News November 2, 2024

ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

News November 2, 2024

రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా ప్రణాళికలు: సీఎం

image

AP: 10 పాలసీలతో రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో మెట్రో రైలు, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2047 నాటికి ఏపీ అన్ని అంశాల్లోనూ ముందుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

News November 2, 2024

మృత్యుంజయుడు!

image

ఒంటినిండా 50 గాయాలు, జంతువుల కాట్లు అయినప్పటికీ ప్రాణాలతో బయటపడిందో శిశువు. UPలోని హమీర్‌పూర్‌లో తల్లిదండ్రులే తమ బిడ్డను బ్రిడ్జిపై నుంచి విసిరేశారు. అదృష్టవశాత్తు ఆ శిశువు చెట్టు కొమ్మకు చిక్కుకోగా ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. గమనించిన ఓ వ్యక్తి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రెండు నెలల చికిత్స తర్వాత ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. కృష్ణాష్టమి రోజు దొరకడంతో శిశువుకు కృష్ణ అనే పేరు పెట్టారు.

News November 2, 2024

మధ్యాహ్నం వరకే స్కూళ్లు.. మీరేమంటారు?

image

TG: కులగణన కోసం ఈ నెల 6 నుంచి 3 వారాల పాటు 18వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలను మధ్యాహ్నం <<14507983>>ఒంటిగంట <<>>వరకే నడపనున్నారు. ఇప్పటికే అడ్మిషన్లు, పుస్తకాల ఆలస్యం, టీచర్ల బదిలీలు, పదోన్నతులు, వర్షాలతో సెలవులు రావడంతో బోధనకు ఆటంకం ఏర్పడింది. దసరా, దీపావళి సెలవుల తర్వాత ఈ నెలలో చదువులు గాడినపడతాయనుకుంటే 3 వారాలు సగం పూట బడులు పెట్టడం ఏంటని పేరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

News November 2, 2024

నీలి రంగు అరటి పండ్లు.. ఐస్‌క్రీమ్ తిన్నట్లే రుచి!

image

పసుపు, ఆకుపచ్చగా ఉండే అరటి పండ్లనే చూస్తుంటాం. కానీ నీలి రంగులోనూ అరటి పండ్లుంటాయనే విషయం చాలా మందికి తెలియదు. దీనిని బ్లూజావా అని పిలుస్తుంటారు. ఇది వెనీలా ఐస్ క్రీమ్ టేస్టును కలిగి ఉంటుంది. ఇవి అగ్నేయాసియాలో పెరుగుతుందని, హవాయిలో బాగా ప్రాచుర్యం పొందిందని, ‘ఐస్ క్రీమ్ బనానా’ అని పేరు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ అరటి పండును మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?

News November 2, 2024

రేవంత్ నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు: KTR

image

TG: పరిపాలనా అనుభవం లేకుండా సీఎం రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. HMDA పరిధిలోని గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావంటే పేద ప్రజల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. LRS ఫ్రీగా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు.

News November 2, 2024

ఓఆర్ఆర్‌పై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

image

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ORRపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్‌ల వద్ద ఈ టెస్టులు చేస్తారు. ఇప్పటికే యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. కాగా మద్యం తాగి ORRపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News November 2, 2024

అంబటికి మతి భ్రమించిందేమో: రామానాయుడు

image

AP: YCP నేత అంబటి రాంబాబు మానసిక స్థితి సరిగా లేదేమోనని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. జగన్ మెప్పు కోసం పదే పదే అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించామని ఆధారాలు చూపండి. ప్రాజెక్టు ఎత్తు తగ్గినట్లు ప్రభుత్వానికి తెలియకుండా YCP నేతలకు తెలిసిందా? ప్రాజెక్టు గురించి మేం చెబితే సరిపోదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే మాట.. ఒకటే బాట’ అని ఆయన స్పష్టం చేశారు.

News November 2, 2024

Blue Wall states: ట్రంప్ బద్దలుకొడతారా?

image

1992 నుంచి 2012 వరకు డెమోక్రాట్లకు కంచుకోట అయిన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్‌లను Blue Wall states అంటారు. 44 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్న ఈ 3 రాష్ట్రాలు అధ్య‌క్ష అభ్య‌ర్థి విజ‌యానికి కీల‌కం. ఇక్క‌డ గెలిచిన‌వారిదే అధ్య‌క్ష పీఠం. 2016లో రిప‌బ్లిక‌న్ల త‌ర‌ఫున మొద‌టిసారిగా ట్రంప్ ఈ మూడు రాష్ట్రాల్ని గెలిచారు. 2020లో మ‌ళ్లీ డెమోక్రాట్లు పాగా వేశారు. దీంతో ఈసారి ఫ‌లితాల‌పై ఆస‌క్తి నెల‌కొంది.

News November 2, 2024

ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

image

TG: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మనోహరాబాద్(మ) పోతారం వద్ద ట్రాక్టర్-బైక్ ఢీకొని దంపతులు, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికంగా పలువురు రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోశారు. దీంతో రోడ్డుపై ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వచ్చిన బైకును ట్రాక్టర్ ఢీకొట్టడంతో నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.