News April 11, 2024

ఇంటర్ రిజల్ట్స్.. అందరికంటే ముందుగా..

image

AP ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. BIEAP అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి ఒక్క క్లిక్‌ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు.
#ResultsFirstOnWay2News

News April 11, 2024

50 ఏళ్లకే బీసీలకు పింఛన్: చంద్రబాబు

image

AP: తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘బీసీలకు పెళ్లికానుక రూ.లక్షకు పెంచుతాం. చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.10 లక్షలు అందిస్తాం. బీసీలకు పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తాం. రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు.

News April 11, 2024

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం: సజ్జల

image

AP: వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘గతంలో తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లను తొలగిస్తామని చంద్రబాబు, పవన్ విషం కక్కారు. కానీ ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ ఎలా వచ్చిందో? వారికి రూ.10 వేలు ఇస్తామంటున్నారు. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారు. వారు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు బదులు జన్మభూమి కమిటీలు వస్తాయి’ అని ఆయన మండిపడ్డారు.

News April 11, 2024

BIG BREAKING: కవితకు మరో షాక్

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. అదే కేసులో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవల కవితను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే ఈడీ కేసులో ఆమె తిహార్ జైలులో ఉన్నారు.

News April 11, 2024

తెలంగాణకు స్వాగతం మస్క్: మంత్రి శ్రీధర్ బాబు

image

కుబేరుడు ఎలాన్ మస్క్ ఇండియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన తెలంగాణ మీకు స్వాగతం పలుకుతోందని పేర్కొన్నారు. దేశంలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ స్థాపనపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. మస్క్ టెస్లా ప్లాంట్ కోసం $2 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్న నేపథ్యంలో.. దీనికి తెలంగాణ అనువైన ప్రదేశమని మంత్రి సూచించారు.

News April 11, 2024

కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

image

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్‌గార్టెన్‌(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.

News April 11, 2024

విషాదం: ఎంగేజ్‌మెంట్ రోజే నటుడు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌ నటుడు సూరజ్ మెహర్(40) మరణించారు. నిన్న సాయంత్రం ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషాదం ఏమిటంటే నిన్న రాత్రి సూరజ్ ఎంగేజ్‌మెంట్ జరగాల్సి ఉంది. ‘ఆఖ్రి ఫైస్లా’ సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయన సహచరుడు, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. సూరజ్ విలన్ పాత్రలతో గుర్తింపు పొందారు.

News April 11, 2024

ఆ నియోజకవర్గాల్లో YCP అభ్యర్థుల మార్పు?

image

AP: రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో YCP తమ అభ్యర్థులను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైలవరం-జోగి రమేశ్, విజయవాడ వెస్ట్-పోతిన మహేశ్, గుంటూరు2- కిలారు రోశయ్య, గుంటూరు ఎంపీ-విడదల రజినీ, కర్నూలు ఎంపీ-KE ప్రభాకర్, పి.గన్నవరం-పాముల రాజేశ్వరి, అవనిగడ్డ-సింహాద్రి చంద్రశేఖర్, చిలకలూరిపేట-మర్రి రాజశేఖర్, రాయచోటి-రెడ్డప్పగారి రమేశ్ రెడ్డికి సీట్లు కేటాయిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

News April 11, 2024

బౌద్ధంలో చేరాలంటే అనుమతి తప్పనిసరి: గుజరాత్ ప్రభుత్వం

image

గుజరాత్‌లో ప్రతి సంవత్సరం దసరాతో పాటు ఇతర పండగల సందర్భంగా మత మార్పిడులు జరుగుతుంటాయి. ఎక్కువగా దళితులు బౌద్ధత్వంలోకి మారుతుంటారు. అయితే ఈ విషయానికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధిజం కూడా ఒక మతమేనని, అందులో చేరాలంటే గుజరాత్ మత స్వేచ్ఛా చట్టం 2003 ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సర్క్యులర్ విడుదల చేసింది.

News April 11, 2024

DK బ్రదర్స్‌తో షర్మిల భేటీ

image

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన తమ్ముడు ఎంపీ డీకే సురేశ్‌తో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. బెంగళూరులో వీరిద్దరితో ఆమె ఎన్నికల ప్రచారంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రచారం చేయాలని వారిని కోరినట్లు సమాచారం. కాగా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే 10 మంది కర్ణాటక నేతలతో కూడిన జాబితా తయారైనట్లు టాక్. ఆ జాబితాలో వీరిద్దరూ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.