News April 24, 2024

ఖమ్మం సీటుపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు

image

TG: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఖమ్మం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. క్యాండిడేట్‌ గురించి చర్చించేందుకు జిల్లా మంత్రులు భట్టి, పొంగులేటి బెంగళూరు వెళ్లారు. AICC అధ్యక్షుడు ఖర్గేతో వేర్వేరుగా భేటీ అవ్వనున్నారు. తమ అభిప్రాయాన్ని ఆయనకు వివరించనున్నారు. మరోవైపు ఇప్పటికే రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరావు పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా రాయల నాగేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది.

News April 22, 2024

ఒక్క ఓటుతో వాజ్‌పేయి సర్కార్ తలకిందులు!

image

1998 ఎన్నికల్లో 182 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఇతరుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే ఏడాదిన్నరలోపే ఆ లోక్‌సభ రద్దైంది. అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో బలపరీక్ష అనివార్యమైంది. BSP మద్దతు ఇస్తామని.. ఓటింగ్ సమయంలో ఎదురు తిరగడంతో ఒక్క ఓటుతో వాజ్‌పేయి సర్కార్ తలకిందులైంది. అయితే 1999 ఎన్నికల్లో NDA సంపూర్ణ మెజార్టీ సాధించింది.<<-se>>#ELECTIONS2024<<>>

News April 22, 2024

టెన్త్ ఫలితాలు ఆలస్యం!

image

AP: పదోతరగతి ఫలితాలు ఆలస్యంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉ.11 గంటలకు ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఉ.11.30 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ఫలితాలు అరగంట ఆలస్యం కానున్నాయి. ఈసారి 6.03 లక్షల మంది టెన్త్ ఎగ్జామ్స్ రాశారు.

News April 22, 2024

రేపు లాస్ట్ డే.. ఎల్లుండి నుంచి సెలవులు

image

TG: రాష్ట్రంలోని పాఠశాలలకు రేపు లాస్ట్ వర్కింగ్ డే. ఎల్లుండి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టితో సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు ముగియనున్నాయి. మంగళవారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి, ఆన్‌లైన్ ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. ఇక బుధవారం నుంచి జూన్ 11 వరకు 49 రోజులపాటు విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి. జూన్ 12న బడులు తిరిగి తెరుచుకుంటాయి.

News April 22, 2024

RBI కీలక ఆదేశాలు

image

ఎన్నికల వేళ RBI కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్ద మొత్తంలో నగదు లేదా అనుమానాస్పద లావాదేవీల వివరాలివ్వాలని బ్యాంకుయేతర చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లందరినీ ఆదేశించింది. ఎన్నికల్లో అభ్యర్థులకు నగదు చేర్చేందుకు ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలను ఉపయోగించే అవకాశముందని పేర్కొంది. రూపే వంటి కార్డ్ నెట్వర్క్, రోజర్ పే, పేయూ, ఎంస్వైప్, ఇన్ఫీబీమ్, పేటీఎం, మొబీక్విక్, గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఇందులో ఉన్నాయి.

News April 22, 2024

లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

image

TG: రోడ్డుపై సిగ్నల్ వేయకుండా వాహనాలు ఆపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో అదే తరహాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. అతి వేగం ధాటికి ఆ కారు లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మునగాల మండలం ముకుందాపురం వద్ద ఈ ఘటన జరిగింది.

News April 22, 2024

చింత చిగురు కేజీ ధర రూ.700

image

చింత చిగురు ధర మటన్‌తో పోటీ పడుతోంది. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం రైతుబజార్‌లో కేజీ చింత చిగురు ధర రికార్డు స్థాయిలో రూ.700 పలికింది. గుడిమల్కాపుర్‌ రిటైల్ మార్కెట్లో రూ.500-600 విక్రయించారు. ఏటా సీజన్‌లోనే లభించడం, కోయడం కష్టంతో కూడుకున్న పని కావడంతో రైతులు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.

News April 22, 2024

ఈవీఎం సడెన్‌గా మొరాయిస్తే..?

image

ఎన్నికల వేళ ‘EVM మొరాయిస్తే’ అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఓటింగ్ జరుగుతుండగా ఈవీఎం అకస్మాత్తుగా పని చేయకపోతే వెంటనే కొత్త బ్యాలెట్ యూనిట్‌ను అక్కడికి పంపిస్తారు. అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్‌లోనూ నమోదై ఉంటాయి. అలాగే వీవీ ప్యాట్ స్లిప్పులూ అందుబాటులో ఉంటాయి. కౌంటింగ్ రోజున అన్ని EVMలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. బ్యాటరీ సాయంతో నడిచే EVMలను విద్యుత్ లేని ప్రాంతాల్లోనూ వినియోగించొచ్చు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 22, 2024

ఫెయిలైన వారికి సెలవుల్లో స్పెషల్ క్లాసులు

image

AP: హైస్కూల్ ప్లస్‌ స్కూళ్లలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ కోచింగ్ క్లాసులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇటీవల విడుదలైన ఇంటల్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 1262(27.79%) మంది, సెకండ్ ఇయర్‌లో 690(37.09%) మంది విద్యార్థులే పాసయ్యారు. వీరు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించనున్నారు. జూన్ 1 వరకు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు క్లాసులు జరుగుతాయి.

News April 22, 2024

రేపు పవన్ నామినేషన్

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం నామినేషన్ సమర్పిస్తారు. మరోవైపు రేపు ఉత్తరాంధ్రలో, ఎల్లుండి రాయలసీమలో పవన్, చంద్రబాబు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు.