News January 22, 2025

రేపటి నుంచి స్లాటెడ్ దర్శన టోకెన్ల జారీ

image

తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రేపటి నుంచి జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. SSD టోకెన్ల జారీపై అధికారులతో TTD EO సమీక్షించారు. ఈ విధానం లేకుండా దర్శనాలు ఎలా జరిగాయి? రద్దు చేస్తే కలిగే పరిణామాలు, క్యూ లైన్లు, భద్రత వంటి అంశాలపై చర్చించారు. రేపటి నుంచి ఏ రోజుకారోజు టోకెన్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసంలో జారీ చేయాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు.

News January 22, 2025

MLAకు గుండెపోటు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

image

TG: గుండెపోటుకు గురైన BRS ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కుటుంబంతో సహా డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న ఆయన 2 రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు స్టంట్ వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

News January 22, 2025

GHMC మేయర్‌పై అవిశ్వాసానికి BRS ప్లాన్!

image

TG: GHMCపై రాజకీయంగా పట్టు నిలుపుకునేందుకు BRS వ్యూహాలు రచిస్తోంది. తమ పార్టీ నుంచి మేయరై కాంగ్రెస్‌లో చేరిన విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. కాగా ప్రస్తుతం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో కలిసి మొత్తం 198 మంది ఉన్నారు. BRSకు 98 మంది మద్దతు ఉంటేనే అవిశ్వాసానికి ప్రిసైడింగ్ అధికారి అనుమతిస్తారు. కానీ ఇప్పటి లెక్కల ప్రకారం BRS మద్దతుదారుల సంఖ్య 80కి మించడంలేదని విశ్లేషకుల అంచనా.

News January 22, 2025

వైద్య విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: ఇన్ సర్వీస్ అభ్యర్థులకు వైద్య విద్యలో PG ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ పీజీ-2024లో క్వాలిఫై అయిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 23న ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్పాట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. కాగా తెలంగాణ బయట ఎంబీబీఎస్ పూర్తి చేసి, 9, 10, ఇంటర్ రాష్ట్రంలో చదివిన వారికే ఈ అవకాశం ఉంది.

News January 22, 2025

66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపిణీ

image

కృష్ణా జలాలు చెరి సగం పంపిణీ చేయాలన్న <<15215783>>తెలంగాణ <<>>ప్రతిపాదనను KRMB అంగీకరించలేదు. దీనిపై త్రిసభ్య కమిటీని నియమించనుంది. పాత ఒప్పందం 66:34 ప్రకారమే నీరు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 50:50 నిష్పత్తిలో నీటి కేటాయింపులను AP వ్యతిరేకించింది. అలాగే నీటి వాడకం లెక్కలూ తెలిసేలా టెలిమీటర్లు ఏర్పాటు చేయాలన్న TG ప్రతిపాదననూ ఒప్పుకోలేదు. అటు ప్రధాన కార్యాలయం HYD నుంచి విజయవాడ తరలించేందుకు KRMB ఆమోదం తెలిపింది.

News January 22, 2025

నేడు అనంతలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్

image

AP: సినీ నటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సభ నేడు అనంతపురంలో నిర్వహించనున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో సాయంత్రం 6.30 గంటలకు జరగనున్న ఈ సభకు హీరో బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ హాజరు కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతలో నిర్వహించాలని అనుకున్నా.. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రద్దు చేశారు. ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న రిలీజైన విషయం తెలిసిందే.

News January 22, 2025

ఇవాళ్టి నుంచి JEE మెయిన్ పరీక్షలు

image

దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో 2 సెషన్ల(ఉ.9-12, మ.3-6)లో పరీక్షలు జరగనున్నాయి. 30న బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.

News January 22, 2025

ALERT.. ఇవాళ, రేపు జాగ్రత్త

image

తెలంగాణను చలి వణికిస్తోంది. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తూ, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News January 22, 2025

ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు ప్రధాని మోదీ!

image

UPలోని ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాకు PM మోదీ FEB 5న వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10న ప్రయాగ్‌రాజ్ చేరుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

News January 22, 2025

నేను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో: డివిలియర్స్

image

తాను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో అనే అనుభూతి చెందుతున్నట్లు డివిలియర్స్ చెప్పారు. బంతిని ఊచకోత కోసే ఇతను గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాలనే నిర్ణయంతోనే ఇలా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నా కళ్లు ఇంకా పని చేస్తున్నాయి. గ్రౌండ్‌కు వెళ్లి బంతులను కొడుతూ మళ్లీ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు. దీంతో త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని ఏబీ ఫ్యాన్స్ SMలో కామెంట్లు పెడుతున్నారు.