India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
PAKలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో పాక్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్తో సమస్య పరిష్కారమయ్యే వరకు ICC లేదా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్లు ఆడకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పాక్ క్రికెట్ బోర్డుకు ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినట్లు పాక్ పత్రిక ది డాన్ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం అనుమానమేనని పేర్కొంది.
మనలో చాలామంది ఎవరి మీదనో ఉన్న కోపాన్ని మరొకరిపై చూపిస్తుంటాం. దీన్నే డిస్ప్లేస్డ్ యాంగర్ లేదా మిస్ప్లేస్డ్ యాంగర్ అని అంటుంటారు. దీనికి ప్రతిసారి మనుషులే కాదు కొన్నిసార్లు వస్తువులు కూడా బలవుతుంటాయి. ఈ సమస్య ఉంటే ఆఫీస్లో బాస్ పెట్టిన ఒత్తిడి వల్ల ఇంటికి వచ్చి భార్య, పిల్లలపై అరుస్తుంటారు. దీని వల్ల రిలేషన్షిప్ దెబ్బతినడంతో పాటు మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని <
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో తొలిసారి ఓ రాజకీయ నేత చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చారు. ప్రధాన నిందితుల వేటలో ఉన్న పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. వీరితో ఫోన్ సంభాషణలు జరిపిన నాయకులను విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అరెస్టయిన అడిషనల్ SP తిరుపతన్నతో చిరుమర్తి గతంలో మాట్లాడినట్లు గుర్తించి, నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
AP అప్పులపై గందరగోళం నెలకొంది. YCP హయాంలో రుణాలు ₹14 లక్షల కోట్లకు పెరిగాయని ఎన్నికల్లో, ఆ తర్వాత కూటమి నేతలు ఆరోపించారు. అయితే 2023-24 ఆర్థిక ఏడాది పూర్తయ్యేనాటికి AP అప్పు ₹6.46లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నారు. ఇందులో బడ్జెట్ అప్పులు ₹4.91లక్షల కోట్లు, ప్రభుత్వ గ్యారంటీ అప్పులు ₹1.54లక్షల కోట్లు అని చెప్పారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
TG: జనవరి నుంచి రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు. అందులో 36లక్షల టన్నులు పీడీఎస్కు వచ్చినా సరిపోతుందన్నారు. నెలకు 2 లక్షల టన్నుల చొప్పున పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.
రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల్ని వెల్లడించడం గోప్యత ఉల్లంఘన కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. పుణే కోర్టులో ఉద్యోగానికి పరీక్షలు రాసిన ఓంకార్ అనే వ్యక్తి ఇంటర్వ్యూకు ఎంపిక కాకపోవడంతో అభ్యర్థులందరి మార్కుల వివరాల కోసం RTI దరఖాస్తు చేశారు. అది గోప్యత ఉల్లంఘన అవుతుందంటూ అతడి దరఖాస్తును RTI కమిషనర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఓంకార్ హైకోర్టును ఆశ్రయించగా బెంచ్ తాజా తీర్పునిచ్చింది.
వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ ఈనెల 14న రిలీజ్ కానుండగా మరో సినిమాకు ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ఓ హారర్ కామెడీ సినిమాలో వరుణ్ నటిస్తారని సమాచారం. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంగా సాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని మూవీ వర్గాలు వెల్లడించాయి.
TG: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే జాబితాలో తమ కులం పేరు లేదని కామారెడ్డి(D) పెద్దకొడప్గల్ మండలంలో మధుర లంబాడా కుటుంబాలు సర్వేను బహిష్కరించాయి. జాబితాలో 240 కులాలుంటే తమ కులం పేరును మధుర అని పేర్కొన్నారని వారు అంటున్నారు. తాము సర్వేలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు. దీంతో దాదాపు 2వేల కుటుంబాలకు సంబంధించిన సర్వే నిలిచిపోయింది.
ఏపీ ప్రభుత్వం రూ.2.94లక్షల కోట్లతో నిన్న బడ్జెట్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో 4నెలల కాలానికి వైసీపీ ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ తీసుకొచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే మరోసారి 4నెలలకు, తాజాగా సోమవారం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీంతో ఒకే ఏడాది 3సార్లు బడ్జెట్ ప్రకటించినట్లు అయింది. బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభం కాగా, ఇవాళ సెలవు ఇచ్చారు. తిరిగి రేపు ప్రారంభం కానున్నాయి.
Sorry, no posts matched your criteria.