News April 16, 2024

RCBని అమ్మిపారేయండి: టెన్నిస్ స్టార్

image

RCBని కొత్త ఫ్రాంచైజీకి విక్రయించాలని టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి అన్నారు. ఫ్రాంచైజీపై శ్రద్ధ వహించే యజమానికే అమ్మేయాలని సూచించారు. ఫ్యాన్స్ కోసమైనా ఆ పని చేయాలని కోరారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో ‘రూ.47 కోట్లు బెంచ్‌కే పరిమితం చేశారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గ్రీన్ (రూ.17.5 కోట్లు), మ్యాక్స్‌వెల్ (రూ.11.5 కోట్లు), జోసెఫ్ (రూ.11 కోట్లు), సిరాజ్ (రూ.7 కోట్లు) బెంచ్‌కే పరిమితమయ్యారు.

News April 16, 2024

సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లిన సీఎం

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వెళ్లారు. కాల్పుల ఘటన నేపథ్యంలో సల్మాన్‌ను ఆయన కలిశారు. భద్రతా ఏర్పాట్లపై సీఎం ఆరా తీసినట్లు సమాచారం. కాగా ఇటీవల సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ ఎదుట దుండగులు తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 16, 2024

CS, DGPని బదిలీ చేయాలి: ఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

image

AP: అధికార యంత్రాంగాన్ని YCP ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కూటమి నేతలు ECకి ఫిర్యాదు చేశారు. CS, DGP, ఇంటెలిజెన్స్ IGని బదిలీ చేయాలని కోరారు. విపక్ష నేతలను ప్రభుత్వం వేధిస్తోందని చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, సమస్యాత్మక పోలింగ్ బూత్‌లలో వీడియో రికార్డింగ్ చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. ECని కలిసిన వారిలో కనకమేడల రవీంద్ర, నాదెండ్ల మనోహర్, GVL నరసింహారావు ఉన్నారు.

News April 16, 2024

నాపై రాళ్లు వేయండని చంద్రబాబు చెబుతున్నాడు: CM

image

AP: చంద్రబాబు తనకు శాపనార్థాలు పెడుతున్నారని సీఎం జగన్ అన్నారు. ‘చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తోంది. హై బీపీ వస్తోంది. ఏవేవో తిడుతూ ఉంటాడు. శాపనార్థాలు పెడుతుంటాడు. నాకేదో అయిపోవాలని కోరుకుంటాడు. రాళ్లు వేయండి, అంతం చేయండి అని పిలుపునిస్తూ ఉంటాడు. బాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, కుట్రలు, మోసాలు గుర్తుకువస్తాయి’ అని విమర్శించారు.

News April 16, 2024

కూతురి ఎంట్రీ కోసం రూ.200కోట్లు?

image

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం రూ.200కోట్ల బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమయ్యారట. దీనికి సంబంధించి నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కింగ్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. 2025 ద్వితీయార్ధంలో థియేటర్లలో మూవీ రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. కాగా.. సుహానా గతంలో ఓటీటీ వేదికగా అలరించారు.

News April 16, 2024

తోట త్రిమూర్తులుకు బెయిల్ మంజూరు

image

AP: శిరోముండనం కేసులో జైలు శిక్ష పడిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్ మంజూరైంది. విశాఖ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా దళితులను హింసించిన కేసులో త్రిమూర్తులు సహా 10 మంది నిందితులకు 18 నెలల జైలు శిక్షతో పాటు ₹2.50 లక్షల ఫైన్ విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. ప్రస్తుతం త్రిమూర్తులు మండపేట YCP అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

News April 16, 2024

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. ముగ్గురు పోలీసులకూ గాయాలైనట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని కాంకేర్ జిల్లా పోలీసులు వెల్లడించారు.

News April 16, 2024

గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత: రేవంత్ రెడ్డి

image

TG: గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చట్టబద్ధమైన ఏజెంట్ల ద్వారా మాత్రమే కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లేలా చేస్తామన్నారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని పేర్కొన్నారు. ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిప్పీన్స్, కేరళలో మంచి విధానం అమల్లో ఉందని, అన్నీ అధ్యయనం చేసిన తర్వాత సమగ్ర విధానం రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

News April 16, 2024

భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఫిక్స్

image

భద్రాచలంలోని శ్రీసీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందించనున్నారు. కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. దీంతో ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు.

News April 16, 2024

భారత రైల్వే.. ఆసక్తికర విషయాలు

image

★ వరల్డ్‌లోనే అత్యంత రద్దీ కలిగిన వ్యవస్థగా భారతీయ రైల్వే
★ ఏడాదికి సుమారు 8.086 బిలియన్ల మంది రైలు ప్రయాణం చేస్తారు
★ ఇండియాలో 1,27,760 కి.మీ మేర రైల్వే లైన్లు ఉన్నాయి
★ స్పీడుగా నడిచే రైలు వందే భారత్
★ నెమ్మదిగా నడిచే రైలు నీలగిరి ప్యాసింజర్ (గంటకు 10KM)
★ ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్ (4,286KM)
★ కర్ణాటకలోని హుబ్బళ్లి రైల్వే ప్లాట్‌ఫారమ్ అత్యంత పొడవైనది (1507M)