India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనకు సినిమాల్లో కంటే బయటే విలన్లు ఎక్కువగా ఉన్నారని హీరో విశాల్ అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రత్నం’ సినిమా తర్వాత స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్-2 మూవీ చేయనున్నట్లు తెలిపారు. మే 5న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. కొత్తగా ఏం చేస్తాడని అనుకునేవారి కోసమే ఈ సినిమా చేస్తున్నానన్నారు. కాగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రత్నం’ మూవీ ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 81,057 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 27,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి రూ.3.80 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.
TG: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నెల 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. అలాగే బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు కూడా నేటితో గడువు ముగియనుండగా.. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆయన అరెస్ట్, రిమాండ్ను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది.
ఐక్యత లేకపోవడం వల్లే దేశంలోని విపక్షాలు బలహీనపడి, తమ శక్తిని కోల్పోయాయని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ తెలిపారు. అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్లో అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని చెప్పారు. ముందుగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేపై అమర్త్యసేన్ విమర్శలు చేశారు. నిరక్షరాస్యత, లింగ అసమానతలు దేశంలోని పేదల పురోగతిని కష్టతరం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
TG: మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. 18.86 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారని.. ఏప్రిల్ 13 నాటికి కొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా పొందారని పేర్కొంది. మొత్తంగా 21.29 లక్షల మందికి రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 39.33 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు రూ.500కు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించింది.
ఐపీఎల్ వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ప్లేయర్ డారిల్ మిచెల్ ప్రదర్శన CSKకి ఆందోళన కలిగిస్తోంది. రూ.14 కోట్లు పెట్టి కొన్నప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారని ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచుల్లో మిచెల్ కేవలం 135 పరుగులు మాత్రమే చేశారు. రాబోయే మ్యాచుల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పపువా న్యూగినియాలో భూకంపం అలజడి సృష్టించింది. తెల్లవారుజామున భూమి కంపించినట్లు యూఎస్ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. రిక్టార్ స్కేల్పై 6.5 తీవ్రత నమోదైనట్లు పేర్కొంది. ఎలాంటి సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా గత నెలలో సంభవించిన భూకంపం ధాటికి ఐదుగురు మరణించారు.
TG: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం, BRS చీఫ్ కేసీఆర్ రేపు సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో బహిరంగ సభకు హాజరుకానున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి తరఫున ఆయన ఓట్లు అభ్యర్థించనున్నారు. ఈ సభకు సుమారు లక్ష మందిని సమీకరించేందుకు BRS ప్లాన్ చేస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావు సభ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. కాగా మెదక్ నుంచి BRS అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు.
AP: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును బోర్డు ఖరారు చేసింది. జనరల్, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలకు ₹550, ప్రాక్టికల్స్కు ₹250, బ్రిడ్జి కోర్సు పరీక్షలు రాసేందుకు ₹150 చెల్లించాలంది. అలాగే మార్కుల మెరుగుదలకు రాసే ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు ₹550 ఫీజుతో పాటు ఒక్కో పేపర్కు ₹160 చెల్లించాలంది. రీవెరిఫికేషన్కు ₹1300, రీకౌంటింగ్కు ₹260 చొప్పున ఈ నెల 18 నుంచి 24 వరకు చెల్లించాలని తెలిపింది.
Sorry, no posts matched your criteria.