News April 15, 2024

హిట్‌మ్యాన్ అంటార్రా బాబూ..

image

రోహిత్ శర్మ పేరు చెప్పగానే సిక్సర్లు గుర్తుకొస్తాయి. వన్డేల్లో, టీ20ల్లో, IPLలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్ రోహితే. అలాగే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ యాక్టివ్ ప్లేయర్ అతడే. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో హిట్‌మ్యాన్ 597 సిక్సర్లు కొట్టారు. IPLలో 272 సిక్సర్లు సాధించారు.

News April 15, 2024

జగన్ అనే నేను.. మళ్లీ మీ ముందుకి వస్తా: జగన్

image

AP: ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మూడు సెంట్ల స్థలం, రుణమాఫీ, సింగపూర్ తరహా అభివృద్ధి లాంటి హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ దుయ్యబట్టారు. ‘మళ్లీ బాబు, దత్తపుత్రుడు, BJP కలిసి వస్తున్నారు. లంచాలు లేని పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలి. 175కి 175 సీట్లలో ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు.. సిద్ధమేనా. దేవుడి దయతో జగన్ అనే నేను మళ్లీ మీ ముందుకి వస్తాను’ అని ఘంటాపథంగా చెప్పారు.

News April 15, 2024

రైల్వేలో 4,660 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

image

RPFలో 4,660 పోలీస్ ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్-4,208) భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. మే 14న రాత్రి 11.59 వరకు అప్లై చేసుకోవచ్చు. SI అభ్యర్థులకు డిగ్రీ, 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్ల వయసు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్‌లైన్‌ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

News April 15, 2024

బాబు చేష్టలకు కడుపు రగులుతోంది: జగన్

image

AP: ప్రతి గ్రామంలో తన మార్క్ పాలన కనిపిస్తుందని CM జగన్ చెప్పారు. ‘చంద్రబాబు మార్క్ అంటే పచ్చపాముల కాట్లు. రైతులకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు ఇవ్వొద్దన్నది బాబే. ఆయన చేసిన పనులకు కడుపు రగిలిపోతోంది. విద్య, వైద్య, సంక్షేమ రంగాల్లో మా సంస్కరణలు చూసి ఆయన కడుపు మండుతోంది. SC, ST, BC, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇంటింటికీ అభివృద్ధిని తెచ్చిన YCPకి అండగా నిలబడండి’ అని కోరారు.

News April 15, 2024

బంగారం ధర భారీగా పెరగడానికి కారణాలివే!

image

✒ ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ నిల్వలను అమ్మేసి ముడిచమురు లాంటి అవసరాలను తీర్చుకున్నాయి. ఇప్పుడు అవి మళ్లీ పసిడిని కొంటుండటంతో ధరలు పెరుగుతున్నాయి.
✒ ఈ ఏడాది 40కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ అనిశ్చితి భయాలతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.
✒ ఈ కారణాల వల్ల 24 క్యారెట్ల 10 గ్రాముల <<13056460>>ధర<<>> రూ.లక్షకు చేరొచ్చని నిపుణుల అంచనా.

News April 15, 2024

ఏడు దశాబ్దాల్లో ముగ్గురే మహిళా ఎంపీలు!

image

ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు నెలవైన ఉత్తరాఖండ్‌లో మహిళా MPల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు అక్కడ ముగ్గురంటే ముగ్గురే మహిళలు MPలుగా గెలిచారు. 1952లో ఉమ్మడి రాష్ట్రంలో తెహ్రీ నుంచి కమలేందు మతి షా ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. మళ్లీ ఇంకొక మహిళ MPగా గెలిచేందుకు 46 ఏళ్లు పట్టింది. 1998లో ఇలా పంత్(నైనిటాల్) నెగ్గారు. 2012లో రాజ్యలక్ష్మి షా MP స్థాయికి చేరుకోగలిగారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 15, 2024

అందుకే నాకు పెద్ద గాయం కాలేదు: CM

image

AP: ‘నా నుదుటిపై వారు చేసిన గాయం పది రోజుల్లో తగ్గిపోతుంది. కానీ పేదలకు చంద్రబాబు చేసిన గాయాలు ఎన్నటికీ తగ్గవు’ అని సీఎం జగన్ అన్నారు. దేవుడి దయతో రాయి కంటికి, తలకు తగల్లేదని చెప్పారు. దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడని, అందుకే తనకు పెద్ద గాయం కాలేదని తెలిపారు. తనపై చంద్రబాబు అండ్ కో దాడి చేస్తోందని, కుట్రలు చేస్తున్నారని జగన్ ఫైరయ్యారు.

News April 15, 2024

అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్

image

AP: ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పును హైదరాబాద్ సీబీఐ కోర్టు రిజర్వ్ చేసింది. సాక్షులను బెదిరిస్తున్నారని అవినాశ్ బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు ముగియగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.

News April 15, 2024

బాబుని నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్లే: జగన్

image

AP: వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని CM జగన్ ఆరోపించారు. హోదా ఏమైనా సంజీవనా? అని బాబు అన్నారని గుర్తుచేశారు. ‘పిల్లనిచ్చిన మామపై చెప్పులు వేయించి NTR చావుకు కారణమయ్యాడు. అవసరమైనప్పుడు NTR ఫొటో బయటకు తీస్తాడు. దొంగ వాగ్దానాలు చేయడమే ఈ పెద్దమనిషికి తెలుసు. బాబును నమ్మడమంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలాగా పెట్టడమే. పులి నోట్లో తల పెట్టినట్లే’ అని మండిపడ్డారు.

News April 15, 2024

వేలంలో రోహిత్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తా: జింటా

image

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తే తాము కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పంజాబ్ ఓనర్ ప్రీతీ జింటా తెలిపారు. ‘మా టీమ్‌కు స్థిరత్వం, ఛాంపియన్ మైండ్‌సెట్ ఉన్న కెప్టెన్ అవసరం. అవన్నీ హిట్‌మ్యాన్ వద్ద ఉన్నాయి. ఐపీఎల్ 2025 వేలంలోకి అతడు వస్తే ఎంత మొత్తమైనా ఖర్చు చేసి కొనుగోలు చేస్తాం’ అని ఓ ఇంటర్వ్యూలో జింటా చెప్పారు.