News February 3, 2025

లోక్‌సభలో విపక్షాల నిరసనలు

image

కుంభమేళా తొక్కిసలాట ఘటనపై లోక్‌సభలో విపక్షాలు నిరసనలు తెలిపాయి. స్పీకర్ వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్నాయి. కుంభమేళాలో సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆందోళనకు దిగాయి. దీంతో సభ నడవాలని విపక్షాలు కోరుకోవట్లేదని స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 3, 2025

AP: డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ ఎన్నికల అప్‌డేట్స్

image

☛ నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా టీడీపీ మద్దతు అభ్యర్థులు శివ కుమార్ రెడ్డి (9వ వార్డు), పటాన్ నస్రిన్ (8వ వార్డు) ఎన్నిక
☛ పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా.. సమావేశానికి హాజరుకాని వైసీపీ కౌన్సిలర్లు
☛ తిరుపతి డిప్యూటీ మేయర్, నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా.. కోరం లేకపోవడంతో వాయిదా వేసిన అధికారులు

News February 3, 2025

క్రీడలకు కేంద్రం ఎంత కేటాయించిందంటే?

image

2025-26 ఏడాదికి కేంద్రం బడ్జెట్ విడుదల చేయగా అందులో క్రీడా మంత్రిత్వ శాఖకు రూ.3,794.30 కోట్లు కేటాయించింది. దీనితో చైనా బడ్జెట్‌ను పోల్చుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చైనా ప్రభుత్వం రూ.27,741 కోట్లు క్రీడల కోసమే కేటాయించింది. క్రీడాకారులకు సరైన వసతులు కల్పించేలా బడ్జెట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 ఒలింపిక్స్‌లో చైనాకు 91 మెడల్స్ వస్తే, ఇండియాకు 6 మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే.

News February 3, 2025

కంకషన్ వివాదం: క్రిస్ బ్రాడ్ తీవ్ర విమర్శలు

image

భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను సబ్‌స్టిట్యూట్‌గా భారత్ ఆడించడం అన్యాయమని ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ ఆరోపించారు. ‘స్వతంత్రంగా వ్యవహరించే అధికారుల్నే ICC నియమించాలి. మరి ఇప్పుడు ఏమైంది. పక్షపాతం, అవినీతితో కూడిన పాత రోజుల్లోకి ఎందుకెళ్తోంది?’ అని ప్రశ్నించారు. మ్యాచ్ రిఫరీగా ఇరు దేశాలకు చెందని అధికారి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

News February 3, 2025

తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గి రూ.84,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 తగ్గి రూ.77,050గా నమోదైంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

News February 3, 2025

షాకింగ్: క్రికెటర్ల కిట్స్‌ను బస్సులో ఉంచి తాళమేసిన డ్రైవర్!

image

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో దర్బార్ రాజ్‌షాహీ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు, సిబ్బందికి డబ్బులు బకాయి పడింది. టీమ్ బస్ డ్రైవర్‌కైతే మొత్తం టోర్నమెంట్‌కు చెల్లించాల్సి ఉంది. ఎన్నిసార్లు అడిగినా యాజమాన్యం స్పందించకపోవడంతో అతడు ఆటగాళ్ల క్రికెట్ కిట్‌లను బస్సులోనే ఉంచి తాళమేశాడు. డబ్బులిచ్చాకే తాళం తీస్తానని తేల్చిచెప్పాడు. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

News February 3, 2025

ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు

image

AP: నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా TDP అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. ఆమెకు 41 ఓట్లు, YCP అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు పడ్డాయి. ఏలూరు డిప్యూటీ మేయర్లుగా TDP అభ్యర్థులు దుర్గాభవానీ, ఉమా మహేశ్వరరావు ఎన్నికయ్యారు. రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో వారు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు తిరుపతిలో YCP కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేశారంటూ MP గురుమూర్తి, MLC సుబ్రహ్మణ్యం నిరసనకు దిగారు.

News February 3, 2025

67వ గ్రామీ అవార్డ్స్-2025 విజేతలు వీరే

image

ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్- కౌబాయ్ కార్టర్(బియాన్స్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్ – ‘నాట్ లైక్ అస్’ (కేండ్రిక్ లామర్)
బెస్ట్ కంట్రీ ఆల్బమ్- ‘కౌ బాయ్ కార్టర్ (బియాన్స్)
బెస్ట్ అమెరికానా పర్ఫార్మెన్స్ – ‘అమెరికన్ డ్రీమింగ్’ (సియెర్రా ఫెర్రెల్)
బెస్ట్ మెలోడిక్ రాప్ పర్ఫార్మెన్స్ – ‘3’ (రాప్సొడీ ఫీచరింగ్ ఎరికా బాడు)
బెస్ట్ రాక్ ఆల్బమ్ – హాక్నీ డైమండ్స్ (ది రోలింగ్ స్టోన్స్)

News February 3, 2025

సుప్రీంకోర్టులో KTR పిటిషన్.. 10న విచారణ

image

TG: పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సుప్రీంను ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్‌ను గతంలో దాఖలైన పిటిషన్‌కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాత దానితో కలిపి విచారిస్తామని వెల్లడించింది.

News February 3, 2025

రోహిత్‌తో విభేదాల వార్తలు.. క్లారిటీ ఇచ్చిన గంభీర్

image

BGT సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు, కోచ్ గంభీర్‌కు మధ్య మనస్పర్థలొచ్చాయంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఆ వార్తలపై తాజాగా గంభీర్ స్పష్టతనిచ్చారు. ‘జట్టు ప్రదర్శన సరిగ్గా లేనప్పుడు చాలా వార్తలు గుప్పుమంటుంటాయి. పుకార్లు షికారు చేస్తుంటాయి. మ్యాచులు గెలుస్తుంటే అవే సమసిపోతాయి. జట్టులోని ఆటగాళ్లందరూ ఎన్నో మ్యాచులు ఆడారు. పరిణతి కలిగినవారు. విభేదాలేం లేవు. అందరూ కలిసే ఉన్నారు’ అని పేర్కొన్నారు.