India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ: వార్నర్, అభిషేక్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, పంత్ (C & WK), లలిత్, అక్షర్, కుల్దీప్, నోకియా, ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.
హైదరాబాద్: హెడ్, అభిషేక్, మార్క్రమ్, క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.
AP టెన్త్ ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. RESULTS.BSE.AP.GOV.IN అధికారిక సైట్తో పాటు Way2News యాప్లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్తో వాట్సాప్ సహా ఏ ప్లాట్ఫాంకైనా రిజల్ట్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News
TG: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చాలా బలహీనపడిందని, దాదాపు కనుమరుగైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘5 నెలలు గడిచినా.. కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ కూరుకుపోయింది. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టుకోలేని స్థితిలో ఉంది’ అని ఆరోపించారు.
మావోయిస్టుల అలజడితో ఛత్తీస్గడ్లోని బస్తర్ ప్రాంతం పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తుంటుంది. ఈ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికలు బహిష్కరించాలని మావోలు పిలుపునిచ్చినా ప్రజలు పట్టించుకోలేదు. నిన్న జరిగిన పోలింగ్లో ఆ సెగ్మెంట్లో 67.56% మంది ఓటేశారు. అయితే కరుడుగట్టిన మావో నేత హిడ్మాకు చెందిన పువర్తి గ్రామంలో మాత్రం ఒక్కరూ ఓటు వేయలేదు. భయం వల్లే ఓటు వేసేందుకు జనం ముందుకు రాలేదని అధికారులు తెలిపారు.
AP: టెన్త్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు విజయవాడలోని గేట్వే హోటల్లో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. అధికారిక సైట్ RESULTS.BSE.AP.GOV.INతో పాటు WAY2NEWS యాప్లో ఫలితాలను వేగంగా, సులభంగా పొందవచ్చు.
ఎన్నికలకు ఈసారి కాస్త ఎక్కువగా ‘సినీగ్లామర్’ తోడైంది. ఇప్పటికే హేమా మాలిని, కంగనా రనౌత్, రాధికా శరత్ కుమార్, నవనీత్ కౌర్, రచనా బెనర్జీ తదితరులు పోటీ చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ప్రముఖ నటి వర్షా ప్రియదర్శినికి BJD టికెట్ ఇచ్చింది. రాష్ట్రంలో MP, MLA ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బర్చానా MLA అభ్యర్థిగా వర్ష పేరును CM నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రెండు రోజుల క్రితమే ఆమె BJDలో చేరారు.
AP: రాష్ట్రంలో BRS నాయకుడు నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత కొణిజేటి ఆదినారాయణ నామినేషన్ వేశారు. ప్రస్తుతానికి ఆయన ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో KCRను కలిసి బీఫామ్ అడగాలని నిర్ణయించుకున్నారు. కాగా APలో BRS పోటీపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఆ పార్టీ సొంతింటిని చక్కదిద్దుకునే పనిలో పడింది. దీంతో ఏపీపై అంతగా దృష్టి సారించలేదని తెలుస్తోంది.
AP: వేసవి సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ ‘సెలవుల్లో సరదాగా-2024’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను.. పఠనాశక్తిని పెంపొందించడానికి టీచర్లు, HMలు ‘వుయ్ లవ్ రీడింగ్’ పోటీలు నిర్వహించాలని ఆదేశించింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, స్థానిక కమ్యూనిటీల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించింది.
TG: CM రేవంత్ రెడ్డి BJPలో చేరతారంటూ కొద్దిరోజులుగా BRS జోరుగా ప్రచారం చేస్తోంది. KCR, KTR సహా ఆ పార్టీ నేతలంతా ఇదే చెబుతున్నారు. BJP నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. మెజార్టీ సీట్లతో అధికారంలోకి వచ్చి, CM పదవి చేపట్టిన వ్యక్తి మరో పార్టీలోకి వెళ్లడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది కేవలం INCపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చేందుకు BRS అనుసరిస్తున్న స్ట్రాటజీ అని హస్తం నేతలు మండిపడుతున్నారు.
AP: ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు కుళ్లు మెదడుకు ఎప్పుడైనా వచ్చిందా అని CM జగన్ మండిపడ్డారు. ‘ప్రత్యేక హోదా తెస్తానని మాట తప్పాడు. ఇప్పుడు ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అనేలా హామీలిస్తున్నాడు. అక్కా, చెల్లి నమ్ముతారా? మా పాలనలో 31లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. అమ్మఒడి, చేయూత, చేదోడు లాంటి పథకాలు ఎప్పుడైనా చూశారా?. ఇంటింటికీ పౌర సేవలందేలా మహా వ్యవస్థను ఏర్పాటు చేశాం’ అని చెప్పారు.
Sorry, no posts matched your criteria.