India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఛార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే నెలలో జరిగే ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్షల అడ్మిట్ కార్డులు https://eservices.icai.orgలో అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరినా ఢిల్లీ హైకోర్టు అంగీకరించలేదు.
APలోని 76 మండలాల్లో గురువారం తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 229 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ప్రభావిత మండలాలను ఈ <
యంగ్టైగర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్కు ట్రిపుల్ ట్రీట్ ఉండనున్నట్లు సమాచారం. ఆ రోజు వార్ 2 మూవీ నుంచి ఫస్ట్ లుక్, దేవర నుంచి ఫస్ట్ సింగిల్, అలాగే ప్రశాంత్ నీల్ మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ రానున్నట్లు టాక్. ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాల షూటింగ్లతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.
నెల్లూరు లోక్సభ స్థానం TDP, YCPలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఆర్థిక, అంగ బలం పుష్కలంగా ఉన్న విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య ఫైట్ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మొన్నటిదాకా YCPకి జిల్లా పెద్దగా ఉన్న వేమిరెడ్డి TDPలో చేరి ప్రత్యర్థిగా మారారు. గతంలో కాంగ్రెస్ కంచుకోటైన ఈ ప్రాంతంలో 2012 నుంచి YCP గెలుస్తోంది. ఇక్కడ పైచేయి సాధించాలని ఇద్దరు నేతలూ తీవ్రంగా యత్నిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
శ్రీరామ నవమి సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్న 11వ సినిమాను మేకర్స్ అనౌన్స్ చేశారు. డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ‘ఈ దివ్యమైన శ్రీరామ నవమి సందర్భంగా వెలుగు vs చీకటి మధ్య సాగే యుద్ధం ఒక కొత్త రూపం తీసుకుంటుంది. కొత్త-యుగం హారర్ మిస్టరీని #BSS11లో చూపించనున్నాం’ అని సాయి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఈ మూవీకి అజనీశ్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
AP: అధికారం కోసం జగన్ ముద్దులు పెట్టాడు.. బుగ్గలు నిమిరాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుద్దుడే గుద్దుడు అని విమర్శించారు. ‘జగన్ మళ్లీ మరో నాటకం ఆడుతున్నారు. గులక రాయి అంటూ డ్రామాలాడుతున్నారు. రాష్ట్రంలో జగనాసుర వధ జరిపి.. రామరాజ్యం స్థాపిస్తాం. సర్వేలన్నీ కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
టీ20 వరల్డ్కప్కు మొత్తం 20 మంది సభ్యులను పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 15 మంది స్క్వాడ్, 5 మంది స్టాండ్ బై ప్లేయర్లు ఉండనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన జట్టును ఇప్పటికే బీసీసీఐ సెలక్ట్ చేసినట్లు టాక్. జట్టు: రోహిత్, కోహ్లీ, జైస్వాల్, గిల్, సూర్య, హార్దిక్, పంత్, రింకూ, కేఎల్ రాహుల్, శాంసన్, జడేజా, దూబే, అక్షర్, కుల్దీప్, చాహల్, బిష్ణోయ్, బుమ్రా, సిరాజ్, అర్ష్దీప్, అవేశ్.
బెంగళూరులో ఓ సంస్థ కొత్త వ్యాపారం విమర్శలకు దారి తీస్తోంది. తమ వద్ద రూ. 1500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చెట్లను హగ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని సదరు సంస్థ ప్రకటించింది. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ప్రకృతిని ప్రేమించేలా చేయడం ఓకేగానీ ఇలా దాన్ని సొమ్మ చేసుకోవడమేంటంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిలువు దోపిడీ స్కీమ్స్ను నమ్మొద్దంటూ సూచిస్తున్నారు.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
గుజరాత్: గిల్, సాహా, సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్
ఢిల్లీ: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్, స్టబ్స్, హోప్, పంత్, అక్షర్, సుమిత్, కుల్దీప్, ఇషాంత్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా లక్నోలో 30 రోజుల పాటు సాగిన లాంగ్ షూటింగ్ షెడ్యూల్ నేటితో పూర్తయినట్లు డైరెక్టర్ ట్వీట్ చేశారు. షూటింగ్లో చెమట చిందించిన హీరో రవితేజ, విలన్ జగపతిబాబుకు ఆయన థాంక్స్ చెప్పారు. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.