News November 12, 2024

షారుఖ్‌కు బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్

image

స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ <<14551902>>బెదిరింపు<<>> కాల్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌కు చెందిన ఫైజల్ ఖాన్ ఇటీవల రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశాడు. దబ్బులివ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తానన్నాడు. దీంతో అతనిపై FIR నమోదైంది. అయితే తన మొబైల్ పోయిందని, అందులో నుంచి ఎవరో కాల్ చేశారని ఫైజల్ చెబుతున్నాడు.

News November 12, 2024

BGTకి ప్రాధాన్యం.. పాక్ కోచ్ అసహనం

image

ఆస్ట్రేలియాలో పాక్ ఇటీవల వన్డే సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అక్కడి మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. దీనిపై ఆ జట్టు కోచ్ జాసన్ గిలెస్పీ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇండియాతో ఆడే BGTపై పెట్టిన దృష్టిని మా వన్డే సిరీస్‌పై ఆస్ట్రేలియా మీడియా పెట్టలేదు. పాక్‌తో వన్డేలకు కనీస ప్రమోషన్స్ చేయాలి కదా? క్రికెట్ ఆస్ట్రేలియాకు భారతే ముఖ్యం అన్నది తేటతెల్లమైంది’ అని పేర్కొన్నారు.

News November 12, 2024

RGVపై మరో ఫిర్యాదు

image

డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. గేదెల ముఖాలకు వీరి ఫొటోలను పెట్టి అవమానించారని పేర్కొన్నారు. ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై <<14581839>>కేసు నమోదైన<<>> విషయం తెలిసిందే.

News November 12, 2024

STOCK MARKETS: రియాల్టి షేర్ల జోరు

image

దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. క్షణాల్లోనే పెరుగుతూ తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, CPI డేటా రావాల్సి ఉండటమే ఇందుకు కారణాలు. సూచీల గమనం తెలియకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 79,582 (+86), నిఫ్టీ 24,166 (+25) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి, ఐటీ, మీడియా, హెల్త్‌కేర్ షేర్లు పెరిగాయి. ఆటో, FMCG సూచీలు తగ్గాయి.

News November 12, 2024

చినాబ్ రైల్వే బ్రిడ్జిపై మాక్ డ్రిల్

image

J&Kలోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ఇవాళ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అప్రమత్తం కావాలనేది చేసి చూపించాయి. SOG, CRPF 126bn, GRP, RPF, SDRF, ఫైర్&ఎమ‌ర్జెన్సీ, మెడిక‌ల్ బృందాలు డ్రిల్‌లో పాల్గొన్నాయి. నదీ గర్భం నుంచి 359M ఎత్తులో 1,315M పొడవుతో దీన్ని నిర్మించారు. దీనిపై 4 నెలల కిందట రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

News November 12, 2024

వర్మతో వర్మ అండ్ వర్మ.. ఫొటో వైరల్

image

డైరెక్టర్ రాంగోపాల్ వర్మను యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ‘ఫ్యామిలీ మ్యాన్’ రైటర్ సుపర్న్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న ఫొటోను రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వర్మతో వర్మ అండ్ వర్మ అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే, తమకు క్యాస్ట్ ఫీలింగ్ లేదనే విషయంపై తాను ప్రమాణం చేయలేనని చమత్కరించారు. ఈ ముగ్గురూ నిన్న రాత్రి ఓ పార్టీలో కలిసినట్లు తెలుస్తోంది.

News November 12, 2024

GOOD NEWS: ఫ్రీ కోచింగ్, నెలకు రూ.2,500

image

AP: బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,200 మందికి కోచింగ్ ఇస్తామని, BCలకు 66%, SCలకు 20%, STలకు 14% చొప్పున సీట్లు కేటాయించామన్నారు. వారితో పాటు EWS అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామని చెప్పారు. 2 నెలల పాటు ఇవ్వనున్న ఈ కోచింగ్ టైంలో నెలకు రూ.1500 స్టైఫండ్, మెటీరియల్ కోసం రూ.1000 ఇస్తామని తెలిపారు.

News November 12, 2024

రైతులేమైనా తీవ్రవాదులా?: కేటీఆర్

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్ల వివాదంలో పలువురిని పోలీసులు <<14588376>>అరెస్టు చేయడాన్ని<<>> కేటీఆర్ ఖండించారు. ‘అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా? వాళ్లేమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా? ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం?’ అని Xలో ఫైరయ్యారు.

News November 12, 2024

ఏపీలో రిలయన్స్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు: ET

image

ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ పేర్కొంది. 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని తెలిపింది. ఇటీవల నారా లోకేశ్ ముంబై పర్యటనలో అనంత్ అంబానీతో ఈ డీల్ ఫైనల్ అయిందని పేర్కొంది. దీనివల్ల రాబోయే ఐదేళ్లలో 2.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు వివరించింది.

News November 12, 2024

దేశంలోని మొత్తం మ్యూచువల్ ఫండ్ల విలువ తెలిస్తే షాకవుతారు!

image

ఇండియా గ్రోత్ స్టోరీ, స్టాక్ మార్కెట్లపై దేశీయ ఇన్వెస్టర్ల నమ్మకం మరింత బలపడింది. మార్కెట్ సెంటిమెంటును పట్టించుకోకుండా దీర్ఘకాల దృక్పథంతో మెచ్యూరిటీతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడే ఇందుకో ఉదాహరణ. ప్రస్తుతం MF AUM ఆల్‌టైమ్ హై రూ.67.26 లక్షల కోట్లకు చేరడం విశేషం. రిటైల్ ఫోలియోస్ 17.23 కోట్లు, SIP అకౌంట్లు 10 కోట్లు దాటేశాయి. మంత్లీ సిప్ ఇన్‌ఫ్లో రూ.25వేల కోట్లంటే మాటలు కాదు.