News January 25, 2025

బీఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసులు ఏమయ్యాయి?: బండి సంజయ్

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో KTRను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సహా BRS నేతలపై పెట్టిన కేసులన్నీ ఏమయ్యాయని అన్నారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు సహా పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్ మాట్లాడారు. దావోస్ పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

News January 25, 2025

కిడ్నీ రాకెట్.. ఒక్కో సర్జరీకి ₹60లక్షలు: CP

image

TG: సరూర్ నగర్ అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి దందాకు సంబంధించిన వివరాలను రాచకొండ CP సుధీర్ బాబు వెల్లడించారు. ‘కిడ్నీ రాకెట్‌లో పవన్ అనే వ్యక్తి వైద్యులు, రోగులు, దాతలకు మధ్యవర్తిగా ఉన్నాడు. రాజశేఖర్, ప్రభ రిసీవర్లుగా ఉన్నారు. సుమంత్ ఆస్పత్రిని నిర్వహిస్తుండగా అవినాశ్ అనే వైద్యుడు సర్జరీలు చేశాడు. ఒక్కో సర్జరీకి ₹50-60లక్షలు వసూలు చేశారు. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు.

News January 25, 2025

మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి: CBN

image

AP: థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ నినాదమని CM CBN తెలిపారు. ‘ప్రపంచంలోని గొప్ప కంపెనీలన్నీ దావోస్‌కు వస్తుంటాయి. అక్కడికి వెళ్లడం వల్ల ప్రతినిధులను కలిసే అవకాశం వస్తుంది. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి. సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారుచేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు గొప్పస్థాయిలో ఉన్నారు. ధ్వంసమైన AP బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం’ అని అన్నారు.

News January 25, 2025

గూగుల్ రాక రాష్ట్రానికి గేమ్ ఛేంజర్: CBN

image

AP: దావోస్‌లో ఎన్ని MoUలు చేసుకున్నారంటూ వస్తున్న ప్రశ్నలపై CM చంద్రబాబు వివరణ ఇచ్చారు. ‘రామాయపట్నంలో రూ.95వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, LG కంపెనీ రూ.5వేల కోట్లు, రూ.65వేల కోట్లతో రిలయన్స్ బయో ఫ్యూయల్ ప్లాంట్ రాబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లతో పాటు గూగుల్ రాక రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్. విశాఖలో ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి’ అని తెలిపారు.

News January 25, 2025

రేపటి నుంచి కొత్త స్కీమ్స్.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకాలను రేపు ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. HYD మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాల అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దని, అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 25, 2025

వైఎస్ వివేకా చనిపోయారని తెలిసి షాక్ అయ్యా: VSR

image

AP: YS వివేకా మరణంపై విజయసాయి రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఆరోజు ఉదయం వివేకా చనిపోయారని ఓ విలేఖరి ఫోన్ చేసి చెప్పారు. అది విని షాక్ అయ్యా. సన్నగా, హెల్తీగా ఉండే వ్యక్తి సడెన్‌గా చనిపోవడం ఏంటీ అని ఆశ్చర్యపోయా. అవినాశ్‌కి ఫోన్ చేస్తే ఆయన వేరేవాళ్లకు ఫోన్ ఇచ్చి మాట్లాడించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని ఆ వ్యక్తి నాకు చెప్పారు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను’ అని ఢిల్లీలో చెప్పారు.

News January 25, 2025

‘సజ్జల వల్లే రాజీనామా చేశారా?’.. విజయసాయి సమాధానమిదే..

image

AP: వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పైచేయి వల్లే రాజీనామా చేశారని జరుగుతున్న ప్రచారంపై విజయసాయి రెడ్డి స్పందించారు. ‘నా ప్రాధాన్యం ఎవరూ తగ్గించలేరు. నా కెపాసిటీ నాకు తెలుసు. దాన్ని ఎవరూ అంచనా వేయలేరు. నా పదవికి న్యాయం చేయగలనని అనిపిస్తే చేస్తానని చెప్తా.. లేదంటే చేయనని చెప్తా. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం చేయగలనని అనుకోవడంలేదు. అందుకే ఎంపీ పదవి నుంచి తప్పుకున్నా’ అని వెల్లడించారు.

News January 25, 2025

ఫార్ములా-ఈ రేసు కేసులో FEO సంస్థకు నోటీసులు

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఎఫ్‌ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ సీఈవో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది. నోటీసులకు స్పందించిన సీఈవో విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కోరారు. FEO సంస్థకు HMDA రూ.50కోట్లకు పైగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్‌ను ఏసీబీ విచారించింది.

News January 25, 2025

జగన్ వద్దన్నా రాజీనామా చేశా: VSR

image

AP: రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి గాని పార్టీకి గాని న్యాయం చేయలేనన్న ఆలోచనతోనే రాజీనామా చేశానని విజయసాయి స్పష్టం చేశారు. తన కంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతారనే యోచనతో ఎంపీ పదవిని వీడానన్నారు. ఈ విషయాన్ని జగన్‌కు చెబితే, ఈ నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన చెప్పారని వెల్లడించారు. అయినా తన ఇష్టప్రకారం రాజీనామా చేశానని వివరించారు.

News January 25, 2025

జగన్ లండన్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పా: VSR

image

AP: MP పదవికి రాజీనామా చేసే విషయాన్ని జగన్ లండన్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ‘YCP ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారా?’ అన్న ప్రశ్నకు రాజకీయాల నుంచి తప్పుకున్నాక పార్టీకి రాజీనామా చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రానికి వెళ్లాక రాజీనామా లేఖ సమర్పిస్తానని చెప్పారు. తనలాంటి వెయ్యి మంది నేతలు వైసీపీని వీడినా జగన్‌కు ఏమీ కాదన్నారు.