News November 17, 2024

ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్!.. రెండో కుమారుడే ఖమేనీ వారసుడు

image

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖ‌మేనీ త‌న రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీని వార‌సుడిగా ప్ర‌క‌టించిన‌ట్టు తెలుస్తోంది. 85 ఏళ్ల అయతుల్లా ఆరోగ్యం క్షీణిస్తోంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో వార‌సుడి ఎంపిక‌ ర‌హ‌స్యంగా జ‌రిగిన‌ట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సెప్టెంబర్ 26న జరిగిన సమావేశంలో మొజ్తాబా ఎంపికను అసెంబ్లీ సభ్యులు ఆమోదించారు. అయతుల్లా బ‌తికుండ‌గానే మొజ్తాబాకు బాధ్య‌త‌లు అప్పగించే అవకాశం ఉంది.

News November 17, 2024

కోహ్లీని ఔట్ చేయడానికి ఎదురుచూస్తున్నా: మార్ష్

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తెలిపారు. అతడి వల్ల ఎంత ముప్పు ఉందో తమకు తెలుసని పేర్కొన్నారు. ‘కోహ్లీతో కలిసి IPLలో ఆడాను కాబట్టి మైదానం వెలుపల ఎలా ఉంటారో నాకు తెలుసు. అతడ్ని రెచ్చగొట్టాలని మునుపెన్నడూ యత్నించలేదు. ఈసారి కూడా నా బౌలింగే మాట్లాడుతుంది. విరాట్ 30ల్లో ఉండగానే ఔట్ చేస్తా’ అని స్పష్టం చేశారు.

News November 17, 2024

గహ్లోత్ చుట్టూ ఢిల్లీ రాజకీయం

image

మంత్రి కైలాష్ గహ్లోత్ రాజీనామా ఢిల్లీలో సంచ‌ల‌నంగా మారింది. అవినీతిలేని పాల‌న‌, సామాన్యుల‌కు ప్రాధాన్యం అనే మూల సిద్ధాంతాల్ని ఆప్‌ విస్మ‌రించిందని ఆయన ఆరోపించడం విపక్ష BJPకి అస్త్రమైంది. మున్ముందు మరికొందరు ఆప్ నేతలు పార్టీని వీడే అవకాశం ఉందనే చర్చ ప్రారంభమైంది. గహ్లోత్ రాజీనామా ఆప్ అవినీతి, అబద్ధాల పాలనకు నిదర్శనమని బీజేపీ విమర్శించింది. BJP, ED ఒత్తిడి వల్లే ఆయన రాజీనామా చేశారని ఆప్ చెబుతోంది.

News November 17, 2024

పట్నాకు బయల్దేరిన ‘పుష్ప’రాజ్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ వేడుక జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు స్పెషల్ ఫ్లైట్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్న పట్నాకు బయల్దేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

News November 17, 2024

నటి కస్తూరికి 12 రోజుల రిమాండ్

image

నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పుఝల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిన్న ఆమెను చెన్నై పోలీసులు <<14631162>>హైదరాబాద్‌<<>>లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News November 17, 2024

వారికి ప్రజా సంక్షేమం పట్టదు: సీతక్క

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు.

News November 17, 2024

ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ పరిశోధన!

image

97 ఏళ్లుగా కొనసాగుతూ ప్రపంచంలోనే సుదీర్ఘమైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన పరిశోధన ఇది. ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త థామస్ పార్నెల్ 1927లో ‘పిచ్ డ్రాప్’ అనే పరిశోధన ప్రారంభించారు. తారు నుంచి లభ్యమయ్యే ‘పిచ్’ ద్రవం అత్యంత చిక్కగా ఉంటుంది. దాని చిక్కదనాన్ని కొలిచేందుకు వేడి చేసి గరాటులో పోస్తే 97 ఏళ్లలో 9 చుక్కలే బయటికొచ్చాయి. గరాటు నుంచి మొత్తం పిచ్ ఖాళీ అయ్యేందుకు మరో వందేళ్లు పడుతుందని అంచనా.

News November 17, 2024

డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ఏం చేస్తోంది: ఖ‌ర్గే

image

మ‌ణిపుర్‌లో మ‌ళ్లీ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంపై డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ BJPని కాంగ్రెస్ నిలదీసింది. బీజేపీ పాలనలో ‘మ‌ణిపుర్ ఐక్యంగా లేదు, సుర‌క్షితంగా లేదు’ అని ఖ‌ర్గే విమర్శించారు. 2023 నుంచి జరుగుతున్న హింస ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును నాశనం చేస్తోంద‌న్నారు. ద్వేషపూరిత రాజ‌కీయాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ఉద్దేశంతో మ‌ణిపుర్ త‌గ‌ల‌బ‌డాల‌ని BJP చూస్తోందని ఖర్గే ఆరోపించారు.

News November 17, 2024

ఎక్కువ సేపు కూర్చుంటే త్వరగా ముసలితనం

image

ఎక్కువ సేపు కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనేది అందరికీ తెలిసిందే. వీరిలో అకాల వృద్ధాప్యం, గుండె జబ్బులు, మానసిక సమస్యలు వస్తాయని US సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. దాదాపు 1,000 మందిపై వీరు పరిశోధన చేశారు. పని తర్వాత నామమాత్రపు వాకింగ్ చేస్తే సరిపోదని, తీవ్రత ఉండాలని అంటున్నారు. రోజూ 30min రన్నింగ్/సైక్లింగ్ చేసే వారి వయసు 5-10ఏళ్లు తక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.

News November 17, 2024

ట్రంప్ దిగిపోయేవరకూ మా నౌకలో ఉండండి.. సంస్థ ఆఫర్!

image

అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే దేశం వదిలి వెళ్లిపోతామంటూ USలో చాలామంది ప్రముఖులు ఎన్నికలప్పుడు అన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాకు చెందిన ఫార్చూన్ అనే ఓ క్రూయిజ్ షిప్ సంస్థ దీన్ని వ్యాపారావకాశంగా మలచుకుంది. ట్రంప్ పదవీకాలం ముగిసేవరకూ తమ క్రూయిజ్ షిప్‌లో ప్రపంచమంతా తిరగమని ఆఫర్ ఇచ్చింది. ఏడాదికి 40వేల డాలర్లు చెల్లిస్తే చాలని పేర్కొంది. మరి ఈ ఆఫర్‌ను ఎంతమంది తీసుకుంటారో చూడాలి.