News February 14, 2025

‘బ్రహ్మా ఆనందం’ రివ్యూ

image

ప్రేమకు వయసుతో సంబంధం లేదనే సందేశాన్ని తాతామనవళ్ల బంధంతో చెప్పడమే ‘బ్రహ్మా ఆనందం’ కథ. గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కామెడీ, సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే, పాత్రల నేపథ్యాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, స్క్రీన్‌ప్లేలో కన్ఫ్యూజన్, సెకండాఫ్ గాడి తప్పడం మైనస్. వృద్ధ ప్రేమకథ అందరికీ నచ్చకపోవచ్చు.
రేటింగ్: 2.25/5

News February 14, 2025

వారంలో నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్

image

TG: ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. స్థలాల గుర్తింపుపై వారంలో నివేదిక అందించాలని, త్వరగా స్థలాలు గుర్తించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న స్థలాలు స్కూళ్లకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. 105 నియోజకవర్గాల్లో రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం విద్యాశాఖపై సమీక్షలో స్పష్టం చేశారు.

News February 14, 2025

మూల్యం చెల్లించక తప్పదు: జగన్ వార్నింగ్

image

AP: వల్లభనేని వంశీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయమని YS జగన్ మండిపడ్డారు. తనతో తప్పుడు కేసు పెట్టించారని యువకుడు వాంగ్మూలం ఇస్తే తట్టుకోలేక దుర్మార్గాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే డ్రైవర్‌ను TDP MLA చింతమనేని బూతులు తిడితే మాజీ MLA అబ్బయ్య చౌదరిపై కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. కూటమి తప్పులను ప్రజలే డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారని, తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

News February 14, 2025

దొంగతనం చేసి ఆలయానికి విరాళం

image

రాజస్థాన్‌ అజ్మీర్‌లోని ముగ్గురు దొంగలు దేశవ్యాప్తంగా వైరలైపోయారు. వీరు ఓ షాపింగ్ మాల్‌లో దొంగతనానికి వెళ్లే ముందు అంతా సజావుగా సాగితే ఆలయానికి విరాళం ఇస్తామని దేవుడికి మొక్కుకున్నారు. రూ.15 లక్షల విలువైన వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత ఆలయానికి రూ.లక్ష విరాళం ఇచ్చి అన్నదానం నిర్వహించారు. 200 CCTV ఫుటేజ్‌లు పరిశీలించి 900KMS ప్రయాణించి దొంగలను పోలీసులు పట్టుకొని విచారించగా ఈ విషయం తెలిసింది.

News February 14, 2025

BGTకి 27 బ్యాగులు తీసుకెళ్లిన క్రికెటర్?

image

BGT కోసం ఓ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ 27 బ్యాగులు తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. తనతోపాటు కుటుంబసభ్యులు, సిబ్బంది లగేజీ, 17 బ్యాట్లతో కలిపి 250 కిలోలకుపైగా లగేజీకి BCCI నుంచి ఛార్జి కట్టించినట్లు తెలుస్తోంది. ఇది రూ.లక్షల్లో ఉంటుందని సమాచారం. BCCI నిధులు దుర్వినియోగం చేసిన ఆ ప్లేయర్‌పై ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. సొంత డబ్బుతో టికెట్ తీసుకోవచ్చు కదా అంటూ విమర్శిస్తున్నారు.

News February 14, 2025

కేజ్రీవాల్ సన్నిహితుడు సత్యేందర్ జైన్‌కు షాక్

image

AAP అగ్ర నేతలకు కష్టాలు తప్పేలా లేవు. ఢిల్లీ మాజీ మంత్రి, కేజ్రీవాల్ సన్నిహితుడు సత్యేందర్ జైన్‌పై దర్యాప్తునకు అనుమతించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును హోంమంత్రిత్వ శాఖ కోరింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ED బలమైన ఆధారాలు సేకరించడమే ఇందుకు కారణమని తెలిసింది. 2017లో CBI ఆయనపై FIR దాఖలు చేసింది. ఆ తర్వాత ED రంగంలోకి దిగింది. 2022 మేలో ఈ కేసులో అరెస్టైన జైన్‌కు గత OCTలో బెయిల్ వచ్చింది.

News February 14, 2025

బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి పయ్యావుల భేటీలు

image

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివిధ శాఖల అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 22 శాఖల నుంచి ప్రతిపాదనలను తీసుకున్నారు. ఆయా నివేదికల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇవాళ హోం శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు పయ్యావులతో సమావేశమై చర్చించారు.

News February 14, 2025

Good News: వీరి జీతాలు 40% పెరగొచ్చు!

image

2025లో వార్షిక వేతనాలు 6-15% వరకు పెరగొచ్చని మైకేల్ పేజ్ 2025 శాలరీ గైడ్ అంచనా వేసింది. ఉద్యోగంలో సంక్లిష్టత, నాయకత్వ బాధ్యతలను బట్టి AI, ML, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ రంగాల్లో శాలరీలు గరిష్ఠంగా 40% వరకు పెరుగుతాయని పేర్కొంది. డిమాండును బట్టి అకౌంటింగ్‌లో ₹22L, మార్కెటింగ్ మేనేజర్‌కు ₹35L, సాఫ్ట్‌వేర్ డెవలపింగ్‌లో ₹50L వరకు సగటు వేతనాలు ఉంటాయని అంచనా వేసింది. మిగిలిన రంగాల్లో తక్కువేనంది.

News February 14, 2025

రేషన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్!

image

TG: రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధం చేసినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. దీంతో రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ సందర్భంగా సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. కాగా ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల బియ్యం అందిస్తారు.

News February 14, 2025

‘యాసిడ్’ బాధితురాలిని బెంగళూరుకు తరలింపు

image

AP: అన్నమయ్య జిల్లా ప్యారంపల్లిలో <<15457778>>యాసిడ్ దాడికి<<>> గురైన యువతి పరిస్థితి విషమంగా మారింది. దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని బెంగళూరుకు తరలించారు. మరోవైపు నిందితుడు గణేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు.