India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✒ తేది: జనవరి 19, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.28 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.04 గంటలకు
✒ ఇష: రాత్రి 7.20 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

✒ తిథి: బహుళ పంచమి
✒ నక్షత్రం: ఉత్తర సా.5.21 వరకు
✒ శుభ సమయం: సామాన్యము
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: రా.2.37-4.23 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.9.31-11.15 వరకు

✒ ట్రైనీ డాక్టర్పై హత్యాచారం.. దోషిగా సంజయ్
✒ తిరుమలలో అపచారాలు.. నివేదిక కోరిన కేంద్రం
✒ మావో కీలక నేత చొక్కారావు మృతి
✒ ఏపీకి అమిత్ షా.. చంద్రబాబు, పవన్తో భేటీ
✒ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచుతాం: పవన్
✒ స్టీల్ప్లాంట్కు గనులు కేటాయించండి: అమర్నాథ్
✒ ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం: భట్టి
✒ 94 శాతం మందికి ‘ఆత్మీయ భరోసా’ కట్: హరీశ్
✒ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన

ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారిద్దరూ US బయల్దేరినట్లు వార్తలొస్తున్నాయి. వర్జీనియా గోల్ఫ్ క్లబ్లో జరిగే ఈ మహోత్సవానికి ముందు రాత్రి ట్రంప్తో ‘క్యాండిల్ లైట్ డిన్నర్’లో వారు పాల్గొంటారని సమాచారం. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఉషా వాన్స్తోనూ సమావేశమవుతారని తెలుస్తోంది.

కరుణ్ నాయర్ను CTకి ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు. ఫామ్, పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ఎంపిక లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడటంలో అర్థమేముంది? అని ట్వీట్ చేశారు. దీంతో రాణించే ప్లేయర్లను కాకుండా ఫెయిల్యూర్ బ్యాటర్లనే జట్టులోకి తీసుకుంటారని కొందరు భజ్జీకి మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. ఎవరి ప్లేస్లో కరుణ్ను తీసుకోవాలో చెప్పాలని మరికొందరు ఎదురు ప్రశ్నిస్తున్నారు.

AP: కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా మరో మంత్రి బండి సంజయ్ కూడా ఆయన వెంట వచ్చారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద పవన్ కళ్యాణ్, నారా లోకేశ్తో సంజయ్ కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించి ఫొటోలను ఆయన తన ట్విటర్లో పోస్ట్ చేశారు.

AP: పలు నియోజకవర్గాలకు వైసీపీ నూతన సమన్వయకర్తలను నియమించింది. చోడవరానికి గుడివాడ అమర్నాథ్, మాడుగులకు బూడి ముత్యాలనాయుడు, భీమిలికి మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), గాజువాకకు తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరానికి గన్నవరపు శ్రీనివాసరావును నియమించింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్బాబుకు బాధ్యతలు అప్పగించింది.

మాంసం కూర తినేటప్పుడు చాలా మంది నిమ్మరసం పిండుకుంటారు. దీనివల్ల రుచితోపాటు పలు ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ రసంలోని విటమిన్-C వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు. హానికరమైన బ్యాక్టీరియా ఉంటే నాశనమవుతుందని, నిమ్మలోని సిట్రస్ యాసిడ్లు కూరకు రుచి మృదుత్వాన్ని చేకూరుస్తాయని అంటున్నారు. అయితే ఆ రసం మోతాదుకు మించొద్దని సూచిస్తున్నారు.

ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ డబుల్స్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్లో మలేషియా జోడీ గోహ్ స్జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్ 21-18, 21-14 తేడాతో గెలిచింది. కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇప్పటికే పీవీ సింధు కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా 21-9, 19-21, 21-17 తేడాతో గెలిచారు.

AP: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం డిన్నర్ చేశారు.
Sorry, no posts matched your criteria.