India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ESICలో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MBBS పూర్తి చేసి, యూపీఎస్సీ నిర్వహించిన CMSE-2022&2023 ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు 35 ఏళ్లు మించరాదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు <

కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్(సముద్రంలో ఆకస్మిక మార్పులు) ముప్పు పొంచి ఉందని కేంద్ర సంస్థ INCOIS హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా రేపు రా.11.30 వరకు అలలు 1 మీటర్ వరకు ఎగిసి పడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంది. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టారు. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పర్యాటకులు బీచ్లకు వెళ్లొద్దని సూచించింది.

దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగియగా NTA మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 23 వరకు గడువును పొడిగించింది. ఆరో క్లాస్కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్కు 13-15ఏళ్లు ఉండాలి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం <

హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

TG: హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతరకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన రాగానే అక్కడి ఏర్పాట్లపై భక్తులు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అధికారుల తీరుపై కోపంతో మంత్రి వసతి గృహం వద్ద నేలపై కూర్చున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు గర్భగుడిలోకి వెళ్లలేదు. అనంతరం ప్రెస్మీట్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.

రష్యా సైన్యంలో పనిచేస్తున్న తమ పౌరుల విడుదలను వేగవంతం చేయాలని భారత్ మరోసారి కోరింది. కేరళకు చెందిన ఓ యువకుడు ఇటీవల యుద్ధంలో మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన దురదృష్టకరమని భారత్ పేర్కొంది. కేరళ యువకుడి మృతదేహాన్ని తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎంబసీ తెలిపింది. భారతీయుల తరలింపునకు రష్యా ప్రభుత్వ వర్గాలతో చర్చిస్తున్నట్టు వెల్లడించింది.

శబరిమల కొండల్లో మకరజ్యోతి సాక్షాత్కారమైంది. అంతకుముందు పందళ రాజవంశీయులు తిరువాభరణాలతో సన్నిధానానికి చేరుకొని మణికంఠుడికి సమర్పించారు. పూజారులు వాటిని అయ్యప్పకు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వామి సన్నిధి తలుపులు తెరుచుకోగానే మరోవైపు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో భక్తులంతా జ్యోతిని దర్శించుకొని పులకించిపోయారు.

రేపు జరగాల్సిన యూజీసీ నెట్-2025 పరీక్షను <<15149513>>వాయిదా<<>> వేసిన NTA తాజాగా రీషెడ్యూల్ తేదీలను ప్రకటించింది. ఈనెల 21న ఉదయం, 27న మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా సంక్రాంతి సందర్భంగా 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ నిన్న NTA ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ మూవీకి తన మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని గ్లోబల్ స్టార్ రామ్చరణ్ అన్నారు. తనతో పాటు ఈ మూవీ కోసం కష్టపడ్డ ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. ఇకపైనా తన పర్ఫార్మెన్స్తో అభిమానులను గర్వపడేలా చేస్తానని ఇన్స్టాలో రాసుకొచ్చారు. చివరిగా తనకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్కు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు.

TG: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో పండగ రోజు రైతుల కల నెరవేరిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. దీని ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నట్లు చెప్పారు. ఎంపీ అర్వింద్ పట్టుదలతో తన హామీ నెరవేర్చుకున్నారని చెప్పారు. రైతుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి రైతులు తమ ఆశీర్వాదం అందించాలని బండి కోరారు.
Sorry, no posts matched your criteria.