News April 13, 2024

ఆయనొచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేరు: మోదీ

image

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘అంబేడ్కర్ వచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేరు. మాకు అదే భగవద్గీత, రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్’ అని స్పష్టం చేశారు. ఇక త్వరలోనే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని మోదీ ప్రకటించారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే రోజు ఎంతో దూరం లేదన్నారు.

News April 13, 2024

టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్

image

TG: టెట్ అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్ అందించింది. దరఖాస్తులను మొబైల్ ఫోన్‌లోనూ ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటివరకు కంప్యూటర్లు, డెస్క్‌టాప్‌లపైనే దరఖాస్తులను సవరించుకునే వెసులుబాటు ఉండేది. ఈనెల 20వ తేదీ వరకు అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ గడువు కూడా ఈనెల 20తో ముగియనుంది.

News April 13, 2024

ఆ స్థానాల్లో సీపీఎం పోటీ: షర్మిల

image

AP: ఇండియా కూటమి పొత్తులో భాగంగా సీపీఎంకు ఒక ఎంపీ, 8 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించినట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. అరకు లోక్‌సభ నియోజకవర్గం, కురుపాం, రంపచోడవరం, గాజువాక, విజయవాడ సెంట్రల్, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు టౌన్, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తారని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News April 13, 2024

రికార్డు సృష్టించిన రిషభ్ పంత్

image

ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో (2028) మూడు వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రిషభ్ పంత్ రికార్డు సృష్టించారు. అతని తర్వాతి స్థానాల్లో యూసుఫ్ పఠాన్(2062), సూర్యకుమార్ యాదవ్(2130), రైనా(2135) ఉన్నారు. అంతేకాకుండా అతి పిన్న వయసులో 3వేల రన్స్ చేసిన ప్లేయర్లలో పంత్ మూడో స్థానంలో నిలిచారు. అతనికంటే (26y, 191d) ముందు గిల్ (24y, 215d), కోహ్లీ(26y, 186d) ఈ ఫీట్‌ను సాధించారు.

News April 13, 2024

ఈ నెల 14న దీక్ష: పొన్నం

image

TG: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 14న కరీంనగర్‌లో దీక్ష చేపడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మిగతా జిల్లాల్లోనూ చేపట్టాలని పార్టీ శ్రేణులను కోరారు. ఓట్ల కోసం దేవుడ్ని రాజకీయాల్లోకి లాగడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు గ్యారంటీల గురించి ప్రశ్నించడం సిగ్గు చేటన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన వారే ఓట్లడగాలని అన్నారు.

News April 13, 2024

రిషభ్ పంత్ మరో రికార్డు

image

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఐపీఎల్‌లో మరో రికార్డు సృష్టించారు. కనీసం 3,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్లలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన మూడో బ్యాటర్‌గా పంత్ (148.6) రికార్డులకెక్కారు. అగ్రస్థానంలో ఏబీ డివిలియర్స్ (151.68), రెండో స్థానంలో క్రిస్ గేల్ (148.96) ఉన్నారు. కాగా పంత్ ఈ ఐపీఎల్ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడి 194 పరుగులు చేశారు. అందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

News April 13, 2024

14వ రోజుకు చేరిన జగన్ బస్సు యాత్ర

image

AP: సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. ఉమ్మడి గుంటూరు(D) నంబూరు బైపాస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, CK కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కానున్నారు.

News April 13, 2024

గ్రూప్-1 ఫలితాలు విడుదల

image

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. మార్చి 27వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష రాసిన వారిలో 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు తెలుసుకోండి. మెయిన్స్ సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

News April 13, 2024

నేడు చంద్రబాబు ‘ప్రజాగళం’ సభలు ఎక్కడంటే?

image

AP: జనసేనాని పవన్‌తో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఉమ్మడి ప్రచారానికి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇవాళ తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ‘ప్రజాగళం’ సభలు నిర్వహించనున్నారు. రేపు పాయకరావుపేట, చోడవరం, గాజువాకలో, ఈ నెల 15న రాజాం, పలాస, టెక్కలిలో సభలు నిర్వహించనున్నారు. 16, 17న ఇరువురు నేతలు కలిసి ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తారు.

News April 13, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

TS: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ఏటీజీహెచ్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,163 మంది భక్తులు దర్శించుకోగా.. 31,287 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.99 కోట్లు సమకూరింది.