India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువు ఇవాళ్టితో ముగియనుంది. జనరల్, ఒకేషనల్, ఫస్ట్, సెకండ్ ఇంటర్ విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద రూ.3 వేల ఫైన్తో నేటి వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

భారతీయ సంస్కృతిలో ఉదయాన్నే 3 నుంచి 5 గంటల మధ్య నిద్రలేవడం మంచిది. ఈ సమయంలో మేల్కొంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వేకువలో ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా పాజిటివ్గా ఉంటుంది. ఈ సమయంలో మేల్కొంటే సృజనాత్మకంగా, ఎనర్జిటిక్గా ఉంటారు. చదువు, ఇతర విషయాలను సులభంగా గుర్తుంచుకోవచ్చు. కుటుంబంతో గడిపేందుకు తగినంత సమయం దొరుకుతుంది. యోగా, వ్యాయామానికి కావాల్సిన సమయం లభిస్తుంది.

AP: సీఎం చంద్రబాబు కొవ్వూరు పర్యటన రద్దు అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ టూర్ రద్దైనట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ నెల 1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు ఇదే కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాకు మార్చినట్లు తెలుస్తోంది.

భారత క్రికెట్లోకి మరో కొత్త ఫార్మాట్ వచ్చి చేరింది. ఫిబ్రవరి 6 నుంచి లెజెండ్స్ 90 లీగ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 90-90 బాల్ మ్యాచులు జరుగుతాయి. ఛత్తీస్గఢ్ వారియర్స్, హరియాణా గ్లాడియేటర్స్, దుబాయ్ జెయింట్స్, గుజరాత్ సాంప్ ఆర్మీ, ఢిల్లీ రాయల్స్, ఢిల్లీ బిగ్ బాయ్స్, రాజస్థాన్ కింగ్స్ జట్లు పాల్గొంటాయి. రైనా, రాయుడు, ధవన్, గప్టిల్, టేలర్, డ్వేన్ బ్రావో, షకీబ్ వంటి ప్లేయర్లు టోర్నీలో ఆడనున్నారు.

భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రూ.3 కోట్ల నగదు రివార్డు కూడా అందజేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ ప్రశాంత్ శర్మ ఆమెను సత్కరించారు. కాగా డీఎస్పీ పోస్టుతో తన చిన్ననాటి కల నెరవేరిందని దీప్తి శర్మ సోషల్ మీడియాలో తెలిపారు.

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 420 రోజులవుతున్నా ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేదంటూ BRS ఆందోళనకు దిగుతోంది. ఇవాళ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసనలు, ధర్నాలు చేపట్టనున్నాయి. అలాగే గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.

TG: ఉస్మానియా కొత్త ఆస్పత్రిని ప్రపంచస్థాయిలో నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 26.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తామన్నారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొస్తాం. ఆస్పత్రిలో 2 వేల పడకలు ఉంటాయి. ప్రతి గదిలో గాలి, వెలుతురు వచ్చేలా నిర్మిస్తాం. విశాలమైన రోడ్లు, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. లేటెస్ట్ టెక్నాలజీతో మార్చురీ నిర్మిస్తాం’ అని చెప్పారు.

TG: కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారని, సరైన ఏర్పాట్లు కల్పించి, రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

1882: అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ జననం
1940: నటుడు, రచయిత మోహన్ మహర్షి జననం
1957: సినీ దర్శకుడు ప్రియదర్శన్ జననం
1948: భారత జాతి పిత మహాత్మా గాంధీ మరణం
2016: తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి మరణం
2016: భారత సైనిక దళాల మాజీ ఛీఫ్ జనరల్ కేవీ కృష్ణారావు మరణం
అమరవీరుల సంస్మరణ దినం

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Sorry, no posts matched your criteria.