India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి FEB 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APR 1 నుంచి 8 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రెస్పాన్స్ షీట్, కీలను FEB 1 లేదా 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
వెబ్సైట్: https://jeemain.nta.nic.in/

టీనేజ్లో అమ్మాయిల శరీరాల్లో మార్పులు వస్తాయి కాబట్టి వారు పోషకాహారం తీసుకోవాలి. కాల్షియం, ఐరన్, అయోడిన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి. వారు భవిష్యత్లో గర్భం దాల్చినప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మాంసకృత్తులు ఉన్న ఆహారం తీసుకోవాలి. మటన్, చికెన్, చేపలు, గుడ్లు, పాలు, వెన్న తినాలి. అలాగే ఓక్రా, బ్రొకోలి, క్యాబేజీ, పాలకూర వంటివి రొటీన్ డైట్లో ఉండేలా చూసుకోవాలి.

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవానికి ‘పుష్ప-2’ మూవీ మాత్రమే ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తుందని నిన్న ప్రకటించారు. రీలోడెడ్ త్వరలో రిలీజ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ తెలిపింది. కానీ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇస్తూ 23 నిమిషాలు కలిపిన రీలోడెడ్ వెర్షన్ను స్ట్రీమింగ్ చేస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళంలో ప్రసారమవుతోంది.

TG: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీముల ప్రారంభానికి బ్రేక్ పడింది. పాత పథకాలు యథావిధిగా అమలు కానున్నాయి. ఈనెల 26న ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27న రాష్ట్రంలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు <<15299294>>ఎన్నికలు<<>> జరగనున్నాయి.

AP: రాష్ట్రంలోని ఆలయాల్లో తమకు ఎదురైన ఇబ్బందులపై ఫిర్యాదు చేయడంతోపాటు సలహాలు ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్ను దేవదాయ శాఖ అందుబాటులోకి తేనుంది. తొలుత సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో వీటిని ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దర్శన అనుభవం, ఇతర మౌలిక సదుపాయాలు, సిబ్బంది ప్రవర్తనపై భక్తులు ఫిర్యాదు చేయొచ్చు.

AP: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలను <<15097641>>రద్దు చేస్తారనే<<>> వార్తలపై ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆ ఎగ్జామ్స్ యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఇంటర్నల్ మార్క్స్ ఆలోచనను విరమించుకుంది. వివిధ వర్గాల నుంచి స్వీకరించిన సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. NCERT సిలబస్ అమలు చేయనుంది. మ్యాథ్స్లో A, B పేపర్లు కాకుండా ఒకే పేపర్గా ఇస్తారు. బోటనీ, బయాలజీ కలిపి ఒకే పేపర్ ఉంటుంది.

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఫిబ్రవరి మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశముంది. కులగణన, బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు వచ్చే నెల తొలి వారంలో మంత్రివర్గం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాలపై చర్చ పెట్టి తీర్మానం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

TG: ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు దీనిని అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లి పట్టీ, మిల్లెట్ బిస్కెట్లు, ఆనియన్ పకోడీ, శనగలు అందించాలని ఆదేశించింది. ఒక్కో స్టూడెంట్కు రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. MAR 21 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR నటించబోయే సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుందని పేర్కొన్నాయి. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘ఎంటర్ ది డ్రాగన్’, ‘NTR ది డ్రాగన్’ అనే టైటిళ్లను కూడా మూవీ టీమ్ పరిశీలిస్తోందని వార్తలొస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ భార్య కుంభమేళాలో గుర్తించారు. ఝార్ఖండ్కు చెందిన గంగాసాగర్ 1998లో భార్య ధన్వా దేవి, పిల్లలను వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం వారు వెతుకుతూనే ఉన్నారు. కుంభమేళాకు వెళ్లిన కుటుంబసభ్యులకు ఆయన అఘోరాగా కనిపించారు. అతడి నుదుటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు గుర్తించి తన భర్తేనని ధన్వా దేవి గుర్తించారు. కానీ వారితో వచ్చేందుకు ఆయన నిరాకరించారు.
Sorry, no posts matched your criteria.