India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం బూటకపు ఎన్కౌంటర్లు చేస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. వెంటనే ఆ ఆపరేషన్ను నిలిపివేయాలన్నారు. బస్తర్లో జరుగుతున్న ఎన్కౌంటర్లపై HYDలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలను అడవుల నుంచి పంపించి, ఖనిజ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. కాగా ఇటీవలి ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.

అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న భారతీయ విద్యార్థులు వణికిపోతున్నారు. స్టూడెంట్ వీసా (F-1) ఉన్నవాళ్లు యూనివర్సిటీ క్యాంపస్లోనే పార్ట్ టైమ్ చేయాలి. కానీ మనోళ్లు గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లలో జాబ్స్ చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నవారిపై ట్రంప్ ఫోకస్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో దొరికితే వీసా క్యాన్సిల్ చేసి, స్వదేశాలకు పంపిస్తారని స్టూడెంట్ల భయం.

మహేశ్ సినిమాపై అప్డేట్ ఇస్తూ డైరెక్టర్ <<15250716>>రాజమౌళి<<>> నిన్న ఇన్స్టాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దానికి ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అని మహేశ్ కామెంట్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్నట్లు రాజమౌళి నిన్న వీడియో షేర్ చేశారు. దీంతో #SSMB ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ మూవీని రూ.1000Crతో నిర్మించనున్నట్లు సమాచారం.

AP: 6నెలల పాటు యాంటిరెట్రో వైరల్ థెరపీ (ART) కేంద్రాల ద్వారా చికిత్స పొందిన HIV బాధితులకు ప్రభుత్వం నెలకు రూ.4వేల పెన్షన్ అందజేస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో కొన్న ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్(ICTC) వాహనాలను ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో సేవలందించడం కోసం వీటిని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఏపీలో 2.22 లక్షల మంది HIV బాధితులున్నారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ ఫైనల్లో నేడు అమీతుమీ తేల్చుకునేందుకు టాప్ సీడ్ సబలెంక, అమెరికా అమ్మాయి మాడిసన్ కీస్ సిద్ధమయ్యారు. రెండుసార్లు టైటిల్ సాధించి హ్యాట్రిక్పై కన్నేసిన సబలెంకను ఎదుర్కోవడం కీస్కు కఠిన సవాలే. అటు సెమీస్లో స్వైటెక్కు షాకిచ్చి ఫైనల్లోకి దూసుకొచ్చిన కీస్ కూడా సబలెంకను ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. మ్యాచ్ మ.2 గంటలకు ప్రారంభం కానుంది.

AP: వైసీపీలో కీలకంగా వ్యవహరించే విజయసాయిరెడ్డి కేసుల భయంతోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాకినాడ సీపోర్ట్స్ యజమాని కేవీ రావును బెదిరించి బలవంతంగా షేర్లు తీసుకున్నారని CID కేసు నమోదు చేసింది. ఇందులో జగన్, విజయసాయి నిందితులుగా ఉన్నారు. దీని ఆధారంగా ED కేసు నమోదు చేసి, VSRను విచారించింది. ప్రభుత్వం తలుచుకుంటే అరెస్టయ్యే అవకాశం కూడా లేకపోలేదని భావిస్తున్నారు.

2022- 23 ఏడాదికి సంబంధించి నీతి ఆయోగ్ ఫైనాన్సియల్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. మొత్తం 18 రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. అందులో భాగంగా ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్(ఏడాది ఆర్థిక ఆరోగ్య సూచిక)లో తెలంగాణ(43.6స్కోర్) 8వ స్థానంలో నిలిచింది. తొలిస్థానం ఒడిశా(67.8)కు దక్కింది. అటు ఏపీ 17వ స్థానంలో నిలిచింది. మరోవైపు, రెవెన్యూ మొబిలైజేషన్లో 75.2 స్కోర్తో రాష్ట్రం 2వ, అప్పుల సూచిలో 8వ ప్లేస్లో ఉంది.

*పరగడుపున నీరు తాగాలి. నీరు శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది.
*ధ్యానం, ప్రాణాయామం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
*15-30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీరానికి శక్తి వస్తుంది.
*రోజులో చేయాల్సిన ముఖ్యమైన పనులకు సమయం కేటాయించండి.
*ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోండి.

భారతదేశ ఎన్నికల సంఘం(ECI) స్థాపనకు గుర్తుగా ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. 1950 JAN 25న ECIను స్థాపించగా, 2011 నుంచి అదే రోజు వేడుక జరుగుతోంది. కొత్త ఓటర్లను ప్రోత్సహించడంతో పాటు ఓటుపై ప్రజల్లో అవగాహన కోసం ఏటా ఈ రోజు ECI అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే, JAN 1 వరకు 18ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసి 25న గుర్తింపు కార్డులు అందిస్తుంది. మీరు ఎన్నిసార్లు ఓటేశారో కామెంట్ చేయండి.

US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు ఇక నుంచి ఆర్థిక సహాయం చేయొద్దని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, అభివృద్ధి, సెక్యూరిటీ, ఉద్యోగ శిక్షణ, ఎమర్జెన్సీ రిలీఫ్ కోసం అమెరికా ప్రతి ఏడాది 50 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో అమెరికా ఖజానాకు ఈ నిధులు ఆదా కానున్నాయి. అయితే ఇజ్రాయిల్, ఈజిప్టుకు ఇచ్చే నిధులకు మినహాయింపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.