News November 19, 2024

అత్యాచారం కేసులో నటుడికి ముందస్తు బెయిల్

image

లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు సిద్దిఖ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు అత్యున్నత ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో సమర్పించి, విచారణకు సహకరించాలని ఆదేశించింది. మరోవైపు సిద్దిఖ్‌పై ఫిర్యాదు చేయడానికి 8 ఏళ్లు ఎందుకు పట్టిందని బాధితురాలి లాయర్‌ను కోర్టు ప్రశ్నించింది. కాగా సిద్దిఖ్ తనపై 2016లో అత్యాచారం చేశాడని ఓ నటి ఈ ఏడాది ఆగస్టులో ఫిర్యాదు చేశారు.

News November 19, 2024

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?

image

తాము అందిస్తున్న లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు అమెరికా ఉక్రెయిన్‌కు పర్మిషన్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని రష్యా మండిపడింది. తమ దేశం పైకి క్షిపణులు వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం నాటో దేశాలకు విస్తరిస్తుందనే ఆందోళన నెలకొంది. పౌరులు నిత్యావసరాలు, ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని నార్వే, ఫిన్లాండ్ సూచించాయి.

News November 19, 2024

ఎంత పని చేశావయ్యా బైడెన్!

image

తాను గెలిస్తే యుద్ధాలు ఆపేస్తానని కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. కానీ మరో 60 రోజుల్లో కుర్చీ నుంచి దిగిపోనున్న బైడెన్ పెద్ద చిచ్చే పెట్టారని అంతర్జాతీయ నిపుణులు ఫైరవుతున్నారు. లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు పర్మిషన్ ఇవ్వడమే దీనికి కారణం. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బైడెన్ చెప్పారు. ఒకవేళ మిస్సైల్స్ ప్రయోగిస్తే రష్యా ఊరుకోదు.

News November 19, 2024

డబ్బు కోసమే ఢిల్లీ నన్ను వదులుకోలేదు: పంత్

image

డబ్బు కోసమే తనను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకోలేదని, ఇది నిజం అని టీమ్ ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ట్వీట్ చేశారు. కాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రిషభ్ పంత్ రూ.18 కోట్ల కంటే ఎక్కువ ఆశించినట్లుంది. అందుకే డీసీ వదిలేసి ఉంటుంది. కానీ మెగా వేలంలో అతడిని ఢిల్లీ మళ్లీ కచ్చితంగా దక్కించుకుంటుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పంత్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

News November 19, 2024

ధనుష్-నయన్ వివాదం.. రాధిక కీలక వ్యాఖ్యలు

image

ధనుష్-నయనతార వివాదం నేపథ్యంలో రాధికా శరత్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీలో ఆమె విజయ్ తల్లిగా నటించారు. ‘షూటింగ్ సమయంలో ధనుష్ కాల్ చేసి ‘‘అక్కా.. నీకు సిగ్గులేదా?’’ అని అనడంతో షాక్ అయ్యా. ఏమైందని అడిగా. ‘‘విఘ్నేశ్-నయన్ డేటింగ్‌లో ఉన్నట్లు నీకు తెలియదా?’’ అని అడిగాడు. నాకు నువ్వు చెప్పేవరకు తెలియదని చెప్పా’ అని డాక్యుమెంటరీలో రాధిక చెప్పిన వీడియో వైరలైంది.

News November 19, 2024

BGT కోసం భారత క్రికెటర్ల ప్రాక్టీస్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జైస్వాల్, రిషభ్ పంత్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. ఆయన హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. కాగా ఈ నెల 22 నుంచి INDvsAUS మధ్య పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

News November 19, 2024

‘అన్నదాత సుఖీభవ’కు బడ్జెట్ కేటాయించాం: అచ్చెన్నాయుడు

image

AP: త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులను రైతులకు ఇస్తామని, ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్‌లో రూ.4,500 కోట్లు కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మండలిలో YCP సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఏటా రైతులందరికీ రూ.20 వేలు అందజేస్తాం. ఇందులో PM కిసాన్ రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి ఇస్తాం. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News November 19, 2024

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎలా మొదలైందంటే?

image

ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా 1996లో భారత పర్యటనకు వచ్చింది. అప్పుడే క్రికెట్‌కు విశేష సేవలందించిన దిగ్గజ క్రికెటర్లు అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ గౌరవార్థం ఓ సిరీస్ నిర్వహించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. వెంటనే ఈ సిరీస్‌కు ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ’గా నామకరణం చేశాయి. అలా మొదలైన ఈ సిరీస్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య మొత్తం 16 సిరీస్‌లు జరగ్గా టీమ్‌ఇండియా 10సార్లు నెగ్గింది.

News November 19, 2024

నారా రోహిత్‌కు ప్రధాని మోదీ లేఖ

image

టాలీవుడ్ హీరో నారా రోహిత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడి మృతికి ప్రధాని సంతాపం తెలిపారు. రామ్మూర్తి అందరినీ విడిచి వెళ్లినా, కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ విషాదం నుంచి రోహిత్‌ త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా నిలబడాలని ఆయన కోరుకున్నారు. ఇందుకు ప్రధాని మోదీకి రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు.

News November 19, 2024

‘నువ్వు బతికి వేస్ట్.. చచ్చిపో’ అనడంతో యువతి ఆత్మహత్య

image

TG: తెలిసిన యువకుడు వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేయడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగింది. హాసిని(20)కి నిఖిల్‌తో ఇంటర్‌లో పరిచయం ఏర్పడింది. తరచూ ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతూ వేధించేవాడు. ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ను హ్యాక్ చేసి పోస్టులు పెట్టేవాడు. తాజాగా ఆమెను ‘నువ్వు బతికి వేస్ట్.. చచ్చిపో’ అని అనడంతో పాటు అసభ్యంగా దూషించడంతో హాసిని సూసైడ్ చేసుకుంది.