News January 31, 2025

ప్రెసిడెంట్‌పై కామెంట్స్ ఆమోదయోగ్యం కాదు: రాష్ట్రపతి భవన్

image

ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము బడ్జెట్ ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన <<15319555>>కామెంట్స్<<>> ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘నిజాన్ని ఎవరూ దాచలేరు. ప్రసంగంలో ప్రెసిడెంట్ అలసిపోయినట్లు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదు. అణగారిన వర్గాలు, రైతులు, మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఆమెకు అలసట రాదు. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం’ అని పేర్కొంది.

News January 31, 2025

కాశీలో ‘గంగా హారతి’ నిలిపివేత

image

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులు అట్నుంచి కాశీ విశ్వనాథ ఆలయాన్నీ కవర్ చేస్తున్నారు. దీంతో వారణాసిలో రద్దీ నెలకొనగా ప్రతి రోజు సాయంత్రం ఘాట్ల వద్ద నిర్వహించే ‘గంగా హారతి’ని నిలిపేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్లు, భక్తులు ఆయా ఘాట్ల వద్దకు రావొద్దన్నారు. రద్దీ నేపథ్యంలో కాశీ ప్రజలు అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.

News January 31, 2025

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా: సీఎం

image

AP: పెనుగొండ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అమ్మవారికి ఆత్మార్పణ సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం గురుపీఠం నిర్మాణానికి CM శంకుస్థాపన చేశారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, అమ్మవారిని వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని సీఎం చెప్పారు. ఆ తర్వాత సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

News January 31, 2025

రాష్ట్ర ఆదాయం పడిపోయింది: KCR

image

తెలంగాణ ఆదాయం భారీగా పడిపోయిందని మాజీ CM KCR సంచలన ఆరోపణలు చేశారు. ₹13వేల కోట్ల ఆదాయం తగ్గిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. రానురాను పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయని, మరో 4 నెలలైతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. మాట్లాడితే తనను ఉద్దేశించి ఫామ్‌హౌస్ అంటుండటంపై స్పందించిన KCR.. ‘ఇక్కడ అల్లం, ఉల్లిపాయ తప్ప ఏమున్నాయి? వాళ్లు వస్తే పార ఇచ్చి తవ్వుకోమందాం’ అని ఎద్దేవా చేశారు.

News January 31, 2025

అప్పటి లోపు టీచర్ల బదిలీ పూర్తి: మంత్రి లోకేశ్

image

AP: మార్చిలో ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా టీచర్ల బదిలీ పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. ‘ఉమ్మడి AP, నవ్యాంధ్రలో 80% టీచర్ల నియామకం చేసింది మేమే. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వ నిర్ణయాల్లో టీచర్ల అభిప్రాయాలుంటాయి. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం వారి సమస్యలు వింటున్నారు. బదిలీల్లో పారదర్శకత కోసం ట్రాన్స్‌ఫర్ యాక్ట్ తెస్తున్నాం’ అని చెప్పారు.

News January 31, 2025

ఓటీటీలోకి సూపర్‌హిట్ మూవీ

image

మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా OTT స్ట్రీమింగ్ ఖరారైంది. ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని సోనీ లివ్ వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 20న విడుదలై రూ.100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

News January 31, 2025

కాంగ్రెస్ ట్విటర్‌ పోల్‌పై కేసీఆర్ రియాక్షన్

image

TG: ట్విటర్‌లో టీకాంగ్రెస్ నిర్వహించిన <<15307146>>పోలింగ్‌పై<<>> కేసీఆర్ స్పందించారు. ‘వాళ్ల పార్టీవాడే సోషల్ మీడియాలో పోలింగ్ పెట్టాడు. అందులో 70శాతం మనకు వచ్చింది, 30శాతం వాళ్లకు వచ్చింది. వాడు పెట్టిందే అది మనం పెట్టింది కాదు’ అని సెటైర్లు వేశారు. కాగా ‘రాష్ట్రంలో ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? 1.ఫామ్‌హౌస్ పాలన 2.ప్రజల వద్దకు పాలన’ అంటూ నిన్న INC ట్విటర్‌లో పోల్ పెట్టింది.

News January 31, 2025

ఈ కారు హెడ్‌లైట్స్‌ ఖరీదు రూ.1.4 కోట్లు!

image

లగ్జరీ కార్ల కంపెనీ అయిన బుగాటీ ఇటీవలే ‘చిరోన్’ మోడల్‌ను తీసుకొచ్చింది. లిమిటెడ్ ఎడిషన్‌గా కేవలం 500 కార్లను మాత్రమే రూపొందించింది. ఈ కారుకు క్వాడ్ సెటప్ లాంటి విలక్షణమైన హెడ్‌లైట్‌లను అమర్చడంతో ఇది మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంటుంది. అయితే, చిరోన్ పూర్ స్పోర్ట్ హెడ్‌లైట్స్ ఖరీదు ఏకంగా $164,000 (రూ.1.4 కోట్లు) అని తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ ధరతో పోర్షే 911 కారెరా GTS ($164,900) కొనొచ్చు.

News January 31, 2025

Stock Market: బడ్జెట్‌కి ముందు బుల్ రంకెలు

image

బ‌డ్జెట్‌పై ఇన్వెస్ట‌ర్లు గంపెడాశ‌ల‌తో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా లాభాల్లో ప‌య‌నించాయి. బ‌డ్జెట్‌లో మ‌ధ్య త‌ర‌గ‌తి, ట్యాక్స్ పేయర్స్‌కి ఊర‌ట క‌లిగించే అంశాలు ఉంటాయ‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో సూచీలు ప‌రుగులు పెట్టాయి. Sensex 740 PTS లాభంతో 77,500 వద్ద, Nifty 259 PTS ఎగసి 23,508 వద్ద స్థిరపడ్డాయి. FMCG, రియల్టీ, IT, బ్యాంకు, ఫార్మా, మెటల్, ఆటో, ఫైనాన్స్ రంగాలు రాణించాయి.

News January 31, 2025

సచిన్‌కు బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

image

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో రేపు జరిగే వార్షిక కార్యక్రమంలో సచిన్‌కు ఆ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. భారత్ తరఫున ఆయన 664 మ్యాచులాడారు. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టెస్టు, వన్డే పరుగులు చేశారు. మాజీ ఆటగాళ్లు రవి శాస్త్రి, ఫరూఖ్ ఇంజినీర్‌కు 2023లో ఈ పురస్కారం లభించింది.