India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హాలీవుడ్ సినిమా ‘ది మమ్మీ’తో పాపులరైన ఆర్నాల్డ్ వోస్లూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. 1854-78 మధ్య కాలంలో జరిగే ఈ కథలో విజయ్ పాత్ర తర్వాత ఆయన క్యారెక్టర్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సుంది.
TG: ఇవాళ టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మే, జూన్లో తొలి టెట్ నిర్వహించింది. ఇవాళ రెండో టెట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వనుండగా జనవరిలో పరీక్షలు జరపనుంది. మేలో నిర్వహించిన టెట్లో 1.09 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఇటీవల డీఎస్సీ కూడా పూర్తి కావడంతో ఈసారి పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గొచ్చని అధికారులు భావిస్తున్నారు.
TG: ఈనెల 5 నుంచి 7 వరకు జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ లండన్కు వెళ్లనున్నారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన UK పర్యటన సాగనుంది. ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్ర, వారసత్వ సంపద తెలిసేలా పర్యాటక శాఖ అక్కడ ఓ స్టాల్ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రావెల్ మార్ట్లో 100కు పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు.
AP: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాడిపర్రులో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మృతులను వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉండ్రాజవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదంతా అటెన్షన్ డైవర్షన్తో పబ్బం గడిపిందని X వేదికగా KTR విమర్శలు గుప్పించారు. ‘100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 330 రోజులు ముగిశాయి. ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది. 2లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా, రూ.4వేల పెన్షన్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. జవాబు చెప్తావా రాహుల్ గాంధీ?’ అని ప్రశ్నించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల మహా సంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెర లేవనుంది. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇప్పటికే ముందస్తు ఓటింగ్లో 6.8Cr మంది పాల్గొన్నారు. చివరివరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్, కమల ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాత్రితో వారి ప్రచారం ముగియనుంది. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలను బట్టి ట్రంప్, కమల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది.
TG: ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. మేలో భూగర్భ జలమట్టం సగటున 10.36 మీటర్లు ఉండగా, అక్టోబర్లో అది 5.38 మీటర్లకు చేరింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 8.69 మీటర్లు, ఆదిలాబాద్ 7.66 మీ. భూపాలపల్లిలో 7.35 మీ. మహబూబ్నగర్లో 6.94 మీ. మేర జలమట్టం పెరిగింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 2.64 మీటర్ల మట్టం పెరిగింది.
సినీ ఇండస్ట్రీపై బోల్డ్గా మాట్లాడే హీరోయిన్ తాప్సీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఒక సినిమాలో అప్పటికే పెద్ద హీరో ఉన్నాడంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్ను తీసుకోరని చెప్పారు. పైగా ఎవర్ని తీసుకోవాలనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సక్సెస్ఫుల్ డైరెక్టర్లు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారని ఓ ఇంటర్వ్యూలో తాప్సీ చెప్పారు.
పాక్లోని లాహోర్లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. అక్కడ AQI రికార్డ్ స్థాయిలో 1900 దాటింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్థానిక స్కూళ్లకు వారం సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరించారు. మనదేశంలో AQI అత్యధికంగా ఢిల్లీలో 300పైన నమోదవుతుంటుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు యూపీఐ లావాదేవీలకు ఈ నెల 5, 23 తేదీల్లో అంతరాయం కలగనుంది. 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు, 23వ తేదీ 12 గంటల నుంచి 3గంటల వరకు సిస్టమ్స్ నిర్వహణ కారణంగా యూపీఐ చెల్లింపులు చేయలేరని ఆ బ్యాంకు తెలిపింది. అలాగే దుకాణదారులు సైతం యూపీఐ సేవలు పొందలేరని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.