News April 11, 2024

టీడీపీలో చేరిన జగన్ సన్నిహితుడు

image

AP: సీఎం జగన్ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు టీడీపీలో చేరారు. మంగళగిరి సమీపంలోని కురగల్లు గ్రామానికి చెందిన ఆయన.. జగన్‌కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి విశాఖ వరకు 2వేల కి.మీ పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ విధానాలతో విభేదించిన ఆయన.. ఎస్సీ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

News April 11, 2024

నా పనైపోయిందేమోనని భయపడుతుంటా: కోహ్లీ

image

మైదానంలో చురుకుగా ఉంటూ పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీ తన వీక్‌నెస్ గురించిన ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. విమానంలో ప్రయాణించేటప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా ఫ్లైట్‌ ఒడుదొడుకులకు లోనైతే కోహ్లీ భయపడిపోతారట. ఆ సమయంలో పిరికివాడిలా ప్రవర్తిస్తానని, ఏదైనా తేడా వస్తే సీట్లను గట్టిగా పట్టుకునే మొదటి వ్యక్తిని తానే అని చెప్పుకొచ్చారు. అలా జరిగినప్పుడల్లా ఇక తన పనైపోయిందని అనుకుంటారట.

News April 11, 2024

సిక్కోలు గడ్డలో ఆసక్తికర పోటీ!

image

AP: రాజకీయ ఉద్దండులను చట్టసభలకు పంపిన ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం. ఇక్కడ TDP 6సార్లు, కాంగ్రెస్, స్వతంత్రులు 3సార్లు, కృషికార్, జనతా, YCP ఒక్కోసారి గెలిచాయి. YCP నుంచి మరోసారి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు బరిలోకి దిగగా.. ఆయనను ఢీకొట్టేందుకు సర్పంచ్ గొండు శంకర్‌ను టీడీపీ పోటీకి దింపింది. దీంతో దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నేత ధర్మాన, జూనియర్ లీడర్ మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 11, 2024

APPLY NOW.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 966 పోస్టులున్నాయి. ఇంజినీరింగ్/ సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 18లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. జూన్ 4వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. వేతనం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. వెబ్‌సైట్: https://ssc.gov.in

News April 11, 2024

ఒక్క పోస్ట్.. కిరీటాన్ని కోల్పోయిన బ్యూటీ క్వీన్!

image

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఓ బ్యూటీ క్వీన్ తన కిరీటాన్ని కోల్పోయేలా చేసింది. 2023 మలేషియా అందాల పోటీల విజేత నికాహ్ టెరిన్సిప్. ఇటీవల హాలిడే ట్రిప్ కోసం థాయ్‌లాండ్ వెళ్లిన ఈమె.. పొట్టి దుస్తులు ధరించి కొందరు వ్యక్తులతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె క్షమాపణలు తెలిపి టైటిల్‌ను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

News April 11, 2024

కవితకు నిరాశ

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై అత్యవసర విచారణ చేయాలని ఆమె లాయర్ సీబీఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తక్షణం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని ప్రత్యేక జడ్జి మనోజ్ కుమార్ తెలిపారు. కేసు గురించి తనకు ఎలాంటి విషయాలు తెలియవన్న జడ్జి.. తన ఎదుట అత్యవసర తీర్పులపైనే వాదనలు జరుగుతాయన్నారు. రేపు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ వేయాలని కవిత తరఫు లాయర్‌కు సూచించారు.

News April 11, 2024

మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?

image

మెటా వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ‘మెటా ఏఐ’ అనే ప్రత్యేక చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. ఈ ఏఐ చాట్‌బోట్‌తో యూజర్లు సరదాగా చాట్ చేయడం లేదా తమకు నచ్చిన ప్రశ్నలను అడగడం వంటివి చేయొచ్చు. Llama టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ మెటా ఏఐ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది. మరి మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?

News April 11, 2024

రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్

image

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్‌కి గౌరవ డాక్టరేట్ దక్కనుంది. చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా చరణ్ పాల్గొననున్నారు. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ ఇస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 11, 2024

ఏపీలో రూ.100కోట్ల విలువైన సొత్తు జప్తు

image

AP: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రూ.100 కోట్ల విలువైన నగదు, సొత్తును జప్తు చేశామని ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. వీటిలో మద్యం, డ్రగ్స్, ఆభరణాలు వంటివి ఉన్నాయన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతో పాటు పలు తనిఖీ కేంద్రాల ద్వారా నగదు రవాణాపై కన్నేసి ఉంచామని తెలిపారు. గడచిన 24 గంటల్లోనే రూ.1.97కోట్ల విలువైన సొత్తును జప్తు చేశామని పేర్కొన్నారు.

News April 11, 2024

జగన్ డబ్బు పిచ్చికి పేదలు బలి: కూటమి నేతలు

image

AP: మద్యంపై సీఎం జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారని కూటమి నేతలు ఆరోపించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పిన జగన్.. దానినే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని టీడీపీ నేత బోండా ఉమా మండిపడ్డారు. జగన్ డబ్బు పిచ్చికి పేదలు బలైపోయారని ఘాటుగా విమర్శించారు. మద్య నియంత్రణను తమ కూటమి సాధ్యం చేస్తుందని బీజేపీ నేత లంకా దినకర్, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు చెప్పారు.