News November 6, 2024

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో భూఆక్రమణల నిరోధక చట్టం-1982 రద్దు ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ప్రొహిబిషన్ బిల్లు-2024కు ఆమోదం పలుకుతుందని సమాచారం. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన పనుల గురించి చర్చించే ఛాన్స్ ఉంది.

News November 6, 2024

దూసుకెళ్తున్న ట్రంప్

image

US అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ‘అసోసియేట్ ప్రెస్’ ప్రకారం ఆయన ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేశారు. అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ 30 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. మొత్తంగా ఆయన ఖాతాలో 95 ఓట్లు చేరాయి. కమల 5 రాష్ట్రాల్లో గెలుపొంది 35 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. 40 ఓట్లున్న టెక్సాస్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.

News November 6, 2024

త్వరలో వరంగల్ మాస్టర్ ప్లాన్ విడుదల

image

TG: 2050 నాటి జనాభాను దృష్టిలో పెట్టుకుని వరంగల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా విడుదల చేయనుంది. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్‌లకు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించింది. ఏడాదిలోపు మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకొచ్చేలా, కార్గో సేవలూ అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది.

News November 6, 2024

అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.

News November 6, 2024

రామగుండంలో రూ.29,345 కోట్లతో పవర్ ప్రాజెక్టు

image

TG: రామగుండంలో NTPC ఆధ్వర్యంలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. 2400(3*800) మెగావాట్ల సామర్థ్యంతో రూ.29,345 కోట్లతో దీనిని నిర్మించేందుకు NTPC బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 6400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో రూ.80,000 కోట్లతో ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి.

News November 6, 2024

12 ఎకరాల స్థలం కొన్న పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరో 12 ఎకరాల స్థలం కొన్నారు. ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ సుధీర్ నిన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలోనే ఇక్కడ పవన్ ఇల్లు, క్యాంప్ కార్యాలయం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాలు కొన్నారు.

News November 6, 2024

16,347 టీచర్ పోస్టులు.. నోటిఫికేషన్ వాయిదా

image

AP: ఇవాళ వెలువడాల్సిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 16,347 టీచర్ పోస్టులతో నేడు మెగా డీఎస్సీ ప్రకటించేందుకు తొలుత ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. మరోవైపు డీఎస్సీని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.

News November 6, 2024

US POLLS: ట్రంప్ రెండు, కమల ఒకచోట గెలుపు

image

అమెరికాలో రాష్ట్రాలవారీగా పోలింగ్ పూర్తవుతోంది. దీంతో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తాజాగా ఇండియానా(11 ఎలక్టోరల్ ఓట్లు), కెంటకీ(8 ఎలక్టోరల్ ఓట్లు)లో ట్రంప్ విజయం సాధించారు. వెర్మాంట్‌లో కమలా హారిస్(3 ఎలక్టోరల్ ఓట్లు) గెలుపొందారు. అంతకుముందు డిక్స్‌విల్లే నాచ్‌లో చెరో 3 ఎలక్టోరల్ ఓట్ల చొప్పున గెలవడంతో టై అయింది. తొలుత మేజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లు ఎవరు సాధిస్తారో వారిదే అధ్యక్ష పీఠం.

News November 6, 2024

తెలంగాణలో ఇవాళ్టి నుంచి కులగణన

image

TG: ఇవాళ్టి నుంచి కులగణన ప్రారంభం కానుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై వివరాలు సేకరిస్తారు. దాదాపు 85 వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తారు. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడిని నియమించగా, 10% కుటుంబాలను వీరు మరోసారి సర్వే చేస్తారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

News November 6, 2024

ఇవాళ్టి నుంచి ఆందోళనలు: షర్మిల

image

AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో PCC చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ్టి నుంచి 3 రోజులు ఆందోళనలు చేపట్టనున్నాయి. ‘ఛార్జీల పెంపు పాపం వైసీపీదని, కూటమికి సంబంధం లేదని చెప్పడం సరికాదు. అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి’ అని ఆమె సూచించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగే నిరసనలో షర్మిల పాల్గొంటారు.