News January 31, 2025

చైనా డీప్‌సీక్ ఎఫెక్ట్.. ఓపెన్ AI భారీ ఫండ్ రైజింగ్

image

AI మార్కెట్‌లో చైనా ‘డీప్‌సీక్’ ప్రకంపనాలు సృష్టిస్తుండటంతో చాట్‌జీపీటీ మేకర్ ఓపెన్ఏఐ అప్రమత్తమైంది. అత్యాధునిక AI మోడల్స్ అభివృద్ధి కోసం $40 బిలియన్ల సేకరించనుంది. జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ అత్యధికంగా $15-25 బిలియన్లు ఇన్వెస్ట్ చేయనుంది. US అధ్యక్షుడు ట్రంప్ $500 బిలియన్ల పెట్టుబడి అంచనాతో ప్రకటించిన స్టార్‌గేట్ ఏఐ ప్రాజెక్టులోనూ సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ఏఐ భాగస్వాములుగా ఉన్నాయి.

News January 31, 2025

దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్

image

TG: ఉన్నత విద్యలో సీట్ల భర్తీలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్, 5% రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది. అంధత్వం, చెవుడు, మానసిక వైకల్యం, బధిరులు, మరుగుజ్జులు, యాసిడ్ బాధితులు, ఆటిజం, కండరాలు సరిగా పని చేయని వారిని 5 కేటగిరీలుగా విభజించనుంది. ఒక్కో కేటగిరీకి 1% రిజర్వేషన్ అమలు చేయనుంది.

News January 31, 2025

బంగాళాఖాతంలో ద్రోణి.. రేపు వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి విస్తరించినట్లు IMD వెల్లడించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తమిళనాడు, కోస్తా మీదుగా తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించడంతో పగటిపూట వాతావరణం చల్లగా మారినట్లు పేర్కొంది. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

News January 31, 2025

క్రికెట్‌కు అఫ్గాన్ ప్లేయర్ గుడ్ బై

image

అఫ్గానిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ షాపూర్ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా అఫ్గాన్ తరఫున జద్రాన్ 44 వన్డేలు ఆడి 43 వికెట్లు, 36 టీ20లు ఆడి 37 వికెట్లు పడగొట్టారు. 2009లో నెదర్లాండ్స్‌పై తన అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. 37 ఏళ్ల జద్రాన్ 2020లో ఐర్లాండ్‌పై తన చివరి మ్యాచ్ ఆడేశారు.

News January 31, 2025

అకౌంట్లలోకి రూ.2 వేలు.. నేడే లాస్ట్

image

వచ్చే నెలలో పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పథకానికి రిజిస్టర్ కాని వారు రిజిస్టర్ చేసుకోవడానికి, లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేయడానికి ఇవాళే చివరి తేది. pmkisan.gov.in సైట్‌లో సులభంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. సైట్ ఓపెన్ చేశాక కుడి వైపున ఉండే e-KYCపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు upfr.agristack.gov సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News January 31, 2025

IND vs ENG: సిరీస్ చేజిక్కించుకుంటారా?

image

భారత్-ఇంగ్లండ్ మధ్య ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇవాళ గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌కు అన్ని విధాలా సిద్ధమైనట్లు కెప్టెన్ సూర్య తెలిపారు. ప్రస్తుతం మన జట్టు అన్ని విభాగాల్లో పటిష్ఠంగానే కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా గత మ్యాచులో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

News January 31, 2025

కర్నూలులో హైకోర్టు బెంచ్ దిశగా అడుగులు

image

AP: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అక్కడ 15మంది న్యాయమూర్తులకు తగిన సౌకర్యాల వివరాలను తమకు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ తాజాగా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల పరిశీలన పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. YCP హయాంలో కర్నూలు శివారు దిన్నెదేవరపాడులో నిర్మించిన APERC భవనాన్ని వాడుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

News January 31, 2025

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. కారణాలు ఇవేనా?

image

ఇటీవల వరుస <<15307610>>విమాన ప్రమాదాలు<<>> ప్రయాణికులను వణికిస్తున్నాయి. ఈ ప్రమాదాలకు 5 కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 50 శాతం విమాన ప్రమాదాలకు పైలట్లే కారణమని అంటున్నారు. 20 శాతం సాంకేతిక సమస్యలు, 15 శాతం తుఫాన్లు, పిడుగులు, ప్రతికూల వాతావరణం, 5 శాతం టెర్రరిజం, మిస్సైల్ దాడులు, 10 శాతం ప్రమాదాలకు ఇతర కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

News January 31, 2025

మేలో ‘స్పిరిట్’ ప్రారంభం?

image

సందీప్ రెడ్డి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందనున్న ‘స్పిరిట్’ ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్‌ను మేలో ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో ప్రభాస్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ పాత్ర కోసం మృణాల్, ఆలియా, రష్మిక పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్. ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని మూవీ వర్గాలు తెలిపాయి.

News January 31, 2025

జయలలిత ఆస్తి రూ.4వేల కోట్లు.. అంతా TN ప్రభుత్వానికే

image

దివంగత సీఎం జయలలిత ఆస్తిని ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశించింది. దీంతో కర్ణాటక పరిధిలో ఉన్న 1,562 ఎకరాల భూమి, 27 కేజీల బంగారం, 10వేల చీరలు, 750 జతల చెప్పులు, వాచ్‌లను అధికారులు అప్పగించనున్నారు. పదేళ్ల కిందట ఈ ఆస్తుల విలువ రూ.913 కోట్లు కాగా, ఇప్పటి మార్కెట్ విలువ రూ.4వేల కోట్లపైనే అని అంచనా.