India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాకిస్థాన్ పౌరుడు అలీ తాఖీర్ షేక్పై అస్సాంలో FIR నమోదైంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్తో అతడు కాంటాక్టులో ఉన్నాడని సమాచారం. ఢిల్లీ అల్లర్లపై గౌరవ్ ఇచ్చిన స్పీచ్కు అతడు సంబరపడ్డాడని తెలిసింది. గౌరవ్, ఎలిజబెత్కు పాకిస్థాన్తో సంబంధాలపై అస్సాం క్యాబినెట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే పని మొదలు పెట్టిన సీఐడీ నేడు ఒకరిపై FIR నమోదు చేయడం గమనార్హం.

APలో GBS <<15485860>>కేసులు <<>>భారీగా పెరుగుతుండటంపై ఆందోళన నెలకొంది. దీంతో గిలియన్ బార్ సిండ్రోమ్ వ్యాధిపై తన నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి సత్యకుమార్, అధికారులతో కలిసి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు.

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. గురువారం సాయంత్రం 4:30కు ప్రధాని మోదీ, HM అమిత్ షా, కేంద్ర మంత్రుల సమక్షంలో రామ్లీలా మైదానంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. మంత్రివర్గమూ అదే రోజు ప్రమాణం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ, రేఖా గుప్తా, ఆశీశ్ సూద్ ముందు వరుసలో ఉన్నారు.

ప్రపంచ జనాభా అంచనాలపై ఐరాస నివేదిక విడుదల చేసింది. 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లకు చేరుతుందని, 2100 నాటికి 150 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. మరోవైపు 2061 నాటికి చైనా జనాభా 120 కోట్లకు తగ్గుతుందని, 2100 నాటికి 63 కోట్లకు పరిమితం అవుతుందని నివేదికలో వెల్లడించింది.

‘పుష్ప’ నటుడు ధనంజయ(జాలి రెడ్డి) తన ప్రేయసి డాక్టర్ ధన్యతను పెళ్లి చేసుకున్నారు. నిన్న తెల్లవారుజామున వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సన్నిహితుల సమక్షంలో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకలకు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, తెలుగు దర్శకుడు సుకుమార్ తదితరులు హాజరయ్యారు.

AP: రాష్ట్రంలో YCP ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రులందరూ కలిపి 58 ఏళ్ల పాటు చేసిన అప్పుపై రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా జగన్ పాలన ముగిసే నాటికి రూ.24,944 కోట్లకు చేరిందని తెలిపారు. 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ చేసిన అప్పుపై చెల్లించే వడ్డీనే రూ.11 వేల కోట్లు అధికమన్నారు.

మీకు డైరీ రాసే అలవాటు ఉందా? కొందరు రోజంతా జరిగిన విషయాలను రాత్రయ్యాక అంతా నెమరేసుకొని డైరీలో నమోదు చేస్తుంటారు. అయితే, ఎప్పుడో ఒక్కరోజైనా రాయడం మిస్ అవుతుంటుంది. కానీ, ఓ వృద్ధురాలు ఏకంగా 90 ఏళ్లుగా డైరీ రాస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికాలోని నార్త్ డకోటా ప్రాంతంలో నివసించే ఎవీ రిస్కీకి 100 ఏళ్లు. తనకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి ఆమె ప్రతిరోజూ డైరీ రాస్తున్నారు. ఇప్పటికి 33వేల డైరీలు పూర్తయ్యాయి.

IPL 2025 షెడ్యూల్ ప్రకారం ఉప్పల్ వేదికగా 9 మ్యాచులు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే HYDలో లీగ్ దశలో ఆర్సీబీ, సీఎస్కేతో ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం SRH అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ టీమ్స్లోనే ధోనీ, కోహ్లీ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. అయితే MIతో ఏప్రిల్ 23న మ్యాచ్ ఉండటం కాస్త ఊరటనిస్తోంది. మరి ఉప్పల్ వేదికగా జరిగే క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆ జట్లతో తలపడుతుందేమో చూడాలి.

AP: తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శాంతిభద్రతల సమస్య, కోరం లేకపోవడం కారణంగా వాయిదా వేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. రేపు ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. అలాగే పాలకొండ నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక కూడా కోరం లేక మళ్లీ వాయిదా పడింది. మరోవైపు పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. YCP నుంచి TDPలోకి వెళ్లిన ఆమెకు 17 మంది మద్దతు పలికారు.

ఇవాళ్టి నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. బ్లాక్లిస్టు, ఇన్యాక్టివ్లో ఉన్న FASTag యూజర్లు టోల్ గేటుకు వచ్చే 70ని.ల్లోపు ఆ జాబితా నుంచి బయటకు రావాలి. లేదంటే డబుల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే ఆ ఖాతా బ్లాక్లిస్టులోకి వెళ్తుంది. కాబట్టి ముందుగానే రీఛార్జ్, KYCని కంప్లీట్ చేసుకోవడం బెటర్.
Sorry, no posts matched your criteria.