India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పెద్ద, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్కు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తారని నిపుణుల అంచనా. 2016లో ట్రంప్ గెలిచాక బంగ్లా డెలిగేట్స్ ఆయన్ను కలిశారు. అప్పుడు ఆయన ప్రత్యేకంగా యూనస్ను గుర్తుచేశారు. ‘ఆ ఢాకా మైక్రో ఫైనాన్స్ వ్యక్తి ఎక్కడ? నేను ఓడిపోవాలని ఆయన విరాళం ఇచ్చినట్టు విన్నాను’ అని హసీనాకు షాకిచ్చారు. బంగ్లాలో హిందువులపై దాడి, ఇతర అంశాలపై ట్రంప్ సీరియస్గా ఉన్నారు.
Jet Airways ఆస్తుల అమ్మకానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దివాలా ప్రక్రియ ఆరంభించాలని ఆదేశించింది. రిజల్యూషన్ ప్లాన్ అమల్లో JKC విఫలమైందని పేర్కొంది. ప్లాన్ ప్రకారం వారు రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టలేదని, రూ.226 కోట్ల ఉద్యోగ బకాయిలు చెల్లించలేదని గమనించిన కోర్టు NCLAT తీర్పును పక్కన పెట్టేసింది. రుణదాతలు, ఉద్యోగులు, స్టేక్ హోల్డర్ల ప్రయోజనం కోసం లిక్విడేషన్ తప్పనిసరని వెల్లడించింది.
TG: సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా పర్యటన ఖరారైంది. రేపు కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేపు ఉ.11 గంటలకు YTDA అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం వలిగొండ(మ) సంగెం భీమలింగంకత్వాలో రైతులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టనున్నారు. పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను పరిశీలించి, స్థానిక రైతులతో సమావేశం కానున్నారు.
TG: 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయని విమర్శించారు. HYDలో సంస్థాగత ఎన్నికల వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికల వ్యవస్థ బీజేపీకి ఊపిరి అని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
డా.యల్లాప్రగడ <<14550601>>సుబ్బారావు<<>> భీమవరంలో 1895లో జన్మించారు. రాజమండ్రిలో మెట్రిక్యులేషన్, మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి PhD పొందారు. కణాల్లో ATP పనితీరును కనుగొన్నారు. క్యాన్సర్ చికిత్సకు మెథోట్రెక్సేట్ను అభివృద్ధి చేశారు. హెట్రోజెన్, టెట్రాసైక్లిన్ వంటి యాంటీ బయోటిక్స్ను ప్రపంచానికి అందించారు. వండర్ డ్రగ్స్ మాంత్రికుడిగా పేరొందిన ఆయన 1948లో కన్నుమూశారు.
క్రికెట్ ఆడేందుకు తన శరీరం సహకరించడం లేదని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తెలిపారు. అందుకే రిటైర్మెంట్ పలికానని ఆయన చెప్పారు. ‘నాకెంతో ఇష్టమైన క్రికెట్ను ఆస్వాదించలేకపోతున్నా. అందుకే గతేడాదే వీడ్కోలు పలుకుదామనుకున్నా. కానీ సౌరవ్ గంగూలీ, నా భార్య నన్ను మార్చారు. ఈ సీజన్లో రంజీల్లో ఆడాలని సూచించారు. ఈడెన్ గార్డెన్స్లో నా చివరి మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని ఆయన పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలపై విద్యుత్ భారానికి గత ప్రభుత్వమే కారణమని, ఆ రంగంపై రూ.1.25 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ‘1998లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చా. తలసరి కరెంట్ వినియోగం పెంచా. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించా. ప్రస్తుతం ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించేలా ‘ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్-2023’ చట్టంలో సవరణలు చేసింది. 2 ఎకరాలలోపు రూ.5,000, 2-5 ఎకరాల మధ్య రూ.10,000, 5 ఎకరాల పైన రూ.30,000 ఫైన్ వేయనుంది.
బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అతనిపై విచారణను కొనసాగించాలని ఆదేశించింది. 2022లో ఓ టీచర్పై మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత వారిమధ్య రాజీ కుదరడంతో FIRను హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పును ఓ వ్యక్తి సుప్రీంలో సవాల్ చేశారు.
AP: వికసిత్ భారత్, వికసిత్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. అమరావతి విట్ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్యపై సదస్సులో ఆయన మాట్లాడారు. తాను కూడా హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. మనకు, విదేశాల్లో విద్యకు తేడాలు ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు చేసిన కృషి వల్లే ఐటీలో అద్భుత ఫలితాలు వచ్చాయని, మన విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.