India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బజరంగదళ్ నేతలు, సభ్యుల సమాచారం సేకరించాలని అన్ని స్టేషన్లకు వైర్లెస్ మెసేజ్ పంపిన South Goa SP సునీతా సావంత్ను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. సాధారణంగా SP స్థాయి అధికారి బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేస్తుంది. అయితే ఇక్కడ గోవా పోలీసులు వైర్లెస్ సందేశం ద్వారా ఆమెను తప్పించడం గమనార్హం. బజరంగదళ్ ఒత్తిడి మేరకే ఆమె బదిలీ జరిగినట్టు తెలుస్తోంది.

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ను వైద్యులు విడుదల చేశారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. ఇప్పుడు మరింత మెలకువగా ఉంటున్నాడని, అయితే కుటుంబ సభ్యులను గుర్తించడం లేదని పేర్కొన్నారు. పలకరిస్తే ప్రతిస్పందన చూపించడం లేదన్నారు. DEC 4న ‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగ్గా శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే.

ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలకు యూపీ సర్కార్ నష్ట పరిహారం ప్రకటించింది. 30 కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు రాగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తొక్కిసలాట జరిగింది. ఘటనలో 30 మంది చనిపోగా, 60 మందికి గాయాలైన విషయం తెలిసిందే.

AP: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా పడింది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో సజ్జల కోర్టును ఆశ్రయించారు. రేపు కోర్టులో ఆయనకు ఊరట దక్కుతుందా? లేదా? అనేది చూడాలి.

AP: YS జగన్ బంధువు YS వెంకట్ రెడ్డి బెరైటీస్ గనుల లీజ్ ఎగ్జిక్యూషన్ నిలుపుదల చేయడంతో పాటు లీజు మంజూరు డీవియేషన్స్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ‘YSR జిల్లా వేములలో వైట్ బెరైటీస్ లీజ్ ఆర్డర్ను ఇచ్చారు. క్వారీ లీజు అనుమతి గనులశాఖ డైరెక్టర్ పరిధిలో ఉంటుంది. గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి గతంలో అక్రమంగా అనుమతిచ్చారు. వాటిని రద్దు చేస్తాం’ అని కొల్లు చెప్పారు.

కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత సలాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, పురుషులు సమానం కాదని అన్నారు. స్త్రీలను, పురుషులను సమానంగా చూడటం వాస్తవికతకు వ్యతిరేకమని చెప్పారు. క్రీడల్లో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తారని ఉదహరించారు. అన్ని విషయాల్లోనూ స్త్రీ పురుషులు సమానమని చెప్పగలమా? అని ప్రశ్నించారు. సలాం వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే <<15302571>>తొక్కిసలాట<<>> జరిగిందని మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు. ఘటనలో 30 మంది చనిపోగా, గాయపడిన మరో 60 మంది భక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ఘటన వల్ల ఇవాళ వీఐపీలను కుంభమేళాకు అనుమతించలేదని ప్రెస్మీట్లో వెల్లడించారు. అదనపు సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్ 1920ను సంప్రదించాలన్నారు.

TG: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మరణించాడు. చికాగోలో జరిగిన ప్రమాదంలో ఖైరతాబాద్కు చెందిన మహమ్మద్ వాజిద్ మృతిచెందాడు. వాజిద్ యువజన కాంగ్రెస్ నేతగా ఉన్నాడు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లాడు.

ఢిల్లీకి అందే యమునా నది నీటిలో హరియాణా విషం కలుపుతోందని ఆరోపించిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్పై సోనిపట్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అధికార-విపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలు జాతికే అవమానం అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. హరియాణా CM నాయబ్ సింగ్ యమునా నది నీటిని తాగి ఆరోపణలను తిప్పికొట్టారు.

AP: ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. FEB నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.