News November 11, 2024

ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.43,402కోట్లు

image

మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో రూ.43,402కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక అని, 62శాతం జనాభా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, తమ ప్రభుత్వం పెట్టుబడి సాయం పెంచిందని వివరించారు. వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. విత్తనాలు, సూక్ష్మ పోషకాలను రాయితీపై అందిస్తామని పేర్కొన్నారు.

News November 11, 2024

అమ్మ అవ్వాలని ఉంది: సమంత

image

‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌లో తాను పోషించిన తల్లి పాత్ర గురించి మాట్లాడుతూ సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి. అమ్మగా ఉండటానికి ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా’ అని పేర్కొన్నారు. తాజా సిరీస్‌లో కూతురుగా నటించిన కశ్వీ మజ్ముందర్ తెలివైన అమ్మాయని, అద్భుతంగా హావభావాలు పలికించిందని కొనియాడారు.

News November 11, 2024

క్వాలిటీ లేని ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్న నెస్లే, పెప్సీ: REPORT

image

నెస్లే, పెప్సీ, యూనిలివర్ సహా MNC ఫుడ్ కంపెనీలు భారత్ వంటి తక్కువ ఆదాయ దేశాల్లో నాణ్యత లేని ప్రొడక్టులు అమ్ముతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. హెల్త్ రేటింగ్ సిస్టమ్‌లో వీటికి తక్కువ స్కోర్లు వచ్చినట్టు ATNI తెలిపింది. ఇందులో 3.5 కన్నా ఎక్కువ రేటింగ్ వచ్చే ఫుడ్ ప్రొడక్టులను హెల్దీగా పరిగణిస్తారు. రిచ్ కంట్రీస్‌లో ఈ సగటు స్కోరు 3.5 ఉండగా పూర్ కంట్రీస్‌లో 1.8గా ఉంది. 70% జనాభా పేద దేశాల్లోనే ఉంది.

News November 11, 2024

బైడెన్.. కమలను 30 రోజులైనా ప్రెసిడెంట్‌గా నియమించండి: జమల్ సిమ్మన్స్

image

జో బైడెన్ వెంటనే రిజైన్ చేసి కమలా హారిస్‌ను ప్రెసిడెంట్‌గా నియమించాలని ఆమె మాజీ కమ్యూనికేషన్ డైరెక్టర్ జమల్ సిమ్మన్స్ అన్నారు. మార్పుకు నాంది పలికి USకు తొలి మహిళా అధ్యక్షురాలిని చేయాలని కోరారు. ‘జో బైడెన్ అద్భుతమైన ప్రెసిడెంట్. చాలా హామీలు నెరవేర్చారు. ఆయన మరో హామీ నెరవేర్చాలి. కమలను కనీసం 30 రోజులైనా ప్రెసిడెంట్‌గా నియమించాలి. అప్పుడే మరో మహిళ అధ్యక్ష పదవికి పోటీచేయడం సులభమవుతుంది’ అని అన్నారు.

News November 11, 2024

ఈ సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం: పయ్యావుల

image

AP: ప్రతి పొలానికి సాగు నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జల విధానాన్ని రూపొందిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమన్నారు.. చింతలపూడి, వంశధార రెండో దశ, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, టీబీపీ-హెచ్ఎసీ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు. గోదావరి-పెన్నా, నాగావళి-వంశధార నదులను అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.

News November 11, 2024

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. విద్యార్థుల ఇబ్బందులు

image

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు కట్టాలని, లేదంటే పరీక్షలు రాయనీయమని హెచ్చరిస్తున్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలు రూ.3వేల కోట్లతో పాటు 2024-25 బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని దశలవారీగా చెల్లిస్తామని తాజాగా మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రకటించారు.

News November 11, 2024

భారత జట్టుతో పాంటింగ్‌కు ఏం పని?: గంభీర్

image

రోహిత్, కోహ్లీ ప్రదర్శన తగ్గిందనే రికీ పాంటింగ్ <<14572527>>వ్యాఖ్యలకు<<>> భారత జట్టు కోచ్ గంభీర్ కౌంటర్ ఇచ్చారు. ఆయనకు భారత జట్టుతో ఏం పని? ఆస్ట్రేలియా జట్టు గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు. రోహిత్, కోహ్లీ ఆటతీరుపై తమకు ఎలాంటి ఆందోళనలు లేవని చెప్పారు. వారిప్పటికే చాలా సాధించారని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత సిరీస్ ఓటమితో వారిలో ఇంకా కసి పెరిగిందని తెలిపారు.

News November 11, 2024

ఏపీ బడ్జెట్: శాఖల వారీగా కేటాయింపులు

image

✒ పోలీస్ శాఖ: రూ.8,495 కోట్లు
✒ పర్యావరణం అటవీశాఖ: రూ.687 కోట్లు
✒ నైపుణ్యాభివృద్ధి శాఖ: రూ.1,215 కోట్లు
✒ ఎస్సీ సంక్షేమం: రూ.18,487 కోట్లు
✒ ఎస్టీ సంక్షేమం: రూ.7,557 కోట్లు
✒ బీసీ సంక్షేమం: రూ.39,007 కోట్లు
✒ మైనార్టీ సంక్షేమం: రూ.4,376 కోట్లు
✒ మహిళ, శిశు సంక్షేమం: రూ.4,285 కోట్లు
✒ యువజన, పర్యాటక శాఖ: 322 కోట్లు

News November 11, 2024

ఏపీ వార్షిక బడ్జెట్.. కేటాయింపులు (రూ.కోట్లలో)

image

* ఉన్నత విద్య: రూ.2,326
* ఆరోగ్య రంగం: రూ.18,421
* పంచాయతీరాజ్: రూ.16,739
* పట్టణాభివృద్ధి: రూ.11,490
* గృహ నిర్మాణం: రూ.4,012
* జల వనరులు: రూ.16,705
* పరిశ్రమలు, వాణిజ్యం: రూ.3,127
* ఇంధన రంగం: రూ.8,207
* రోడ్లు, భవనాలు: రూ.9,554

News November 11, 2024

GOOD NEWS.. నెలకు రూ.5వేలు.. గడువు పొడిగింపు

image

‘PM ఇంటర్న్‌షిప్’ స్కీమ్‌ గడువు నిన్నటితో ముగియగా దాన్ని ఈ నెల 15 వరకు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. మహీంద్రా&మహీంద్రా, టాటా గ్రూప్ వంటి సంస్థల్లో బ్యాంకింగ్, ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో నెలకు రూ.5వేల స్టైఫండ్ ఇస్తూ ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. అప్లై చేసుకునేందుకు వయసు 21-24 ఏళ్ల మధ్య ఉండాలి. SSC, ఇంటర్, ITI, డిగ్రీ చదివిన వారు అర్హులు. pminternshipscheme.comలో దరఖాస్తు చేసుకోవచ్చు.