India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సీఎం చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సంబేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సంబేపల్లి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేయనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ సినిమా టైటిల్ లాక్ అయిందని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. త్వరలో దీనిని వెల్లడిస్తామని ఆయన పేర్కొనడంతో టైటిల్పై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఈ సినిమాకు ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఆదివాసీలకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని BJP ప్రెసిడెంట్ జేపీ నడ్డా డిమాండ్ చేశారు. ఆమెను పూర్ థింగ్, బేచారీ అంటూ సంబోధించడాన్ని ఖండించారు. ఇలాంటి పదాలను వాడటం కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ, పేదల వ్యతిరేక, ఉన్నతవర్గ అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. ‘రాష్ట్రపతి ముర్ము బలమైన మహిళ. దేశానికి ఆమె ఎంతో సేవచేశారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి’ అని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.

అండర్-19 W T20 వరల్డ్ కప్ ఫైనల్కు భారత్ దూసుకెళ్లింది. సెమీస్లో ఇంగ్లండ్ను 9 వికెట్లతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ENG 20 ఓవర్లలో 113 రన్స్ చేసింది. ఛేజింగ్లో భారత ఓపెనర్ కమలిని హాఫ్ సెంచరీతో చెలరేగారు. 50 బంతుల్లో 56 రన్స్తో నాటౌట్గా నిలిచారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష 35, సానిక 11*తో రాణించారు. దీంతో IND 15 ఓవర్లలో టార్గెట్ను ఛేదించి ఎల్లుండి సౌతాఫ్రికాతో తుది పోరుకు సిద్ధమైంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపు కోసం ఏర్పాటైన 8వ వేతన సవరణ సంఘం 2025 చివరికల్లా నివేదిక సమర్పించనుంది. అయితే కొన్ని ఊహాగానాల మేరకు ఉద్యోగుల వేతనాలు ప్రచారంలో ఉన్నట్టు 186% మేర కాకుండా 10 నుంచి 30% మాత్రమే పెరిగే అవకాశం ఉందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగులు ఆశిస్తున్న 2.86% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అసాధ్యమని మాజీ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గర్గ్ పేర్కొన్నారు.

వచ్చే నెల 4న రథ సప్తమి సందర్భంగా TTD కీలక నిర్ణయాల్ని తీసుకుంది. అవి..
☞ ఆరోజు సిఫారసు లేఖల దర్శనాలు రద్దు. ఆర్జిత సేవల ఏకాంత నిర్వహణ.
☞ సర్వదర్శనం టోకెన్ల రద్దు. భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల ద్వారా అనుమతి.
☞ మాడవీధుల్లో వాహనసేవల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు.
☞ మాడవీధుల్లో భక్తులకు రక్షణకు ప్రత్యేక షెడ్లు.
☞ ఆరోజు 8 లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులోకి. 

Tకాంగ్రెస్లో SC ‘వర్గీకరణ’ చిచ్చు రేగింది. ఈ అంశానికి వ్యతిరేకంగా MLA వివేక్ మాలల సభ నిర్వహించారని సంపత్ మండిపడ్డారు. వర్గీకరణకు INC మద్దతు ఉంటుందని PCC చీఫ్గా రేవంత్ గతంలో ప్రకటించారని గుర్తుచేశారు. వివేక్పై PCCకి ఫిర్యాదు చేశామన్నారు. అటు ఒక్క సభ పెట్టుకుంటే గాయిగాయి చేస్తున్నారని సంపత్పై వివేక్ ఫైర్ అయ్యారు. తాను తప్పు చేశానని భావిస్తే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.

FY26లో భారత GDP వృద్ధిరేటు 6.3-6.8 శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. రాబోయే ఏడాదిలో వృద్ధి దూకుడుగా ఉండదని సంకేతాలు ఇచ్చింది. IMF అంచనాకు దగ్గరగానే ఇచ్చింది. దేశీయ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని, విదేశీ ఖాతా పటిష్ఠంగా ఉందని వెల్లడించింది. ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని, త్వరలోనే RBI టార్గెట్ అయిన 4 శాతానికి దిగొస్తుందని పేర్కొంది. ఇందుకు సరైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది.

డయాబెటిస్ రోగుల్లో 40% పైగా సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నారని స్టడీస్ చెబుతున్నాయి. ఆహారంపై పరిమితులు, తిన్నది ఒంటికి పట్టకపోవడం, యూరిన్ ద్వారా విటమిన్లు, మినరల్స్ వెళ్లిపోవడం, పోషకాల జీవక్రియలపై రోగ ప్రభావమే ఇందుకు కారణాలు. వీరిలో ఎక్కువగా విటమిన్ D, B12, మెగ్నీషియం, ఐరన్, జింక్ లోపం కనిపిస్తున్నాయి. డాక్టర్ల సూచన మేరకు క్వాలిటీ ఫుడ్, సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదని స్టడీస్ సూచిస్తున్నాయి.

దగ్గు నుంచి ఉపశమనం కలిగించే సిరప్లపై అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కీలక ప్రకటన చేసింది. ఫినైలెఫ్రిన్ అనే పదార్థం ఉన్న దగ్గు సిరప్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేసింది. 2023లోనే దీనిపై జరిగిన క్లినికల్ ట్రయల్స్లో గుర్తించినప్పటికీ అమెరికాలోనే రూ.14,000 కోట్ల విలువైన ఈ మందులు అమ్ముడవుతున్నాయి. ఇండియాలోనూ చాలా దగ్గు సిరప్లలో ఫినైలెఫ్రిన్ ఉందని వైద్యులు చెబుతున్నారు. SHARE IT
Sorry, no posts matched your criteria.