News April 18, 2024

ఇష్టం లేకుండానే డోన్ నుంచి పోటీ చేస్తున్నా: కోట్ల సూర్యప్రకాశ్

image

AP: కర్నూలు పార్లమెంట్ వదిలి డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. సభలో మాట్లాడుతూ.. ‘గత్యంతరం లేక కాంగ్రెస్‌ను వదిలి టీడీపీలో చేరా. ఇక ఆ పార్టీలోనే జీవితాంతం ఉంటా. ఇష్టం లేకుండానే డోన్ నుంచి పోటీ చేస్తున్నా’ అని చెప్పారు. మధ్యలో భావోద్వేగానికి గురై ప్రసంగాన్ని ఆపేసి కుర్చీలో కూర్చున్నారు.

News April 18, 2024

కవిత అరెస్టుపై తొలిసారి స్పందించిన KCR

image

TG: తన కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై BRS అధినేత కేసీఆర్ తొలిసారి స్పందించారు. ‘ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో BL.సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి మోదీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్టు చేయించి జైలుకు పంపారు. మోదీ దుర్మార్గుడు’ అని కేసీఆర్ విమర్శించారు.

News April 18, 2024

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ వదులుతుందా?: KCR

image

TG: BRS నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌‌లో అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని చెప్పారని తెలిపారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లోకి వచ్చారని చెప్పారు. గతంలో 104 మంది ఎమ్మెల్యేలున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, అలాంటిది 64 మందే ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదులుతుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

News April 18, 2024

వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్ ఇదే

image

గాజా-ఇజ్రాయెల్ పోరు ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. గత ఏడాది అక్టోబర్‌లో పాలస్తీనియన్ ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో చాలా మంది మరణించారు. దాడి అనంతరం ఓ ఆస్పత్రి మార్చురీలో రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ మహ్మద్ సలేం తీసిన ఫొటో ఇప్పుడు వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఓ మహిళ తన ఐదేళ్ల మేనకోడలి మృతదేహాన్ని పట్టుకుని రోదిస్తుండగా ఈ ఫొటోను తీశారు.

News April 18, 2024

ఉద్యమకాలం నాటి KCRను మళ్లీ చూస్తారు: కేసీఆర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం నెలకొంటుందని, ఏది జరిగినా BRSకే మేలు అని వ్యాఖ్యానించారు. ఉద్యమకాలం నాటి KCRను మళ్లీ చూస్తారని, ఇవాళే బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేస్తానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తమదే గెలుపని పార్టీ నేతలతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

News April 18, 2024

వారికి ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్ ఎంట్రీ

image

నిన్న అహ్మదాబాద్‌లో జరిగిన గుజరాత్, ఢిల్లీ మ్యాచ్‌కు క్యాన్సర్, తలసేమియా బాధితులకు ఫ్రీ ఎంట్రీ కల్పించారు. వారితోపాటు కుటుంబసభ్యులకు కూడా ఉచితంగా మ్యాచ్ చూపించారు. వారిలో సంతోషం, ప్రేరణ కలిగించేందుకే ఈ సౌకర్యం కల్పించినట్లు తెలుస్తోంది. దాదాపు 12 వేలమందికి ఉచిత ప్రవేశం కల్పించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా చొరవతో వీరికి ఈ సదుపాయం కల్పించినట్లు సమాచారం.

News April 18, 2024

నా కొడుకు గంజాయి అమ్మేవాడా?: పేర్ని నాని

image

AP: తన కొడుకు, మచిలీపట్నం YCP అభ్యర్థి పేర్ని కిట్టు గంజాయి అమ్మేవాడని చంద్రబాబు అనడం దుర్మార్గమని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కిట్టు సేవలు చేశారు. ఆయన చేసింది ఎవరిని అడిగినా చెబుతారు. నా కుమారుడు గంజాయి అమ్మే వ్యక్తిలాగా కనిపిస్తున్నారా? అలాంటి వ్యక్తిపై బాబు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. బాబుకు వయసు పెరిగినా బుద్ధి మారలేదు’ అని ఆయన విరుచుకుపడ్డారు.

News April 18, 2024

డ్రైవర్ అన్నలూ.. నిర్లక్ష్యంతో ప్రాణాలు తీయకండి

image

రోడ్డుపై నిలిపి ఉంచిన లారీలు, భారీ వాహనాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. జాతీయ రహదారులపై బ్రేక్ డౌన్ అవడం, విశ్రాంతి కోసం కొంతమంది లారీ డ్రైవర్లు ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా ఆపేస్తున్నారు. దీంతో వేగంగా వచ్చే కార్లు వెనుక నుంచి ఢీకొడుతున్నాయి. నిన్న వడోదరలో ఈ తరహా ప్రమాదంలో 10 మంది మరణించారు. రోడ్డుపై లారీలు ఆపకూడదు. ఒకవేళ ఆపాల్సి వస్తే ఇండికేటర్స్ ఆన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
SHARE IT

News April 18, 2024

కాకినాడ: ఓటములకు ‘చెల్లుచీటీ’ రాస్తారా? గెలుపు ‘ఉదయించేనా’?

image

కాకినాడ MP స్థానంలో వరుసగా 3 సార్లు స్వల్ప తేడాతో ఓడి రెండో స్థానంలో నిలిచిన చలమలశెట్టి సునీల్ YCP నుంచి బరిలో దిగుతున్నారు. జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సానుభూతి, వైసీపీ బలం కలిసొస్తుందని సునీల్, కూటమి సహకారం, పవన్ క్రేజ్ గట్టెక్కిస్తుందని ఉదయ్ ధీమాగా ఉన్నారు. ఇక్కడ 10సార్లు INC, TDP 5సార్లు, YCP, CPI, BJP ఒక్కోసారి గెలిచాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

‘కన్నప్ప’లో కాజల్ అగర్వాల్?

image

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కాజల్.. పార్వతి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ పాత్రలో నయనతార నటించాల్సి ఉంది. కానీ ఏ కారణాలవల్లో ఆమె అర్ధంతరంగా సినిమా నుంచి తప్పుకున్నారు. ముకేశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.