India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జర్మనీ ఎకానమీ పతనం అంచున నిలబడింది. మానుఫ్యాక్చరింగ్ గ్రోత్ నెగటివ్లోకి వెళ్లింది. అప్పులు పెరిగాయి. పడిపోయిన GDP పుంజుకొనే అవకాశమే కనిపించడం లేదు. బడ్జెట్ లేనప్పటికీ ఉక్రెయిన్కు సాయం చేస్తోంది. తానే ఆంక్షలు పెట్టి రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ను చీప్గా కొనలేక ఇబ్బంది పడుతోంది. పెరిగిన పవర్, ఫుడ్ ఛార్జీలు, ద్రవ్యోల్బణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారు తిరగబడేందుకు సిద్ధమవుతున్నారు.
గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ పేలవంగా ఆడుతుండటంపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వారికి ఆందోళన అవసరం లేదని జ్యోతిషుడు గ్రీన్స్టోన్ లోబో జోస్యం చెప్పారు. ‘విరాట్ గురించి ఆయన ఫ్యాన్స్ నన్ను తరచూ అడుగుతుంటారు. ఆయన కనీసం 2027 వరకు ఆడతారు. కోహ్లీ బ్యాట్ పరుగుల వరద పారించే సమయం రానుంది. సచిన్ రికార్డుల్ని దాటలేకపోవచ్చు కానీ గవాస్కర్, ద్రవిడ్ను దాటుతారు’ అని అంచనా వేశారు.
విహారం, విడిది కోసం గోవాకు వచ్చే విదేశీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా ప్యాండమిక్ తరువాత ఈ ట్రెండ్ పెరిగింది. 2019లో గోవాకు 9.4 లక్షల మంది విదేశీయులు విచ్చేశారు. అయితే 2023లో ఆ సంఖ్య 4.03 లక్షలకు తగ్గింది. ఇది 60 శాతం తగ్గుదలను సూచిస్తోంది. గోవాలో ట్యాక్సీ మాఫియా వల్ల కొందరు విదేశీయులు దోపిడీకి గురయ్యామని భావించడం, ఇతరత్రా అసౌకర్యాల వల్ల గోవా రావడం తగ్గించినట్టు తెలుస్తోంది.
AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ నేత <<14551662>>పేర్ని నాని ప్రకటించడంపై<<>> టీడీపీ వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి జగన్ రెడ్డి ముఠా పారిపోయిందని ట్వీట్ చేసింది. ఈవీఎంలపై నమ్మకం లేదని చెప్పి, బ్యాలెట్ ద్వారా జరుగుతున్నా పారిపోతున్నారని దుయ్యబట్టింది. ఎలాగూ ఓట్లు రావనే జగన్ రెడ్డి డిసైడ్ అయ్యి పోటీ చేయట్లేదని పేర్కొంది.
2024 జులై-సెప్టెంబర్లో HYDలో రెసిడెన్షియల్ సేల్స్ 20%, లావాదేవీలు 7% పెరిగాయని స్క్వేర్ యార్డ్స్ సంస్థ తెలిపింది. గత ఏడాది జులై-సెప్టెంబర్(18,314)తో పోలిస్తే ఈ ఏడాది(19,527) ట్రాన్సక్షన్స్లో పెరుగుదల కనిపించిందని పేర్కొంది. మొత్తం రిజిస్టర్డ్ సేల్స్ విలువ ₹11,718కోట్లకు చేరిందని తెలిపింది. యావరేజ్ రిజిస్టర్డ్ హోమ్ సేల్స్ వాల్యూ ₹60లక్షలుగా ఉందని, వార్షిక వృద్ధి 13%గా నమోదయిందని వివరించింది.
ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాకింగ్స్లో టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 22వ స్థానానికి పడిపోయారు. ఇలా కోహ్లీ టాప్20 నుంచి పడిపోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆయన టెస్టుల్లో 2 సార్లు అగ్రస్థానానికి ఎగబాకారు. 2011లో 116, 2012లో 37, 2013లో 11, 2014 &15లో 15, 2016 &17లో 2, 2018 &19లో 1వ ర్యాంకు, 2020లో 2, 2021లో 9, 2022లో 15, 2023లో 9, ఈ ఏడాది 22వ స్థానానికి చేరుకున్నారు.
TG: రేషన్కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను తొలగించేందుకే ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందన్న ప్రచారాన్ని డిప్యూటీ సీఎం భట్టి ఖండించారు. ‘సర్వే ఆధారంగా పాలన, ప్రణాళిక రూపకల్పన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు ఉంటాయి. సర్వే పూర్తయ్యాక సామాజిక వర్గాల వారీగా ప్రజల స్థితిగతులపై వివరాలను బహిర్గతం చేస్తాం. మేధావులు, అన్నివర్గాల అభిప్రాయాలతో కులగణన ప్రశ్నలు రూపొందించాం’ అని వెల్లడించారు.
హిందాల్కో షేర్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో 8.42% నష్టపోయాయి. యూఎస్కు చెందిన అనుబంధ సంస్థ Novelis Q2 లాభం 18 శాతం క్షీణించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే గత ఏడాది కాలంలో 165% రిటర్న్ ఇచ్చిన TRENT షేర్లు 6.12% నష్టపోయాయి. Q2 రిజల్ట్స్ 39% (YoY) మేర పెరిగినా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. అలాగే ఇతరత్రా లాభాలు తగ్గడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
తాము సక్రమంగా పెరగడం వెనుక తన పెదనాన్న చిరంజీవిది ప్రధాన పాత్ర అని నటుడు వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘చిరంజీవిగారు మాకు గర్వం తలకెక్కకుండా పెంచారు. ఆయనో హెడ్మాస్టర్ తరహా. బెత్తంతో నన్ను, చరణ్, బన్నీని దారిలో పెట్టారు. చిన్నవాడిని కాబట్టి నాకంటే ఎక్కువగా వాళ్లిద్దరికే బడితెపూజ జరిగేది. ప్రతి సంక్రాంతికి అందరం 4రోజులు కచ్చితంగా పెదనాన్న ఇంట్లో గడుపుతాం’ అని గుర్తుచేసుకున్నారు.
ఫైనాన్స్, మెటల్, ఆటో, ఫార్మా సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడడంతో సెన్సెక్స్ 836 పాయింట్లు నష్టపోయి 79,541 వద్ద, నిఫ్టీ 284 పాయింట్ల నష్టంతో 24,199 వద్ద స్థిరపడ్డాయి. 24,180 పరిధిలో నిఫ్టీ, 79,420 పరిధిలో సెన్సెక్స్ సపోర్ట్ తీసుకుంటూ కన్సాలిడేట్ అయ్యాయి.
Sorry, no posts matched your criteria.