India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బర్డ్ ఫ్లూతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. అయినా చికెన్ ధరల్లో పెద్దగా మార్పులు లేవు. కొన్నిచోట్ల KG ₹100-₹150 మధ్యే చికెన్ లభిస్తుండగా, చాలా ప్రాంతాల్లో ₹190 వరకూ పలుకుతోంది. HYDలో ₹170-190 ఉండగా, సూర్యాపేటలో ₹150, తుంగతుర్తిలో ₹170, WGలో రూ.180, VJAలో రూ.180, VZM, కడపలో రూ.150, అనంతపురంలో రూ.120, రామచంద్రాపురంలో రూ.200 వరకూ ఉంది. మరి మీరు చికెన్ తింటున్నారా? ధర ఎంత? కామెంట్ చేయండి.

ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. కార్మికులను రక్షించేందుకు వారు పలు రకాల ప్లాన్లు వేస్తున్నారు. మరోవైపు ఎంతో కష్టపడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్నారు. టన్నెల్లో భారీగా బురద, శిథిలాలు ఉండటంతో రెస్క్యూకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

నితేశ్ తివారీ డైరెక్షన్లో ‘రామాయణ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రావణుడి పాత్రలో కనిపించనున్న యశ్ కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు సమాచారం. యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తొలి భాగం 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే.

TG: రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పి.విశ్వప్రసాద్-క్రైమ్స్ అదనపు కమిషనర్ HYD, బి.నవీన్ కుమార్-CID ఎస్పీ HYD, గజారావు- ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సైబరాబాద్, డి.జోయెల్ డేవిస్-ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ HYD, సిరిశెట్టి సంకీర్త్ గవర్నర్ ADC, బి.రాంరెడ్డి- CID SP HYD, సీహెచ్ శ్రీధర్-ఇంటెలిజెన్స్ ఎస్పీ HYD, ఎస్.చైతన్య కుమార్-SB డీసీపీ HYD.

TG: చిన్న విషయాలకే పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడం కలవరపెడుతోంది. తాజాగా HYD ఉప్పల్లోని ఓ స్కూల్లో ఇలాంటి ఘటనే జరిగింది. క్లాస్ రూమ్లోని CCTV డైరెక్షన్ను మార్చడంతో 8th క్లాస్ బాలుడు సంగారెడ్డి(13)ని PET మందలించి కొట్టాడు. మరో టీచర్ కూడా తిట్టింది. మనస్తాపానికి గురైన బాలుడు నోట్ బుక్లో ‘సారీ మదర్.. ఐ విల్ డై టుడే’ అని రాసి పాఠశాల భవనంపై నుంచి దూకేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు.

TG: SLBC టన్నెల్లో <<15548177>>చిక్కుకున్న<<>> 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 14 కిలోమీటర్ల లోపల బాధితులు ఉండగా బురద, మోకాళ్లలోతు నీళ్ల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. NDRF బృందాలు లోపలికి నడుచుకుని వెళ్లి శిథిలాలను తొలగిస్తున్నాయి. ప్రమాదం జరిగి ఇప్పటికే 24 గంటలు అవుతుండటంతో బాధితుల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.

TG: సిమెంట్, స్టీల్ ఖర్చు లేకుండా ఉండేందుకు ఇందిరమ్మ ఇళ్లను పిల్లర్లు లేకుండా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లర్ల నిర్మాణానికి వ్యయం ఎక్కువై లబ్ధిదారులు ఇళ్లను అసంపూర్తిగా ఆపేస్తారనే కారణంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మండలానికి ఒకటి చొప్పున మోడల్ ఇళ్లను నిర్మించనుంది. పిల్లర్లు, బీములు లేకుండా నిర్మించేందుకు ‘న్యాక్’లో కొందరు మేస్త్రీలకు శిక్షణ ఇచ్చింది.

AP: రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 189.9KM మేర అలైన్మెంట్కు ఓకే చెప్పింది. 5 జిల్లాల(ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు) పరిధిలోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. త్వరలోనే భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ORRలో 2 బ్రిడ్జిలు, 78 అండర్పాస్లు, 65 వంతెనలు నిర్మిస్తారు.

మైనర్ బాలికే అయినా ఓ వ్యక్తితో గడిపితే ఎదురయ్యే పర్యవసానాలు అన్నీ ఆమెకు తెలుసని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, ఓ యువకుడితో మూడు రాత్రిళ్లు పరస్పర ఇష్టంతో గడిపింది. కానీ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి ఐదేళ్లు జైల్లో పెట్టారు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం పరస్పరం ఇష్టంతో గడిపినందుకే అతడికి బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత జరిగే BAC సమావేశంలో సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈనెల 25న చర్చ జరగనుంది. 26న శివరాత్రి, 27న MLC ఎన్నికల నేపథ్యంలో సభ ఉండదు. 28న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 3 నుంచి బడ్జెట్పై చర్చ జరగనుంది.
Sorry, no posts matched your criteria.