News January 23, 2025

జువైనల్ హోమ్ బాలికల ఫిర్యాదు.. మొదలైన విచారణ

image

AP: విశాఖ జువైనల్ హోమ్ బాలికల ఫిర్యాదుపై చైల్డ్ రైట్స్ కమిషన్ విచారణ చేపట్టింది. తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి రోగులుగా మారుస్తున్నారని జువైనల్ హోమ్ గోడలపైకి ఎక్కి పలువురు బాలికలు నిన్న హల్‌చల్ చేశారు. రోడ్డుపైకి రాళ్లు విసురుతూ పోలీసులను బూతులు తిట్టారు. తమను వెంటనే బయటికి తీసుకెళ్లాలని కేకలు వేశారు. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత విచారణ చేపట్టాలని సీపీ, కలెక్టర్‌ను ఆదేశించారు.

News January 23, 2025

దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం దూకుడు

image

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో TG ప్రభుత్వం రూ.71,800Cr పెట్టుబడులను ఆకర్షించింది. ఇది గతేడాదితో పోలిస్తే ఎక్కువ.
* సన్ పెట్రో కెమికల్స్(రూ.45,500Cr, 7000 జాబ్స్)
* మేఘా ఇంజినీరింగ్(రూ.15000Cr, 4250 జాబ్స్)
* కంట్రోల్ S(రూ.10,000Cr, 3600 జాబ్స్)
* JSW(రూ.800Cr, 200 జాబ్స్)
* స్కైరూట్(రూ.500Cr)
* HCL, విప్రో కొత్త సెంటర్ల ఏర్పాటు ద్వారా 10వేల ఉద్యోగాలు
* యూనీలివర్ 2 మ్యానుఫాక్చర్ యూనిట్లు నెలకొల్పనుంది.

News January 23, 2025

బాలీవుడ్ సెలబ్రిటీలకు పాక్ నుంచి బెదిరింపు మెయిల్స్!

image

బాలీవుడ్ సెలబ్రిటీలను చంపేస్తామంటూ మెయిల్స్ రావడం కలకలం సృష్టిస్తోంది. కమెడియన్ కపిల్ శర్మ, యాక్టర్ రాజ్‌పాల్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, సింగర్ సుంగధ మిశ్రాకు బుధవారం మెయిల్స్ వచ్చాయి. ‘మిమ్మల్ని గమనిస్తున్నాం. మాది పబ్లిక్ స్టంట్ కాదు. మీరు స్పందించకుంటే కఠిన చర్యలు తప్పవు’ అని అందులో బెదిరించారు. దీంతో వారు FIR నమోదు చేశారు. మెయిల్, IP అడ్రస్‌ను ట్రేస్ చేయగా పాక్‌ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది.

News January 23, 2025

IT దాడులు.. డాక్యుమెంట్లు స్వాధీనం

image

హైదరాబాద్‌లో 3వ రోజు సినీ ప్రముఖుల ఇళ్లల్లో <<15230852>>దాడులు <<>>చేస్తున్న IT అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ సంస్థల వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను సైతం చెక్ చేశారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదయ్యాకే సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

News January 23, 2025

భార్యను నరికి తలకాయ కాల్చగా..

image

TG: నరరూప రాక్షసుడు గురుమూర్తి భార్యను చంపిన <<15230164>>ఘటనలో<<>> మరిన్ని సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. భార్యను ముక్కలు చేసిన అతడు తలకాయను కాల్చగా చుట్టుపక్కల వాళ్లకు వాసన వచ్చినట్లు తెలిసింది. అయితే సంక్రాంతి పండగ కావడంతో మేక తలకాయ కావొచ్చని అనుకున్నారట. ఇక భార్య శరీరాన్ని ముక్కలు చేయడాన్ని అతడు వీడియో తీసినట్లు సమాచారం. బాడీని మాయం చేసేందుకు గురుమూర్తి పలుమార్లు ‘దృశ్యం’ సినిమా చూసినట్లు తేలింది.

News January 23, 2025

ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నేతాజీ జయంతి నేడు!

image

బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన జాతీయవాద నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. 1897లో ఒడిశాలోని కటక్‌లో జన్మించిన బోస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమయ్యారు. కానీ, స్వతంత్రం కోసం దానిని పక్కన పెట్టి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. 1945లో బోస్ చనిపోయినట్లు భావిస్తారు.

News January 23, 2025

లోకేశ్‌కు భువనేశ్వరి, బ్రాహ్మణి విషెస్

image

AP: మంత్రి లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి విషెస్ తెలిపారు. ‘రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు WEFలో పాల్గొంటున్న నీకు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ నానా’ అని భువనేశ్వరి ట్వీట్ చేశారు. ‘నాపై మీ ప్రేమ, అంకితభావానికి కృతజ్ఞురాలిని. మన రాష్ట్రం తరఫున WEFలో రిప్రజెంట్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే లవ్ ఆఫ్ మై లైఫ్’ అని బ్రాహ్మణి పోస్ట్ చేశారు.

News January 23, 2025

సంచలన తీర్పు.. RGVకి జైలు శిక్ష

image

2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు RGVని ముంబై అంధేరీ కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేశ్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా RGV విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.

News January 23, 2025

మోదీ దూతకు సహజంగానే ఎక్కువ మర్యాద దొరుకుతుంది: జైశంకర్

image

తొలి హయాంలో మోదీ సర్కారుతో మొదలైన సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డొనాల్డ్ ట్రంప్ బృందం ఆత్రుత ప్రదర్శిస్తోందని EAM జైశంకర్ అన్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో తొలి వరుసలో కూర్చోవడంపై స్పందించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దూతకు సహజంగానే ఎక్కువ మర్యాద లభిస్తుంది’ అని ప్రెస్‌మీట్లో చెప్పారు. మోదీ పంపిన లేఖను ట్రంప్‌ చేతికిచ్చానని తెలిపారు. బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు ఇదే ఉదాహరణ అన్నారు.

News January 23, 2025

భారీగా పెరిగిన ధరలు.. కేజీ రూ.450

image

AP: నాన్‌వెజ్ వంటలు ఘాటుగా ఉండాలంటే వెల్లుల్లి ఉండాల్సిందే. అయితే ధర మాత్రం అందుబాటులో లేదు. తాడేపల్లిగూడెం మార్కెట్‌లో KG ధర ₹450కి చేరింది. పదేళ్ల తర్వాత ఈ స్థాయిలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఇందోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా ప్రాంతాల్లో సాగు తగ్గడమే ధర పెరగడానికి కారణమంటున్నారు. గూడెం నుంచే గోదావరి, విశాఖ, VZM, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు వెల్లుల్లి ఎగుమతి అవుతుంటుంది.