India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ముగ్గురు సంతానం ఉన్న వారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయించిందని సమాచారం. దీంతో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వారు కూడా సర్పంచ్లుగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అటు APలో ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి పోటీకి అవకాశం కల్పించింది.
భారత జట్టు సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజాల టెస్ట్ క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. వాళ్లను పక్కనబెట్టాలని డిమాండ్లు వస్తుండటంతో BGT సిరీస్లో వారి ఆటతీరును BCCI స్వయంగా పర్యవేక్షించనుంది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియాలోనే ఉండి కోచ్ గంభీర్తో కలిసి ఈ ముగ్గురి భవిష్యత్తుపై చర్చింవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదే వాళ్లకు ఆఖరి సిరీస్ అయ్యే ఛాన్సూ ఉంది.
ఇండియాతో ఫస్ట్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్వుడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పంత్ వంటి బ్యాటర్లకు బౌలింగ్ చేయాలంటే బౌలర్ల వద్ద ప్లాన్ B, C కూడా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి అతడిని అడ్డుకోవడంపై హేజిల్వుడ్ స్పందించారు. భారత జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందని జోష్ చెప్పారు.
క్రిప్టో కరెన్సీ రారాజు బిట్కాయిన్ రికార్డులను తిరగరాస్తోంది. తొలిసారి $94000ను టచ్ చేసింది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.80లక్షలకు చేరువగా ఉంటుంది. క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ Bakktను డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థ కొనుగోలు చేయనుందన్న వార్తలే దీనికి కారణం. పైగా ఆయన క్రిప్టో ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తారన్న అంచనాలూ పాజిటివ్ సెంటిమెంటును పెంచాయి. ప్రస్తుతం BTC $92000 వద్ద చలిస్తోంది.
సింగిల్గా ఉన్న తమ ఉద్యోగులకు ఓ చైనా కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. షెన్ జెన్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఉద్యోగులు డేట్కు వెళ్తే నగదు బహుమతి ఇస్తోంది. కంపెనీలోని సింగిల్స్కు డేటింగ్ ఖర్చుల కోసం రూ.770 అందిస్తోంది. ఒకవేళ డేటింగ్లో ఉంటే ఇద్దరికీ చెరో రూ.11,650 ఇస్తోంది. పెళ్లిళ్లు చేసుకోకపోవడం, తద్వారా జనాభా తగ్గుతుండటంతో చైనా ప్రభుత్వంతోపాటు అక్కడి కంపెనీలు వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఈ సాయంత్రం గం.6 తర్వాత విడుదల కానున్నాయి. వీటితో పాటు రాహుల్ రిజైన్తో అనివార్యమైన వయనాడ్ బైపోల్ అంచనా ఫలితాలనూ మీడియా సంస్థలు వెల్లడించనున్నాయి. అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ను మీరు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఎక్స్క్లూజివ్గా వే2న్యూస్లో తెలుసుకోవచ్చు. ఒక్క ఫ్లిప్తో సర్వే ఫలితాలన్నీ మీకు అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
AP: 21 మంది ఎంపీలుండటంతో ఢిల్లీలో మన పరపతి బాగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. ‘గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు శాపంగా మారాయి. రాష్ట్రం దాదాపు వెంటిలేటర్పై ఉన్నట్లుంది. ఇచ్చిన హామీలపై నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
AP: YCP హయాంలో CM చంద్రబాబుపై జరిగిన మహా కుట్రపై విచారణ జరిపించాలని హోంమంత్రి అనితకు నెల్లూరు రూరల్ TDP MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు. ‘బాబుపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచింది. ఇది కచ్చితంగా కుట్రేనని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ కూడా చెప్పారు. సీఎంవోలో పెద్దల మద్దతు ఉంటేనే ఈ కుట్ర సాధ్యం. దీనిపై విచారణ చేయాలని డీజీపీకి కూడా లేఖ రాశా’ అని ఆయన పేర్కొన్నారు.
TG: వికారాబాద్(D) లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. నరేందర్రెడ్డి అరెస్టు విధానాన్ని కోర్టు తప్పుబట్టింది. ఆయన పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. వాకింగ్కు వెళ్లిన ఓ మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదిలా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. తీర్పును రిజర్వ్ చేసింది.
హీరో ధనుష్కు నయనతార రాసిన <<14626837>>ఓపెన్ లెటర్పై<<>> అతని తండ్రి కస్తూరి రాజా స్పందించారు. ‘మాకు పని ముఖ్యం. అందుకే ముందుకు సాగుతున్నాం. వెన్నుపోటు పొడిచే వారికి సమాధానం చెప్పే సమయం మాకు లేదు. నాలాగే నా కొడుకు దృష్టి కూడా పనిపైనే ఉంటుంది’ అని తెలిపారు. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దానే’ మూవీ క్లిప్స్ వాడుకున్నందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకు ధనుష్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.