India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థుల కోసం పోలీసు వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారని ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. పోలీసు శాఖ అధికారులే తనకు ఈ విషయాన్ని వెల్లడించారని అన్నారు. అయితే, ఈ ఆరోపణలను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పవార్ ఊహల్లో జీవిస్తున్నారని, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ఇలా జరిగిందని దుయ్యబట్టారు.
ఇటీవల ఓ మారథాన్లో పాల్గొన్న 54 ఏళ్ల CM ఒమర్ అబ్దుల్లా ఎలాంటి శిక్షణ, ప్లాన్, న్యూట్రీషన్ లేకుండా 21 KM రన్ పూర్తి చేసినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన పలువురు వైద్యులు ఈ వయసులో ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదని చెబుతున్నారు. సరైన శిక్షణ, తర్ఫీదు లేకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని సూచిస్తున్నారు. ఎక్కువ దూరం రన్నింగ్ ఈవెంట్లకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
నైజీరియాలో ఆహార నిల్వలు అడుగంటడంతో తిండి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. నిరసన చేస్తున్న 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా పలు ఆరోపణలతో అక్కడి ప్రభుత్వం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. విచారించిన కోర్టు మరణశిక్ష విధించింది. అందులో 29 మంది మైనర్లున్నారు. కాగా బాలల హక్కు చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని మరణ శిక్ష రద్దుచేసి, ₹5లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.
ప్రస్తుతం ఏ శుభకార్యం జరిగినా అక్కడ చాక్లెట్లు ఉండాల్సిందే. ఈ చాక్లెట్లకు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. తొలుత అమెరికాలోని కోకో చెట్ల పళ్లలోని రసం తీసి తాగేవారు. 1519లో ఈ రసాన్ని స్పెయిన్ తమ దేశానికి తీసుకువచ్చింది. ఆ తర్వాత యూరప్ ప్రాంతానికి పరిచయమైంది. వందల ఏళ్లపాటు రసంగానే తాగారు. 1819లో తొలిసారిగా స్విట్జర్లాండ్లో చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అప్పటి నుంచి అవి బిళ్లల రూపంలోకి మారాయి.
IPL-2025లోనూ హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వహించనున్నారు. ఈక్రమంలో కెప్టెన్లకే కెప్టెన్ అంటూ పాండ్య అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. IPLలో ముంబై ఇండియన్స్ జట్టులో భారత వన్డే& టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, టెస్ట్ వైస్ కెప్టెన్ బుమ్రా, ఎమర్జింగ్ టీ20 కెప్టెన్ తిలక్ వర్మ ఉన్నారు. గతేడాది నుంచి MI కెప్టెన్గా పాండ్య వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
TG: కార్తీకమాసం సందర్భంగా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి DEC 1 వరకు అన్ని ఆలయాల్లో కార్తీకమాస దీపోత్సవాలు నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ సా.6-8 గంటల వరకు దీపోత్సవ వేడుకలు చేయాలని, పాల్గొనే వారికి 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా ఇవ్వాలన్నారు. మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ ఇవ్వడంతో పాటు ప్రధాన ఆలయాల్లో బ్లౌజ్ పీస్లు అందించాలన్నారు.
తిరుపతి నుంచి వైజాగ్ సమీపంలోని దువ్వాడకు వెళ్లేందుకు 55 ఏళ్ల మూర్తి తిరుమల ఎక్స్ప్రెస్ రైలులో 3AC టికెట్ కొన్నారు. ప్రయాణ సమయంలో మురికి మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడం, ఏసీ పనిచేయకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మూర్తి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా విచారణ జరిపి రైల్వేకు రూ.30వేలు జరిమానా విధించింది.
న్యూజిలాండ్తో మూడో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఆకట్టుకుంది. డైవ్ క్యాచ్తో పాటు ఫీల్డింగ్లో అదరగొట్టారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈరోజు మ్యాచ్ పూర్తయ్యే సరికి కోహ్లీ జెర్సీ బురదమయంగా మారిన ఫొటోను షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని కొనియాడుతున్నారు. టీమ్ గెలుపుకోసం ఎంతో కష్టపడతారని అభినందిస్తున్నారు. అయితే, బ్యాటింగ్లోనూ ఇదే కసి ఉండాల్సిందని మరికొందరు సూచిస్తున్నారు.
ఒంటి కాలు మీద నిలబడే సామర్థ్యాన్ని బట్టి వ్యక్తి నాడీ-కండరాల పనితీరును తెలుసుకోవచ్చని ప్రముఖ వైద్యులు సుధీర్ కుమార్ తెలిపారు. 30 ఏళ్ల వ్యక్తి కళ్లు తెరిచి ఉంచి 45 సెకండ్ల కంటే ఎక్కువ సేపు నిలబడగలగాలని సూచించారు. అయితే, ఈ సామర్థ్యం వయసు రీత్యా తగ్గుతూ వస్తుందని వెల్లడించారు. 50ఏళ్ల వ్యక్తి 40Secs, 70 ఏళ్ల వ్యక్తి 20 సెకండ్లు ఒంటికాలిపై నిల్చోగలరని చెప్పారు. కళ్లు మూస్తే ఎక్కువసేపు నిల్చోలేరన్నారు.
AP: రిషికొండ నిర్మాణాలు పూర్తయ్యాక అందరినీ అనుమతిస్తామని CM చంద్రబాబు తెలిపారు. దీనిని దేనికి ఉపయోగించాలో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘అందరితో చర్చించిన తర్వాత దీనిపై ఓ నిర్ణయానికి వస్తాం. అధికారంలో శాశ్వతంగా ఉంటామనే భ్రమలో ఈ ప్యాలెస్ కట్టారు. ఒక్క భవనం కోసం సబ్ స్టేషన్, సెంట్రల్ AC, ఫ్యాన్సీ ఫ్యాన్లు ఎందుకు? పేదలను ఆదుకునేవారు ఇలాంటివి కడతారా?’ అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.