India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇన్ఫోసిస్లో శాలరీ హైక్ చాలా తక్కువని సంస్థ మాజీ ఉద్యోగి తెలిపారు. 9 ఏళ్లు పనిచేసి 2017లో రిజైన్ చేసేనాటికి తన జీతం రూ.35 వేలు మాత్రమేనన్నారు. వేరే టెక్ కంపెనీలో చేరగా 4 ఏళ్లలో నెల వేతనం రూ.1.75 లక్షలకు చేరిందని చెప్పుకొచ్చారు. క్యాబ్, పార్కింగ్ వంటి సదుపాయాలు కూడా ఇన్ఫోసిస్లో ఉండేవి కావన్నారు. ప్రస్తుత కంపెనీలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని రెడిట్లో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

TG: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ పారదర్శకంగా రేషన్ కార్డులు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఇంకా ఎలాంటి జాబితా రెడీ కాలేదని తెలిపారు. ఖమ్మం(D) బనిగండ్లపాడులో మాట్లాడుతూ ఏ లిస్టు అయినా గ్రామ సభల్లోనే తయారవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులూ నమ్మొద్దన్నారు. అలాగే వ్యవసాయ యోగ్యమైన భూములకు షరతులు లేకుండా ఎకరానికి రూ.12వేలు ఇస్తామని పునరుద్ఘాటించారు.

అమెరికాలో టిక్టాక్ యాప్ బ్యాన్పై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని ఇన్వెస్టర్లు అందులో 50శాతం వాటా పొందేందుకు అనుమతి ఇస్తే ఆ యాప్పై బ్యాన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. కాగా మరికొన్ని గంటల్లో ట్రంప్ US అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఈ యాప్ US యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటూ అక్కడి సుప్రీంకోర్టు <<15193540>>టిక్టాక్ను<<>> నిషేధించిన విషయం తెలిసిందే.

భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్విటర్లో పెళ్లి ఫొటోలను పోస్ట్ చేశారు. దానికి నీరజ్- హిమాని అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా నీరజ్ భార్య హిమాని ప్రస్తుతం అమెరికాలో చదువుతున్నట్లు సమాచారం. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. త్వరలోనే గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో టిక్టాక్ బ్యాన్ అంశాన్ని తాను చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నానని బిలియనీర్ ఎలాన్ మస్క్ చెప్పారు. అది వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధమన్నారు. అయితే టిక్టాక్ను USలోకి అనుమతించినా చైనాలో Xకు ఎంట్రీ ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. కచ్చితంగా మార్పు రావాల్సి ఉందని Xలో పోస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవల అమెరికాలో టిక్టాక్ సేవలను <<15193540>>నిలిపివేసిన విషయం<<>> తెలిసిందే.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన గాజా కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో బందీల తొలి ఎక్స్ఛేంజీ జరిగింది. తమ చెరలో ఉన్న ముగ్గురిని ఇజ్రాయెల్కు హమాస్ అప్పగించింది. ఇందుకు బదులుగా తమ వద్ద ఉన్న 90 మంది పాలస్తీనా ఖైదీలను మరికొన్ని గంటల్లో ఇజ్రాయెల్ రిలీజ్ చేయనుంది. ఆ తర్వాత దశలో మరో 33 మంది ఇజ్రాయెలీలు హమాస్ చెర నుంచి విముక్తి పొందనున్నారు. బందీల మార్పు ప్రక్రియ 42 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ ఆల్రౌండర్, ఎంపీ షకీబ్ అల్ హసన్కు మరో షాక్ తగిలింది. IFIC బ్యాంకుకు సంబంధించి 3 లక్షల డాలర్ల చెక్ బౌన్స్ కేసులో ఢాకా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని సమన్లు ఇచ్చినా షకీబ్ స్పందించకపోవడంతో న్యాయస్థానం చర్యలకు దిగింది. కాగా ఇటీవల అతని బౌలింగ్పై ఐసీసీ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాతి నుంచి అతను విదేశాల్లోనే ఉంటున్నారు.

సైఫ్ అలీ ఖాన్పై దాడి నేపథ్యంలో ముంబైలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. నిందితుడికి అది సెలబ్రిటీ నివాసమని తెలియదని, దొంగతనం కోసమే వెళ్లాడని తెలిపారు. అతడు బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకు వచ్చి తర్వాత ముంబైకి మకాం మార్చాడన్నారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఖోఖో తొలి ప్రపంచకప్లోనే భారత్ తన సత్తా చాటింది. మన పురుషులు, మహిళల జట్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. కాసేపటి క్రితం ముగిసిన మెన్స్ ఫైనల్స్లో నేపాల్పై 54-36 తేడాతో టీమిండియా గెలుపొంది తొలి కప్ను ముద్దాడింది. అంతకుముందు అమ్మాయిల జట్టు సైతం నేపాల్ ఉమెన్స్ టీమ్ను 78-40 తేడాతో చిత్తు చేసి తొలి టైటిల్ను ఖాతాలో వేసుకుంది. భారత్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 23 దేశాలు పాల్గొన్నాయి.

TG: హైడ్రా పేరుతో 3 నెలలుగా INC ప్రభుత్వం హంగామా చేస్తోందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. బాలాజీ నగర్, జవహర్ నగర్లో పేదలు భూములు కొని 40 ఏళ్లుగా అక్కడ ఉంటున్నారని తెలిపారు. డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని దుయ్యబట్టారు. ప్రతి పనిలో 7-10 శాతం కమీషన్ ఇవ్వనిదే బిల్లులు సెటిల్ కావట్లేదన్నారు.
Sorry, no posts matched your criteria.