News November 17, 2024

‘పుష్ప రూల్ మొదలు’.. యూట్యూబ్ ట్వీట్

image

మరికొన్ని క్షణాల్లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాలతో విడుదలవుతుండటంతో యూట్యూబ్ సైతం అందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘పుష్ప రూల్ బిగిన్స్’ అని యూట్యూబ్ ఇండియా ట్వీట్ చేసింది. గత రికార్డులన్నింటినీ ఈ ట్రైలర్ బ్రేక్ చేస్తుందని, యూట్యూబ్ షేక్ అవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా పట్నాలో జరుగుతోన్న ఈవెంట్‌కు వేలాదిగా ప్రేక్షకులు తరలివచ్చారు.

News November 17, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT

image

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఫిజికల్ టెస్టులకు <>దరఖాస్తు <<>>చేసుకునేందుకు అభ్యర్థులకు ఇచ్చిన అవకాశం నవంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. డిసెంబర్ చివరి వారంలో PMT, PET టెస్టులు నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.

News November 17, 2024

తెలంగాణ రికార్డు సృష్టించింది: ఉత్తమ్

image

వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం రైతులు సాధించిన ఘన విజయమని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజ్‌ల్లో నీటి వినియోగం లేకుండానే దిగుబడి సాధించడం ప్రభుత్వం, అధికారుల పనితీరు, రైతన్నల అంకితభావానికి నిదర్శనమన్నారు. ఉమ్మడి APలోనూ ఇంతటి పంట పండిన సందర్భమే లేదన్నారు.

News November 17, 2024

అప్పట్లో గొరిల్లాతో పోటీకి సిద్ధమైన మైక్ టైసన్

image

అప్పట్లో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధపడ్డారు. 1980ల్లోన్యూయార్క్‌లోని ఓ జూకు అప్పటి తన భార్య రాబిన్ గివెన్స్‌తో కలిసి ఆయన సందర్శనకు వెళ్లారు. ఆ జూలో ఓ గొరిల్లా ఇతర గొరిల్లాలను కొట్టడాన్ని ఆయన చూశారు. దీంతో దాని అంతు చూసేందుకు టైసన్ సిద్ధమై జూ కీపర్‌తో చర్చించారు. 10,000 డాలర్లు ఇస్తా, తనను గొరిల్లాతో ఫైట్‌కు అనుమతించాలని కోరారు. కానీ దీనికి ఆ జూ కీపర్ అంగీకరించలేదు.

News November 17, 2024

‘పుష్ప-2’ ట్రైలర్ మ్యూజిక్ మిక్స్‌పై ఆస్కార్ విన్నర్ ట్వీట్

image

మరికొన్ని గంటల్లో ‘పుష్ప-2’ ట్రైలర్ విడుదలవనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీత, సౌండ్ డిజైనర్ రెసుల్ పూకుట్టి థియేటర్ యజమానులకు ఓ సూచన చేశారు. ‘పుష్ప-2 ట్రైలర్ ఇవాళ విడుదలవనుంది. అంతా చాలా హడావుడిగా ఉంది. స్టాండర్డ్ డాల్బీ లెవల్ 7లో సౌండ్ మిక్స్ చేశామని సినీ ప్రేమికులకు చెప్తున్నా. కాబట్టి యాంప్లిఫయర్లను సరైన సమయంలో ట్యూన్ అప్ చేయాలని థియేటర్లకు సూచిస్తున్నా’ అని పేర్కొన్నారు.

News November 17, 2024

మాజీ సీజేఐ చంద్రచూడ్‌పై ఉద్ధ‌వ్ ఠాక్రే ఫైర్

image

ఇటీవ‌ల సీజేఐగా ప‌ద‌వీ విరమ‌ణ చేసిన జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ శివ‌సేన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో తీర్పు చెప్ప‌క‌పోవ‌డంపై నిరాశ చెందిన‌ట్టు ఉద్ధ‌వ్ ఠాక్రే పేర్కొన్నారు. న్యాయాన్ని వెల్ల‌డించ‌కుండా చంద్ర‌చూడ్ కేవ‌లం కామెంటేట‌ర్‌గా మిగిలిపోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. జ‌డ్జిగా కాకుండా న్యాయ విద్య‌ లెక్చ‌ర‌ర్‌గా చంద్ర‌చూడ్ ప‌ని చేసి వుంటే మ‌రింత పేరు సంపాదించేవార‌ని వ్యంగ్యంగా విమ‌ర్శించారు.

News November 17, 2024

Trending: దేశంలో పుష్ప-2 మేనియా

image

భార‌త్‌లో ఆదివారం ఏం న‌డుస్తోంది అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే, పుష్ప-2 ట్రైల‌ర్ న‌డుస్తోంద‌ని చెప్పే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. Xలో ఇదే ట్రెండింగ్‌లో ఉంది. మ‌హారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నిక‌లు మ‌రో 3 రోజుల్లో జ‌రుగుతున్నా రాజ‌కీయ అంశాల‌ను త‌ల‌ద‌న్ని పుష్ప క్రేజ్ న‌డుస్తోంది. తరువాత నయనతార-ధనుష్ వివాదం, కుంగువపై <<14634886>>జ్యోతిక<<>> స్పందన ట్రెండింగ్‌లో ఉన్నాయి.

News November 17, 2024

లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే మూసీ నిద్ర: కేటీఆర్

image

TG: రేవంత్ రెడ్డికి కమలదళం రక్షణ కవచంగా మారిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే ఈ మూసీ నిద్ర అని దుయ్యబట్టారు. హైడ్రాను మొదట స్వాగతించిన కిషన్ రెడ్డికి ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా? అని Xలో ప్రశ్నించారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనుక మతలబేంటని, ఈ పాలి‘ట్రిక్స్’‌ను తెలంగాణ గమనిస్తోందని రాసుకొచ్చారు.

News November 17, 2024

మహ్మద్ షమీకి తీవ్ర నిరాశ?

image

టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీని ఆస్ట్రేలియా పంపేందుకు BCCI ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది. మరికొన్ని రోజులు ఆయనతో దేశవాళీ క్రికెట్ ఆడించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో వారంలో జరగబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీని ఆడించాలని యోచిస్తున్నట్లు టాక్. కాగా MPతో జరిగిన రంజీ మ్యాచ్‌లో షమీ 7 వికెట్లతో చెలరేగారు. దీంతో ఆయన్ను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పంపుతారని అభిమానులు ఆశించారు.

News November 17, 2024

కొత్త చిత్రంపై ప్రధాని మోదీ ప్రశంసలు

image

2002లో జరిగిన గోద్రా రైలు దుర్ఘటనకు దారితీసిన ప‌రిణామాల క‌థాంశంగా తెర‌కెక్కిన‌ ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని ప్రధాని మోదీ ప్ర‌శంసించారు. ఈ ఘ‌ట‌న చుట్టూ ఏర్ప‌డిన వివాదాన్ని కొట్టిపారేస్తూ చిత్రంలో నిజాల‌ను వెల్ల‌డించిన‌ందుకు అభినందించారు. న‌కిలీ క‌థ‌నాలు త‌క్కువ‌కాలం మాత్ర‌మే మ‌నుగ‌డ సాధించ‌గ‌ల‌వ‌ని వ్యాఖ్యానించారు. సామాన్యులు సైతం చూడదగిన పద్ధతిలో నిజాలు బయటకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.