India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తేది: నవంబర్ 15, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:06
✒ సూర్యోదయం: ఉదయం 6:21
✒ దుహర్: మధ్యాహ్నం 12:01
✒ అసర్: సాయంత్రం 4:04
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:40
✒ ఇష: రాత్రి 6.55
>> నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ తేది: నవంబర్ 15, శుక్రవారం
✒ చతుర్దశి: ఉ.06.19 గంటలకు
✒ పౌర్ణమి: రా.02.58 గంటలకు
✒ భరణి: రా.09.54 గంటలకు
✒ వర్జ్యం: ఉ.09.05-10.31 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.08.28-09.13 గంటల వరకు, మ.12.14-01.00 వరకు.
* కాంగ్రెస్ విభజన రాజకీయాల్ని నమ్ముకుంది: మోదీ
* విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి: CM రేవంత్
* తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
* గత ఐదేళ్లలో పైసా పెట్టుబడి రాలేదు: CM చంద్రబాబు
* వైసీపీకి ప్రతిపక్ష హోదా మేము కాదు, ప్రజలివ్వాలి: పవన్
* ఆనాడు సభలో నా తల్లిని అవమానించారు: లోకేశ్
* ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణ రాజు ఎన్నిక
రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజంను తొలగించాలని బంగ్లా AG అసదుజ్జమాన్ ప్రతిపాదించారు. అవామీ లీగ్ ప్రభుత్వం చేసిన 15వ రాజ్యాంగ సవరణ లౌకికవాదాన్ని ప్రాథమిక సూత్రంగా పునరుద్ధరించడం సహా షేక్ ముజీబుర్ రెహ్మాన్ను జాతిపితగా గుర్తిస్తోంది. దీన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. కేసు విచారణ సందర్భంగా 15వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధమని తమ ప్రభుత్వం ప్రకటించాలనుకుంటోందని AG అన్నారు.
8వ వేతన సవరణ సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గంపెడాశలతో ఉన్నారు. జీతాలు, పెన్షన్ల సవరణ కోసం కనీసం 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఉద్యోగులు ఆశాభావంగా ఉన్నట్టు NC-JCM సెక్రటరీ(స్టాఫ్ సైడ్) శివ్ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు. ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం ప్రస్తుతం ఉన్న రూ.18 వేల నుంచి రూ.51,480కి పెరగనుంది. అదే విధంగా పెన్షన్లు కూడా రూ.9 వేల నుంచి రూ.25,740కి పెరుగుతాయని అంచనా.
టీమ్ ఇండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్లో ఆయన మోచేతికి గాయమైనట్లు సమాచారం. వెంటనే ఆయన నొప్పితో మైదానం వీడినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై జట్టు మేనేజ్మెంట్ స్పందించాల్సి ఉంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జట్టు కూర్పుపై కూడా ప్రభావం చూపిస్తుంది.
TG: వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇలా అధికారులపై దాడులకు దిగడం దారుణమని ఆయన మండిపడ్డారు. మరోవైపు KTR అరెస్టు విషయంలో కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తగ్గుతోందని విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ ఈ నెల 17న విడుదల కానుంది. పట్నాలో సాయంత్రం 5 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకన్లు ఉండనుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్లు చేయనుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా మూవీ రిలీజ్ కానుంది.
AP: సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతూనే ఉంటామని YCP నేత ఆర్కే రోజా స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ఆమె నిలదీశారు. ‘రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చేశారు. మహిళలకు రూ.1,500, విద్యార్థులకు రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు, యువతకు రూ.3 వేలు ఎగ్గొట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతాం’ అని ఆమె ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.