News November 18, 2024

రైళ్లన్నీ ఫుల్.. సంక్రాంతికి ఊరెళ్లేదెలా?

image

సికింద్రాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో సంక్రాంతి పండక్కి సొంతూర్లకు ఎలా వెళ్లాలని ప్రయాణికులంతా ఆందోళన చెందుతున్నారు. ఏటా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచకపోవడంతో ప్రస్తుతం ఉన్న రైళ్లపైనే తీవ్రంగా ఒత్తిడి ఉంటోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకూ ఫలక్‌నుమా, విశాఖ, గోదావరి, గరీభ్‌రథ్, ఈస్ట్‌కోస్ట్ సహా ఇతర రైళ్లల్లో బెర్తులే లేవు

News November 18, 2024

గ్రీవెన్స్ డేలో ఆధార్ తప్పనిసరి

image

AP: ప్రతి సోమవారం ఎస్పీ ఆఫీసుల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)లో ఫిర్యాదు చేసేవారికి అధికారులు కీలక సూచన చేశారు. తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. ఫిర్యాదు పత్రానికి ఆధార్ ప్రతిని జత చేయాలని, ఇది ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అయితే ఈ నిబంధన కలెక్టర్ కార్యాలయాల్లో వర్తిస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు.

News November 18, 2024

సర్వేలో అప్పులు తప్ప ఆస్తులు చెప్పట్లేదు!

image

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ప్రజలు పూర్తి వివరాలు చెప్పేందుకు భయపడుతున్నారు. కులం, కుటుంబ వివరాలు, అప్పులు, చదువుల వివరాలు మాత్రమే వెల్లడిస్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతర వివరాలు చెప్పేందుకు జంకుతున్నారు. వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయం, రేషన్‌, ఆరోగ్యశ్రీ కార్డులు తొలగిస్తారన్న అనుమానంతో ఈ వివరాలు కరెక్టుగా చెప్పడం లేదు. కొందరైతే ఆధార్ నంబర్లు ఇచ్చేందుకూ ఆలోచిస్తున్నారు.

News November 18, 2024

నేడు హైదరాబాద్‌లో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్

image

నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారత్, మలేషియా జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది 10 మ్యాచుల్లో ఒక్క విజయం సాధించని భారత్ బోణీ కొట్టాలని చూస్తోంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. జియో సినిమా, స్పోర్ట్స్ 18 3 టీవీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 125, మలేషియా 133వ స్థానాల్లో ఉన్నాయి.

News November 18, 2024

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలకు ఆయన వ్యతిరేకం.. అయితే ఆయనే ఇంధన మంత్రి

image

క్లైమెట్ ఛేంజ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్ని వ్యతిరేకించే వ్యక్తిని US ఇంధన మంత్రిగా ట్రంప్ నామినేట్ చేశారు. లిబ‌ర్టీ ఎన‌ర్జీ సంస్థ CEO క్రిస్ రైట్‌కు బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్ట‌నున్నారు. పర్యావరణ రక్షణకు శిలాజేతర ఇంధనాల వైపు ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతుంటే క్రిస్ రైట్ మాత్రం ప్రోత్స‌హిస్తుంటారు.దీంతో USలో శిలాజ ఇంధ‌న వాడకం పెరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News November 18, 2024

11 నెలల్లో గురుకులాల్లో 42 మంది విద్యార్థులు మృతి: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని గురుకులాల్లో 42 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యల కారణంగా మరణించారని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. దీనికి సీఎం రేవంత్, ప్రభుత్వమే బాధ్యత వహించి విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మరణించిన వారి వివరాలను ఆయన పంచుకున్నారు. వరుస మరణాలు నమోదవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదని దుయ్యబట్టారు.

News November 18, 2024

మ‌హారాష్ట్ర‌లో నేటితో ప్ర‌చార ప‌ర్వానికి తెర‌

image

MH అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి సోమ‌వారంతో తెర‌ప‌డ‌నుంది. మొత్తం 288 స్థానాలకు బుధ‌వారం (Nov 20) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్రంలో 9.7 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో 4.93 కోట్ల మంది పురుషులు, 4.6 కోట్ల మంది మ‌హిళలు ఉన్నారు. అధికార మ‌హాయుతి, విప‌క్ష MVA కూట‌ముల్లోని 6 పార్టీల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. MNS, MIM, VBA పార్టీలు ఇతరుల ఓట్ల‌కు గండికొట్టే ఛాన్స్ ఉంది. 23న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

News November 18, 2024

ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

image

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఇవాళ ఉదయం AQI 793గా నమోదైంది. దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఫతేబాద్(895) తర్వాతి స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో నోయిడా(559) ఉంది. కాగా ఇవాళ్టి నుంచి ఢిల్లీలో స్టేజ్-4 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ట్రక్కులను నగరంలోకి అనుమతించరు. మరోవైపు 10, 12వ తరగతులు మినహా మిగతా క్లాసులు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం ఆదేశించింది.

News November 18, 2024

ఆ 60 వేల మందే పునాదిరాయి: మోదీ

image

నైజీరియాలో ఉన్న 60 వేల మంది భార‌తీయులు ఇరు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన బంధాల‌కు పునాదిరాయిగా నిలుస్తున్నార‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. వారి రక్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ందుకు అక్క‌డి ప్ర‌భుత్వానికి మోదీ కృతజ్ఞ‌త‌లు తెలిపారు. నైజీరియాతో స్ట్రాటజిక్ రిలేష‌న్స్‌కు భార‌త్ అధిక ప్రాధాన్యం ఇస్తుంద‌ని పేర్కొన్నారు. భార‌త ప్ర‌ధాని 17 ఏళ్ల త‌రువాత ఆ దేశంలో ప‌ర్య‌టించ‌డం ఇదే మొద‌టిసారి.

News November 18, 2024

ఇవాళ టీటీడీ పాలకమండలి భేటీ

image

తిరుమలలో టీటీడీ పాలకమండలి నేడు సమావేశం కానుంది. అన్నమయ్య భవనంలో ఉ.10.15 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడి అధ్యక్షతన జరిగే సమావేశంలో 70 అంశాలపై చర్చించనున్నారు. సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యం, సనాతన ధర్మపరిరక్షణ సహా మరికొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత నెలకొంది.