India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో భాగంగా హర్యానా స్టీలర్స్తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 49-27 తేడాతో ఘనవిజయం సాధించింది. స్టార్ రైడర్ పవన్ షెరావత్ టీమ్లో లేకపోయినా విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ అద్భుతంగా రాణించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ 7వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడి ఆరింట్లో గెలవగా, నాలుగింట్లో ఓడింది. ఈనెల 20న యూ ముంబాను ఢీకొట్టనుంది.
✒ G20 సమ్మిట్లో బైడెన్తో మోదీ భేటీ
✒ UPAలో కులగణన చేయకపోవడం తప్పే: రాహుల్
✒ AP: శ్రీవాణి ట్రస్ట్ రద్దు.. తిరుమలలో రాజకీయాలపై నిషేధం
✒ AP: అంగన్వాడీలకు గ్రాట్యుటీపై పరిశీలన: సంధ్యారాణి
✒ పవన్ కళ్యాణ్పై MIM కార్యకర్త ఫిర్యాదు
✒ AP: భూఅక్రమాలపై విచారణ చేయించండి: బొత్స లేఖ
✒ TG: రైతులు, ఉద్యోగాల విషయంలో PM ఫెయిల్: రేవంత్
✒ TG: దూరదృష్టితో కులగణన: పొంగులేటి
✒ TG: అరెస్టులకు భయపడేవారు లేరిక్కడ: KTR
తాజా ఎన్నికల సీజన్లో రూ.1000 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్టు ECI తెలిపింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ కలుపుకొని రూ.858 కోట్లు స్వాధీనం చేసుకున్నామంది. 2019తో పోలిస్తే ఈ విలువ 7 రెట్లు ఎక్కువని తెలిపింది. మహారాష్ట్రలో రూ.660 కోట్లు, ఝార్ఖండ్లో రూ.198 కోట్లు, బై పోల్స్ జరిగే రాష్ట్రాల్లో రూ.223 కోట్లమేర సీజ్ చేశామని వెల్లడించింది. NOV 20న తుదిదశ పోలింగ్ ఉండటంతో నిఘా ఇంకా పెంచుతామని పేర్కొంది.
దేశంలో పిల్లల పెంపకం ఖర్చు గణనీయంగా పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఖర్చులు ఇవే. పిల్లల ఆహారానికి ఏడాదికి రూ.35వేలు, బట్టలకు రూ.24 వేలు, ఆరోగ్య సంరక్షణకు రూ.20వేలు, విద్యకు రూ. 5వేల నుంచి రూ.లక్ష, డిగ్రీ చదివే పిల్లలుంటే రూ.5లక్షల వరకు, ఆటవస్తువులు & ఇతర అవసరాలకు రూ.25వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉంటాయి.
ప్రజాపాలన విజయోత్సవ వేడుకల వేళ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరాల జల్లు కురిపించింది.
* వరంగల్ మహానగర అభివృద్ధికి రూ.4962.47కోట్లు
* వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170కోట్లు
* కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు రూ.160.92కోట్లు
* టెక్స్టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలకు రూ.33.60కోట్లు
* పార్క్కు భూములిచ్చిన రైతులకు 863ఇళ్లు, రూ.43.15 కోట్ల పరిహారం
* కాళోజీ కళాక్షేత్రానికి రూ.85
* మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు రూ.205
* పరకాల- ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణకు రూ. 65
* పాలిటెక్నిక్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.28
* వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్కు రూ.32.50
* ఇన్నర్ రింగ్ రోడ్ కోసం రూ.80
* గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లకు రూ.49.50
* నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 8.3
బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల(కాంట్రాక్ట్)కు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. పోస్టును బట్టి బీఈ/బీటెక్/డిగ్రీ/ఎంబీఏ/పీజీ చేసిన వారు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, EWS,OBC అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.100 ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం <
వెబ్సైట్: https://www.bankofbaroda.in
AP: ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్ల జాబితాపై EC కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాహమైన మహిళా ఓటర్ల ఇంటిపేరు ధ్రువపత్రాలతో సరిపోలకున్నా తిరస్కరించవద్దని ఎమ్మార్వోలకు సూచించింది. ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలకు డిసెంబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది. ఆన్లైన్లో దాఖలు చేసిన దరఖాస్తులను పరిశీలించాలని తహశీల్దార్లను ఆదేశించింది.
TG: KCR అంటే చరిత్ర అని, పదేళ్లు అద్భుతంగా పాలించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పల్లెలతో పాటు హైదరాబాద్ను అభివృద్ధి చేశారని, దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. కేసీఆర్ కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని వివరించారు. కేశవ చంద్ర రమావత్ (KCR) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు ఆయన హాజరయ్యారు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది.
ఉద్యోగ నియామక ప్రకటనల్లో ఏజ్, జెండర్, మారిటల్ స్టేటస్, కంపెనీ పేరు తొలగించాలని రిక్రూటింగ్ ఏజెంట్లను ఫాక్స్కాన్ ఆదేశించినట్టు తెలిసింది. యాంటీ డిస్క్రిమినేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. AC వర్క్ప్లేస్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, క్యాంటీన్, ఫ్రీ హాస్టల్ వంటివి పెట్టాలని చెప్పింది. శ్రీపెరంబదూర్లోని ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లో ఉద్యోగుల ఎంపిక కోసం థర్డ్పార్టీ ఏజెన్సీలను కంపెనీ నియమించుకుంది.
Sorry, no posts matched your criteria.