన ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఏజీఎం రోజే జరిగే కొత్త NCA ప్రారంభోత్సవంలో బోర్డు సభ్యులు పాల్గొంటారు. కొత్త కార్యదర్శి ఎంపికకు SGM నిర్వహిస్తారని సమాచారం.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ హీరో, హీరోయిన్ కలిసి మూడు, నాలుగు సినిమాలు తీయడమే ఎక్కువ. కానీ ఓ జంట ఏకంగా 130 చిత్రాల్లో కలిసి నటించారనే విషయం మీకు తెలుసా? 1962 – 1981 మధ్యకాలంలో మలయాళ నటీనటులు ప్రేమ్ నజీర్, షీలా 130 చిత్రాల్లో కలిసి నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. సూపర్ హిట్ జోడీగానూ పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ నటించిన సినిమాల్లో 50కిపైగా చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
రిలయన్స్ జియో వినియోగదారులు సిమ్ యాక్టివేషన్ కోసం ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్లకుండా ఇంట్లోనే చేసుకునే సదుపాయం తీసుకొచ్చింది. ఐయాక్టివేట్తో ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీని కోసం MY JIO యాప్లో ఐయాక్టివేట్పై క్లిక్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసి ‘గో ఫర్ జియో ఐయాక్టివేట్’పై క్లిక్ చేయాలి. అనంతరం కేవైసీ పూర్తి చేయడంతో సిమ్ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఉద్యోగుల సంక్షేమం కోరుకున్న ఓ థాయ్ కంపెనీ వారికి పెయిడ్ టిండర్ లీవ్ ఇచ్చినట్టు స్ట్రైయిట్స్ టైమ్స్ తెలిపింది. వైట్లైన్ గ్రూప్ ఈ డిసెంబర్ వరకు టిండర్ గోల్డ్, ప్లాటినమ్ సబ్స్క్రిప్షన్కు డబ్బులు ఇస్తోందట. డేటింగ్ తేదీకి వారం ముందు నోటీస్ ఇవ్వాలని సూచించింది. ప్రేమ వల్ల సంతోషం దాంతో ప్రొడక్టివిటీ పెరుగుతుందని కంపెనీ భావన. డేటింగ్కు వెళ్లే టైమ్ లేదన్న ఓ ఉద్యోగి మాటలే ఈ నిర్ణయానికి కారణం.
Sorry, no posts matched your criteria.