India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.77,620కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10గ్రా. ధర రూ.500 పెరిగి రూ.71,150గా నమోదైంది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ థర్డ్ సింగిల్పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ ఇచ్చారు. ఇది మెలోడీ సాంగ్ అని, త్వరలో రిలీజ్ అప్డేట్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జరగండి, రా మచ్చా మచ్చా సాంగ్స్ రిలీజవగా మ్యూజిక్ లవర్స్ను మెప్పించాయి. దీంతో హీరోహీరోయిన్ మధ్య నడిచే మెలోడీకి సెట్స్, మ్యూజిక్ ఎలా ఉంటాయోనని? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
నేషనల్ హైవేలపై వెళ్లేటప్పుడు ద్విచక్రవాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. బైకుల కోసం టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక మార్గం ఉంటుంది. ఇతర వాహనాలతో పోల్చితే బైకుల సైజు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే బైకులు బరువు కూడా తక్కువగా ఉండటం వల్ల ఇతర వాహనాలతో పోల్చితే రోడ్డుపై అధిక భారం పడదు.
TG: మియాపూర్ బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8న ఉదయం బాలికను నిందితుడు చింటూ తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. తన ఫ్రెండ్, అతని భార్య బయటికెళ్లడంతో మధ్యాహ్నమే ఆమెను చంపేశాడు. ఆపై మీ కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక పేరెంట్స్కు ఫోన్ చేసి చెప్పాడు. పదే పదే పలువురికి వాట్సాప్ కాల్ చేసినట్లు తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.
AP: ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు గట్టి సంకల్పంతో ఉన్నామని డిప్యూటీ CM పవన్ వెల్లడించారు. ఇందుకోసం కేంద్రం ఇచ్చిన జల జీవన్ మిషన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ’75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ప్రజలకు ఇంకా సురక్షిత నీరు అందకపోవడం చాలా బాధాకరం. తిరువూరు, ఉద్దానం, కనిగిరి, ఉదయగిరి సహా మరిన్ని ప్రాంతాల్లో మంచినీరు ఇచ్చేలా RO ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించారు.
TG: సీఎం రేవంత్ నేడు వేములవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవులు ఇచ్చాయంటూ BRS తప్పుబట్టింది. స్కూల్ బస్సులను సీఎం సభ కోసం కేటాయించామని, దీంతో ఈ రోజు స్కూళ్లకు హాలిడే ప్రకటిస్తున్నట్లు పిల్లల పేరెంట్స్కు వాట్సాప్లో మెసేజ్లు వచ్చినట్లు పేర్కొంది. అయితే దీనికి బదులుగా Dec 14న(రెండో శనివారం) వర్కింగ్ డేగా ఉంటుందని DEO చెప్పినట్లు ఆ మెసేజ్లో ఉంది.
తనపై వచ్చిన <<14658660>>బిట్కాయిన్ స్కామ్<<>> ఆరోపణలన్నీ అవాస్తవాలేనని NCP SP నేత సుప్రియా సూలె అన్నారు. పోలింగ్ వేళ BJP కుట్ర రాజకీయాలకు తెరతీసిందని విమర్శించారు. ‘BJP నేతలెవరితోనైనా, ఎప్పుడైనా దీనిపై చర్చకు నేను సిద్ధం. పోలింగుకు ముందు రాత్రి ఆ పార్టీ అబద్ధాలు వ్యాప్తి చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. సుదాన్షు త్రివేది ఆరోపణలన్నీ అవాస్తవాలే. మా లాయర్ ఆయనపై క్రిమినల్, సివిల్ పరువునష్టం దావా వేస్తారు’ అని అన్నారు.
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక విషయాలపై మాట్లాడతారని తెలుస్తోంది. పోలవరం, రుషికొండ వంటి పలు అంశాలపై ఆయన మీడియాకు వివరించనున్నట్లు సమాచారం. అలాగే కూటమి సర్కార్కు ఆయన పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు యావత్ పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తెలిపారు. కోహ్లీ తొలిసారి పాక్ గడ్డపై అడుగుపెట్టాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘విరాట్ పాక్ గడ్డపై సెంచరీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించలేం. ఇక్కడ ఆడితే ఆయన క్రికెట్ జీవితం పరిపూర్ణం అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు చివరి క్షణంలోనైనా భారత్ ఇక్కడికి వస్తుందేమో చూడాలి’ అంటూ పేర్కొన్నారు.
కాన్పూర్ సెంట్రల్ స్టేషన్లో కొడుకును రైలు ఎక్కించేందుకు వచ్చిన ఓ తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. వందేభారత్ రైలెక్కి కొడుకు సీటు వద్ద లగేజీ పెట్టి దిగుతుండగా డోర్లు క్లోజ్ అయ్యాయి. దీంతో అతను కొడుకుతో కలిసి న్యూఢిల్లీ వరకూ వెళ్లాల్సి వచ్చింది. ఇలా టికెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకు టీసీ రూ.2870 జరిమానా విధించారు. ఎవరైనా తమవారికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చినప్పుడు వందేభారత్లోకి ఎక్కకపోవడమే బెటర్.
Sorry, no posts matched your criteria.